<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/ysrcp/tag-173" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>Ysrcp - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/173/rss</link>
                <description>Ysrcp RSS Feed</description>
                
                            <item>
                <title>జగన్‌కు తృటిలో తప్పిన ప్రమాదం</title>
                                    <description><![CDATA[<ul>
<li><strong>పులివెందులలో జగన్ 3 రోజుల పర్యటన</strong></li>
<li><strong>కడప నుంచి పులివెందుల వెళ్తుండగా ఘటన </strong></li>
<li><strong>రామరాజు పల్లి వద్ద ఇన్నోవాను ఢీకొన్న ఫైర్ ఇంజిన్‌ వాహనం</strong></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/a-narrow-miss-for-jagan/article-2284"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/ysjagan-696x418-1.jpg" alt=""></a><br /><p>ఏపీ మాజీ సీఎం జగన్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. కడప విమానాశ్రయం నుంచి పులివెందులకు వెళ్తుండగా రామరాజు పల్లి వద్ద కాన్వాయ్‌ వాహనాలు ఢీకొన్నాయి. జగన్ కాన్వాయ్‌లోని ఇన్నోవా వాహనాన్ని ఫైర్ ఇంజన్ వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.</p>
<p>ఇదిలా ఉండగా ఇవాళ(శనివారం) జగన్ తన సొంత నియోజకవర్గమైన పులివెందులలో పర్యటిస్తున్నారు. మూడు రోజులు అక్కడే బస చేయనున్నారు. రాయలసీమ కు చెందిన ఎమ్మెల్యే అభ్యర్థులు, ముఖ్య నేతలు, కార్యకర్తలతో జగన్ భేటీ అవుతారు. మరోవైపు ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేలు 11మంది మాత్రమే గెలుపొందిన విషయం తెలిసిందే. శుక్రవారం తొలిరోజు అసెంబ్లీకి హాజరైన జగన్ బరువైన గుండెతో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, రెండో రోజు (ఇవాళ) నిర్వహించిన సమావేశానికి జగన్ హాజరు కాలేదు.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/a-narrow-miss-for-jagan/article-2284</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/a-narrow-miss-for-jagan/article-2284</guid>
                <pubDate>Sat, 22 Jun 2024 14:27:28 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/ysjagan-696x418-1.jpg"                         length="39493"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా</title>
                                    <description><![CDATA[<p>ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. మొత్తం 175 మంది ఎమ్మెల్యేలకు గాను, ఇవాళ 172 మంది ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణస్వీకారం చేయించారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/ap-assembly-adjourned-till-tomorrow/article-2236"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/28-19_v_jpg--442x260-4g.webp" alt=""></a><br /><p>ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. మొత్తం 175 మంది ఎమ్మెల్యేలకు గాను, ఇవాళ 172 మంది ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణస్వీకారం చేయించారు. ఎమ్మెల్యేలు జీవీ ఆంజనేయులు (వినుకొండ), పితాని సత్యనారాయణ (ఆచంట), వనమాడి వెంకటేశ్వరరావు (కాకినాడ ) అందుబాటులో లేకపోవడంతో ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు రేపు ప్రమాణం చేయనున్నారు. </p>
<p>ఇదిలా ఉంటే రేపు (జూన్ 22) ఉదయం 10.30 గంటలకు అసెంబ్లీ తిరిగి ప్రారంభం కానుంది. ముగ్గురు ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం అనంతరం స్పీకర్ ఎన్నిక ప్రక్రియ ఉండనుంది. ఏపీ అసెంబ్లీలో రేపు ఉదయం 11 గంటలకు స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడిని ఎన్నుకోనున్నారు. ఇప్పటికే అయ్యన్న తరఫున కూటమి నేతలు నామినేషన్ దాఖలు చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/ap-assembly-adjourned-till-tomorrow/article-2236</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/ap-assembly-adjourned-till-tomorrow/article-2236</guid>
                <pubDate>Fri, 21 Jun 2024 15:09:35 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/28-19_v_jpg--442x260-4g.webp"                         length="25908"                         type="image/webp"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కొడాలి నానిపై కేసు నమోదు </title>
                                    <description><![CDATA[<ul>
<li><strong>మాజీ మంత్రి నానిపై వలంటీర్ల ఫిర్యాదు </strong></li>
<li><strong>తమతో బలవంతంగా రాజీనామా చేయించారని ఆరోపణ</strong></li>
<li><strong>గుడివాడ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు </strong></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/-draft--add-your-title/article-2208"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/kodali-nani-784x441.jpg" alt=""></a><br /><p>ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఎన్నికల ఫలితాల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో వైసీపీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలపై ప్రతీకార చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మాజీమంత్రి కొడాలి నానికి గట్టి షాక్ తగిలింది. ఆయనపై పలువురు మాజీ వార్డు వలంటీర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. </p>
<p>ఎన్నికలకు ముందు పలువురు వార్డు వాలంటీర్లతో వైసీపీ నేతలు రాజీనామాలు చేయించిన సంగతి తెలిసిందే. దీంతో కొడాలి నాని తమను వేధించి బలవంతంగా రాజీనామా చేయించారంటూ ఆరోపిస్తూ వలంటీర్లు ఫిర్యాదు చేయడంతో గుడివాడ పోలీసులు కేసు నమోదు చేశారు. కొడాలి నానితో పాటు ఆయన సన్నిహితుడు దుక్కిపాటి శశిభూషణ్, గుడివాడ పట్టణ వైసీపీ అధ్యక్షుడు గొర్ల శ్రీను మరో ఇద్దరు వైసీపీ నేతలపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసిన‌ట్లు సమాచారం.</p>]]></content:encoded>
                
                                                            <category>Crime</category>
                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/-draft--add-your-title/article-2208</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/-draft--add-your-title/article-2208</guid>
                <pubDate>Fri, 21 Jun 2024 09:57:28 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/kodali-nani-784x441.jpg"                         length="41807"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>జగన్‌ ఓడిపోయాడంతే.. చావలేదు.. అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు </title>
                                    <description><![CDATA[<ul>
<li><strong>చర్చనీయాంశంగా టీడీపీ నేతల సంభాషణ</strong></li>
<li><strong>సోషల్ మీడియాలో వీడియో వైరల్ </strong></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/jagans-defeat-did-not-mean-ayyannapatras-sensational-comments%C2%A0/article-1827"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/screenshot-2024-06-14-144003.jpg" alt=""></a><br /><p>ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు ఫుల్ జోష్‌లో ఉన్నారు. ప్రస్తుతం పరిపాలనపై దృష్టి కేంద్రీకరిస్తూనే వైసీపీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా మాజీ సీఎం వైఎస్ జగన్‌పై టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ఓడిపోయాడు కానీ చావలేదని.. చచ్చేవరకూ కొట్టాలని టీడీపీ నేతలతో ఆయన సంభాషించడం చర్చనీయాంశమైంది. </p>
<p>దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ‘‘వైఎస్ జగన్‌కు అపారమైన జన, కుల బలం ఉంది. తెలంగాణ ప్రభుత్వంలో చాలా మంది అతనికి క్లోజ్‌గా ఉండే వారు..  చెప్పింది కరెక్ట్‌గా రిసీవ్ చేసుకోండి..’’ అంటూ అయ్యన్న పాత్రుడు అన్నారు. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇదిలా ఉండగా నాగబాబు కూడా వైసీపీపై విమర్శలు గుప్పించారు. ‘‘వైసీపీ కోరల్లో విషం మిగిలే ఉంది.. కూటమిపై విషప్రచారం చేసేవాళ్లను వదలం.. బీ కేర్‌ఫుల్..’’ అంటూ నాగబాబు హెచ్చరించారు.</p>
<div class="div_border" contenteditable="false">
<blockquote class="twitter-tweet">
<p dir="ltr" lang="te" xml:lang="te">జగన్ ఓడిపోయాడు కానీ చావలేదు <br /><br />అతనికి అపారమైన జన, కుల బలం ఉంది <br /><br />తెలంగాణ ప్రభుత్వంలో చాలా మంది అతనికి క్లోజ్ గా ఉండే వారు ఉన్నారు అంటూ తెలుగు దేశం పార్టీలో చర్చ <a href="https://t.co/Hf8Qpsky0K">pic.twitter.com/Hf8Qpsky0K</a></p>
— ఈశ్వర రెడ్డి (@eswarspeaks) <a href="https://twitter.com/eswarspeaks/status/1801486938710409413?ref_src=twsrc%5Etfw">June 14, 2024</a></blockquote>

</div>
<p>

</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/jagans-defeat-did-not-mean-ayyannapatras-sensational-comments%C2%A0/article-1827</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/jagans-defeat-did-not-mean-ayyannapatras-sensational-comments%C2%A0/article-1827</guid>
                <pubDate>Fri, 14 Jun 2024 14:42:29 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/screenshot-2024-06-14-144003.jpg"                         length="94642"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వైసీపీ గెలుస్తుందని రూ.30కోట్ల పందెం.. చివరికి..!!</title>
                                    <description><![CDATA[<p>ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి అత్యధిక స్థానాల్లో గెలుపొంది ప్రభుత్వ ఏర్పాటుకు సద్ధమవుతోంది. అయితే, ఎన్నికల వేళ వైసీపీ గెలుస్తుందని చాలా మంది బెట్టింగ్ వేసినట్లు తెలుస్తోంది.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/in-the-end-a-bet-of-rs-30-crores-that/article-1571"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/whatsapp-image-2024-06-10-at-8.05.06-am.jpeg" alt=""></a><br /><p>ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి అత్యధిక స్థానాల్లో గెలుపొంది ప్రభుత్వ ఏర్పాటుకు సద్ధమవుతోంది. అయితే, ఎన్నికల వేళ వైసీపీ గెలుస్తుందని చాలా మంది బెట్టింగ్ వేసినట్లు తెలుస్తోంది. ఓ వ్యక్తి వైఎస్సార్సీపీ గెలుస్తుందని ఏకంగా రూ.30కోట్ల పందెం వేశాడు. అయితే ఆ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఈ ఘటన ఏలూరు జిల్లాలో జరిగింది.</p>
<p>దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరు జిల్లా నూజివీడు మండలం తూర్పు దిగవల్లి గ్రామానికి చెందిన జగ్గవరపు వేణుగోపాల్ రెడ్డి భార్య సర్పంచ్. కాగా, వారు వైఎస్సార్సీపీ మద్దతుదారులు. సీఎం జగన్‌పై ఉన్న అభిమానంతో వేణుగోపాల్ రెడ్డి  ఆయనే గెలుస్తారని అనుకున్నాడు. అదే నమ్మకంతో రూ.30కోట్ల పందెం కట్టాడు. అయితే, ఫలితాల రోజు వేణుగోపాల్ రెడ్డి తన ఊరి విడిచి వెళ్లిపోయాడు. </p>
<p>అతడి జాడ కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు తెలిసిన వారిని ఆరాతీస్తూ ఊరంతా వెతికారు. అయినా ప్రయోజనం లేకుండాపోయింది. ఈ క్రమంలో వేణుగోపాల్ రెడ్డి తన పొలం వద్ద మామిడితోటలో అనుమానాస్పద స్థితిలో పడి ఉన్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Crime</category>
                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/in-the-end-a-bet-of-rs-30-crores-that/article-1571</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/in-the-end-a-bet-of-rs-30-crores-that/article-1571</guid>
                <pubDate>Mon, 10 Jun 2024 08:07:10 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/whatsapp-image-2024-06-10-at-8.05.06-am.jpeg"                         length="81691"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అధికారులు జవాబుదారీతనంతో పనిచేయాలి: భట్టి విక్రమార్క </title>
                                    <description><![CDATA[<p>ఎన్నికల కోడ్ ముగిసిందని గుర్తుచేస్తూ అధికారులు అభివృద్ధిపై దృష్టిసారించి జవాబుదారీతనంతో పనిచేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సూచించారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/officials-should-work-with-accountability-bhatti-vikramarka%C2%A0/article-1535"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/123228509_09bhatti-1a.jpg" alt=""></a><br /><p>ఎన్నికల కోడ్ ముగిసిందని గుర్తుచేస్తూ అధికారులు అభివృద్ధిపై దృష్టిసారించి జవాబుదారీతనంతో పనిచేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సూచించారు. ఖమ్మం జిల్లా మధిర క్యాంపు కార్యాలయంలో ఆదివారం మధిర అభివృద్ధిపై అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.  ఇచ్చిన మాట ప్రకారం మధిరను దేశంలో నెంబర్ వన్‌ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామన్నారు. మధిరలో అండర్ డ్రైనేజీల నిర్మాణానికి రూ.128 కోట్ల నిధులను విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. </p>
<p>అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద, యాంజియోగ్రామ్, పార్కిన్సన్స్, వెన్నునొప్పి వంటి ఖరీదైన వ్యాధుల చికిత్సలు, ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్సల ప్యాకేజీ ధరలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి రూ.497.29 కోట్లు అవసరం కాగా ఈ నిధులను విడుదల చేస్తూ డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రస్తుతం ఉన్న పథకాలకు సంబంధించి నూతన చికిత్సా విధానాలు, ఆర్థిక సవరణల కోసం రాష్ట్ర సచివాలయంలో భట్టి విక్రమార్కతో సమావేశం జరిగింది.2007లో కాంగ్రెస్ సర్కార్ ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ పథకం కింద 2.84 కోట్ల మంది లబ్ధిదారులున్నారు. ఈ పథకం ద్వారా వారికి 10 లక్షల వరకు ఆర్థిక సాయం అందనుంది. రాష్ట్రంలోని 1402 ఆసుపత్రుల ద్వారా ఈ సదుపాయం కల్పించబడింది.</p>
<p>ప్రస్తుతం ఈ పథకంలో 1672 చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో వైద్య నిపుణుల సూచనల మేరకు 1375 ప్రొసీజర్లకు ప్యాకేజీ ధరలను పెంచుతూ డిప్యూటీ సీఎం నిర్ణయించారు. యాంజియోగ్రామ్, పార్కిన్సన్స్ సన్, వెన్నుపూసలకు సంబంధించి ఆరోగ్యశ్రీలో అమలు చేయని 65 అధునాతన చికిత్స విధానాలను ఇక నుంచి ఆరోగ్యశ్రీలో అమలు చేయాలని నిర్ణయించారు. వీటితో పాటు ప్రస్తుతం ఆయుష్మాన్ భారత్‌లో ఉన్న 98 చికిత్సా విధానాలను రాజు ఆరోగ్యశ్రీలో చేర్చడం వల్ల ప్రభుత్వానికి దాదాపు 189.83 కోట్లు ఖర్చు, 65 కొత్త చికిత్సలను అంగీకరించడం వల్ల ప్రభుత్వం 158.20 కోట్లు ఖర్చు,  చేస్తుంది.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/officials-should-work-with-accountability-bhatti-vikramarka%C2%A0/article-1535</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/officials-should-work-with-accountability-bhatti-vikramarka%C2%A0/article-1535</guid>
                <pubDate>Sun, 09 Jun 2024 13:24:31 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/123228509_09bhatti-1a.jpg"                         length="37792"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వైఎస్ జగన్ సంచలన ట్వీట్ </title>
                                    <description><![CDATA[<p>రెండు రోజులుగా ప్రభుత్వ కార్యాలయాల్లో టీడీపీ శ్రేణులు విగ్రహాలు, శిలాఫలకాలు ధ్వంసం చేస్తూ వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడులకు పాల్పడుతున్నారు. వాహనాలను ధ్వంసం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన ట్వీట్ చేశారు. </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/ys-jagan-sensational-tweet%C2%A0/article-1326"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/jagan1.jpg" alt=""></a><br /><p>ఏపీలో ఎన్నికల ఫలితాల తర్వాత అక్కడక్కడా విధ్వంసకర పరిస్థితులు నెలకొన్నాయి.  రెండు రోజులుగా ప్రభుత్వ కార్యాలయాల్లో టీడీపీ శ్రేణులు విగ్రహాలు, శిలాఫలకాలు ధ్వంసం చేస్తూ వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడులకు పాల్పడుతున్నారు. వాహనాలను ధ్వంసం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన ట్వీట్ చేశారు. </p>
<p>టీడీపీ నేతల దాడులతో ఏపీలో భయానక వాతావరణం నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా ఆయన ఈ విధంగా ట్వీట్ చేశారు. ‘రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొంది. ప్రభుత్వం ఏర్పాటుకాకముందే టీడీపీ ముఠాలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల్లాంటి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. వైయస్సార్‌సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయింది. అధికారపార్టీ ఒత్తిళ్లతో పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారిపోయింది. వెరసి ఐదేళ్లుగా పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి.’ అని పేర్కొన్నారు. </p>
<p>అదేవిధంగా గౌరవ గవర్నర్‌ గారు వెంటనే జోక్యం చేసుకుని పచ్చమూకల అరాచకాలను అడ్డుకోవాలని విన్నవించారు. ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు, ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా నిలవాలని విజ్ఞప్తిచేస్తున్నామని పేర్కొన్నారు. టీడీపీ దాడుల కారణంగా నష్టపోయిన ప్రతి కార్యకర్తకూ, సోషల్‌ మీడియా సైనికులకు తోడుగా ఉంటామని జగన్ భరోసా ఇచ్చారు.</p>
<div class="div_border" contenteditable="false">
<blockquote class="twitter-tweet">
<p dir="ltr" lang="te" xml:lang="te">రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొంది. ప్రభుత్వం ఏర్పాటుకాకముందే టీడీపీ ముఠాలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల్లాంటి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. వైయస్సార్‌సీపీకి చెందిన నాయకులు,…</p>
— YS Jagan Mohan Reddy (@ysjagan) <a href="https://twitter.com/ysjagan/status/1798624761561616749?ref_src=twsrc%5Etfw">June 6, 2024</a></blockquote>

</div>
<p>

</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/ys-jagan-sensational-tweet%C2%A0/article-1326</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/ys-jagan-sensational-tweet%C2%A0/article-1326</guid>
                <pubDate>Thu, 06 Jun 2024 14:14:17 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/jagan1.jpg"                         length="41247"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వైసీపీ ఓటమికి కారణాలు ఇవే..!</title>
                                    <description><![CDATA[<ul style="list-style-type:square;">
<li><span style="color:rgb(224,62,45);"><strong>సంక్షేమం తప్ప అభివృద్ధి ఏది..?</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>రెడ్లలో తీవ్ర అసంతృప్తి</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>రాజధాని లేకపోవడం మైనస్</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>చంద్రబాబు, పవన్‌ను వ్యక్తిగతంగా అవమానించడం</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>వలంటరీ వ్యవస్థతో కేడర్ డీలా</strong></span></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/these-are-the-reasons-for-ycps-defeat/article-1247"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/jagan.jpg" alt=""></a><br /><p style="text-align:justify;"><strong>విశ్వంభర, విజయవాడ: </strong> వైసీపీకి ఘోరమైన దెబ్బ పడింది. ఇప్పటి వరకు వైసీపీ చరిత్రలోని లేని విధంగా దారుణమైన ఓటమిని మూటగట్టుకుంది. గత ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీ సీట్లతో అధికారాన్ని సింగిల్ గా చేజిక్కించుకున్న వైసీపీ.. ఈ ఎన్నికల్లో మాత్రం కనీవినీ ఎరగని రీతిలో ఓటమి పాలైంది. ఓటమి అంటే అది మామూలు ఓటమి కాదు.. ఇంత దారుణంగా ప్రజలు ఇప్పటి వరకు ఏ అధికార పార్టీని వ్యతిరేకించలేదేమో. అంత ఘోరంగా ఓడిపోయింది వైసీపీ. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి వైసీపీని ఇంత దారుణంగా ప్రజలు వ్యతిరేకించడానికి కారణాలు కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.</p>
<h5 style="text-align:justify;"><span style="color:rgb(224,62,45);"><strong>సంక్షేమమే.. అభివృద్ధి లేదు..</strong></span></h5>
<p style="text-align:justify;">జగన్ ఐదేండ్ల పాలనలో చూసుకుంటే ఎక్కువగా సంక్షేమం మీదనే దృష్టి పెట్టారు. అంతే తప్ప అభివృద్ధిని ఎక్కడా చూపించలేకపోయారు. పైగా ఏపీకి రాజధాని లేకుండా చేశాడనే అపవాదును కూడా మూటగట్టుకున్నారు. సంక్షేమ పథకాలతో ప్రజల అకౌంట్లలో నేరుగా డబ్బులు వేస్తే వాళ్లు ఓట్లేస్తారని అనుకోవడం అవివేకమే అవుతుంది. అభివృద్ధి లేకుండా కేవలం సంక్షేమమే అంటే ఎవరూ పట్టించుకోరు. అందుకే జగన్ ఓటమిలో ఇది కీలక పాత్ర పోషించింది. </p>
<h5 style="text-align:justify;"><span style="color:rgb(224,62,45);"><strong>చంద్రబాబు, పవన్ కు అవమానాలు..</strong></span></h5>
<p style="text-align:justify;">వైసీపీ హయంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ కు దారుణమైన అవమానాలు జరిగాయి. అవి ప్రజల్లో వారికి సానుభూతిని బాగా పెంచాయి. మరీ ముఖ్యంగా చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని అసెంబ్లీ సాక్షిగా అవమానించడం, పవన్ కల్యాణ్‌ ను పదే పదే మూడు పెళ్లిళ్లు అంటూ వైసీపీ మంత్రులు, నేతలు సెటైర్లు వేయడం ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను తీసుకువచ్చింది. అందుకే ఈ ఎన్నికల్లో వైసీపీకి ఆ ఎఫెక్ట్ పడింది.</p>
<h5 style="text-align:justify;"><span style="color:rgb(224,62,45);"><strong>రాజధాని లేకపోవడం..</strong></span></h5>
<p style="text-align:justify;">ఏపీలో ప్రధానంగా రాజధాని చుట్టే ఈ ఐదేండ్లు రాజకీయాలు నడిచాయి. చంద్రబాబు అమరావతిని రాజధాని చేస్తే.. జగన్ దాన్ని రద్దు చేయడం తీవ్ర విమర్శలకు తావు తీసింది. అంతే కాకుండా మూడు రాజధానులు అంటూ చట్టం చేయడం.. అది కోర్టులో నిలబడకపోవడంతో.. అసలు ఏపీకి రాజధాని అనేది లేకుండా జగనే చేశాడు అని ప్రతిపక్షాలు బలంగా ప్రచారం చేశాయి. ప్రజల్లో ఇది బాగా ప్రభావం చూపించి చివరకు జగన్ ఓటమికి కారణం అయింది.</p>
<h5 style="text-align:justify;"><strong><span style="color:rgb(224,62,45);">రెడ్లలో అసంతృప్తి..</span></strong></h5>
<p style="text-align:justify;">ఏపీలో మద్యం షాపులను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవడం వల్ల ఒక సామాజిక వర్గం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతే కాకుండా వైసీపీకి మొదటి నుంచి అండగా ఉంటున్న రెడ్డి సామాజిక వర్గాన్ని ఇబ్బంది పెట్టాడు జగన్. మూడు రాజధానుల పేరుతో రియల్ ఎస్టేట్ ను పడగొట్టాడు. దాంతో రెడ్డి సామాజిక వర్గం తీవ్రంగా జగన్ ను వ్యతిరేకించింది. అంతే కాకుండా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల నినాదం అందుకుని పార్టీలో, ప్రభుత్వంలో రెడ్ల ప్రాధాన్యతను తగ్గించడంతో వారంతా వ్యతిరేకంగా మారారు.</p>
<h5 style="text-align:justify;"><span style="color:rgb(224,62,45);"><strong>కేడర్ లో ఆగ్రహం..</strong></span></h5>
<p style="text-align:justify;">జగన్ అంటే చాలా మంది కేడర్ కు పిచ్చి ఉండేది. ఒకప్పుడు జగన్ కోసం టీడీపీ నేతలతో కొట్లాడి తలలు పగలగొట్టుకున్న కరుడుగట్టిన వైసీపీ కార్యకర్తలు ఎంతో మంది ఉన్నారు. అయితే జగన్ ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేడర్ ను అస్సలు పట్టించుకోలేదు. వలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి కేడర్ ను నీరుగార్చారు. గ్రామాల్లో వైసీపీ కార్యకర్తల్లో ఇది తీవ్రంగా వ్యతిరేకతను తీసుకొచ్చింది. దాంతో వారంతా ఈ సారి గట్టిగా పోరాడలేదు. అందుకే ఈ ఎన్నికల్లో వైసీపీకి దారుణమైన దెబ్బ పడింది.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/these-are-the-reasons-for-ycps-defeat/article-1247</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/these-are-the-reasons-for-ycps-defeat/article-1247</guid>
                <pubDate>Tue, 04 Jun 2024 17:00:03 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/jagan.jpg"                         length="21294"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వైసీపీ అభ్యర్థులపై టీడీపీ మహిళల చెప్పుల దాడి</title>
                                    <description><![CDATA[<p><strong> </strong>ఏపీ అసెంబ్లీ ఫలితాల్లో టీడీపీ జయభేరి మోగిస్తోంది. ఇప్పటికే టీడీపీ 132, జనసేన 20, బీజేపీ 7 స్థానాల్లో ముందంజలో ఉన్నది.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/tdp-womens-sandals-attack-on-ycp-candidates/article-1204"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/tdp.jpg" alt=""></a><br /><p style="text-align:justify;"><strong>విశ్వంభర, విజయవాడ:  </strong>ఏపీ అసెంబ్లీ ఫలితాల్లో టీడీపీ జయభేరి మోగిస్తోంది. ఇప్పటికే టీడీపీ 132, జనసేన 20, బీజేపీ 7 స్థానాల్లో ముందంజలో ఉన్నది. అధికార పార్టీ వైసీపీ కేవలం 13 స్థానాల్లోనే ముందంజలో ఉండి వెనకబడింది. వైసీపీకి చెందిన మంత్రులు, కీలక నేతలు ఓటమి దిశగా పయనిస్తున్నారు. టీడీపీకి వస్తున్న ఫలితాలను చూసి ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. ఈ క్రమంలో ఎన్నికల ఫలితాలు చూసేందుకు ఏర్పాటు చేసిన టీవీలు, ఎల్ఈడీ స్క్రీన్లపై వైసీపీ అభ్యర్థులు, నేతల వీడియోలు వచ్చే సమయంలో టీడీపీ మహిళలు, కార్యకర్తలు వారి ఫొటోలపై చెప్పులతో దాడి చేశారు. స్క్రీన్లపై వారి విజువల్స్ ప్లే కాగానే మహిళలు చెప్పులతో స్క్రీన్లపై కొట్టారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. </p>
<div class="div_border" contenteditable="false">
<blockquote class="twitter-tweet">
<p dir="ltr" lang="te" xml:lang="te">తాడేపల్లి టీడీపీ ఆఫీసులో టీవీ స్క్రీన్‌‌పై వస్తున్న వైసీపీ నేతల ఫొటోలను చెప్పులతో కొడుతున్న కార్యకర్తలు<a href="https://twitter.com/hashtag/ElectionsWithBIGTV?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#ElectionsWithBIGTV</a> <a href="https://twitter.com/hashtag/ElectionResults?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#ElectionResults</a> <a href="https://twitter.com/hashtag/ResultsWithBIGTV?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#ResultsWithBIGTV</a> <a href="https://twitter.com/hashtag/APElectionResults?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#APElectionResults</a><a href="https://twitter.com/hashtag/APAssemblyResults?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#APAssemblyResults</a> <a href="https://twitter.com/hashtag/LoksabhaElections2024?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#LoksabhaElections2024</a> <a href="https://twitter.com/hashtag/AndhraPradesh?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#AndhraPradesh</a> <a href="https://twitter.com/hashtag/TDP?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#TDP</a> <a href="https://twitter.com/hashtag/YSRCP?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#YSRCP</a> <a href="https://twitter.com/hashtag/JanasenaParty?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#JanasenaParty</a> <a href="https://twitter.com/hashtag/BJP?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#BJP</a> <a href="https://t.co/J71ciGsmRe">pic.twitter.com/J71ciGsmRe</a></p>
— BIG TV Breaking News (@bigtvtelugu) <a href="https://twitter.com/bigtvtelugu/status/1797864446595141760?ref_src=twsrc%5Etfw">June 4, 2024</a></blockquote>

</div>
<p style="text-align:justify;">

</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/tdp-womens-sandals-attack-on-ycp-candidates/article-1204</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/tdp-womens-sandals-attack-on-ycp-candidates/article-1204</guid>
                <pubDate>Tue, 04 Jun 2024 12:00:43 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/tdp.jpg"                         length="38842"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ముగిసిన సీఎం జగన్ విదేశీ పర్యటన</title>
                                    <description><![CDATA[<p>15రోజుల పాటు లండన్ వెళ్లిన సీఎం జగన్ తన పర్యటనను ముగించుకుని రాష్ట్రానికి చేరుకున్నారు. శనివారం ఉదయం గన్నవరం ఎయిర్‌పోర్టులో వారికి వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/cm-jagans-foreign-tour-has-ended/article-1081"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/screenshot-2024-06-01-084228.jpg" alt=""></a><br /><p>ఏపీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. 15రోజుల పాటు లండన్ వెళ్లిన ఆయన తన పర్యటనను ముగించుకుని రాష్ట్రానికి చేరుకున్నారు. శనివారం ఉదయం గన్నవరం ఎయిర్‌పోర్టులో వారికి వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.</p>
<p>ఈ సందర్భంగా ఎంపీలు విజయసాయిరెడ్డి నేతృత్వంలో పలువురు ఎంపీలు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ కీలక నేతలు సీఎం జగన్‌కు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా తాడేపల్లికి చేరుకున్నారు. వైఎస్ జగన్, భార్య భారతితో కలసి ఏపీ ఎన్నికల పోలింగ్ పూర్తయిన తర్వాత మే నెల 17వ తేదీన విదేశీ పర్యటనకు ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లారు. </p>
<p>లండన్, స్విట్జర్లాండ్‌ దేశాల్లో కుటుంబసమేతంగా పర్యటించారు. లండన్ నుంచి జగన్ తన కుమార్తెలతో కలసి స్విట్జర్లాండ్‌లో పర్యటించారు. 15రోజుల తర్వాత తిరిగి స్వదేశానికి విచ్చేశారు. ప్రత్యేక విమానంలో లండన్‌ నుంచి బయల్దేరనున్న జగన్‌ నేరుగా గన్నవరం చేరుకున్నారు. కాగా, జగన్ రావడంతోనే కౌంటింగ్‌ డేకు సంబంధించి కరసత్తును ప్రారంభించారు. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.</p>
<div class="div_border" contenteditable="false">
<blockquote class="twitter-tweet">
<p dir="ltr" lang="und" xml:lang="und">Jagan anna ki ఘనస్వాగతం 🤗 <a href="https://t.co/jVKG50mO0Y">pic.twitter.com/jVKG50mO0Y</a></p>
— YS JAGAN 2024 🇸🇱 (@ysrcpfrance) <a href="https://twitter.com/ysrcpfrance/status/1796712466887647314?ref_src=twsrc%5Etfw">June 1, 2024</a></blockquote>

</div>
<p>

</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/cm-jagans-foreign-tour-has-ended/article-1081</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/cm-jagans-foreign-tour-has-ended/article-1081</guid>
                <pubDate>Sat, 01 Jun 2024 08:46:26 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/screenshot-2024-06-01-084228.jpg"                         length="108818"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రిజల్ట్ ఎఫెక్ట్.. ఏపీలో 3 రోజలు మద్యం బంద్</title>
                                    <description><![CDATA[<p>ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ నెల 4న రానున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఓట్ల లెక్కింపు రోజు ఎలాంటి అల్లర్లు చోటు చేసుకోకుండా ముందుజాగ్రత్త చర్యగా మూడు రోజుల పాటు వైన్స్ షాపులను బంద్ చేయాలని ఆదేశించింది. జూన్ 3 నుంచి 5 వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మద్యం షాపులను మూసివేయాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాలు జారీ చేశారు. </p>
<p>  </p>
<p>కౌంటింగ్ కేంద్రాల దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. దీంతో పాటు ఓట్ల లెక్కింపు జరిగే కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు డీజీపీ చెప్పారు. హోటళ్లు, లాడ్జిలను క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని జిల్లాలోని పోలీసులకు ఆదేశించారు. అనుమానాస్పదంగా ఎవరైనా ఉంటే అదుపులోకి తీసుకోవాలని సూచించారు. సోషల్ మీడియాపై కూడా నిఘా పెట్టాలని తెలిపారు. అల్లర్లకు ప్రేరేపించేలా.. రెచ్చగొట్టేలా ఎవరైనా పోస్టులు పెడితే</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/result-effect-3-days-liquor-ban-in-ap/article-1014"><img src="https://www.vishvambhara.com/media/400/2024-05/img-20240529-wa0008.jpg" alt=""></a><br /><p>ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ నెల 4న రానున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఓట్ల లెక్కింపు రోజు ఎలాంటి అల్లర్లు చోటు చేసుకోకుండా ముందుజాగ్రత్త చర్యగా మూడు రోజుల పాటు వైన్స్ షాపులను బంద్ చేయాలని ఆదేశించింది. జూన్ 3 నుంచి 5 వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మద్యం షాపులను మూసివేయాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాలు జారీ చేశారు. </p>
<p> </p>
<p>కౌంటింగ్ కేంద్రాల దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. దీంతో పాటు ఓట్ల లెక్కింపు జరిగే కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు డీజీపీ చెప్పారు. హోటళ్లు, లాడ్జిలను క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని జిల్లాలోని పోలీసులకు ఆదేశించారు. అనుమానాస్పదంగా ఎవరైనా ఉంటే అదుపులోకి తీసుకోవాలని సూచించారు. సోషల్ మీడియాపై కూడా నిఘా పెట్టాలని తెలిపారు. అల్లర్లకు ప్రేరేపించేలా.. రెచ్చగొట్టేలా ఎవరైనా పోస్టులు పెడితే వారిపై కూడా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. </p>
<p> </p>
<p>ఏపీలో పోలింగ్ రోజు నుంచి మూడు రోజుల పాటు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో.. కౌంటింగ్ పోలీసులకు సవాల్ గా మారింది. కౌంటింగ్ నేపధ్యంలో అల్లర్లు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్సీ రిపోర్టులు కూడా ఉన్నాయి. దీంతో.. పోలీసులు అప్రమత్తం అవుతున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/result-effect-3-days-liquor-ban-in-ap/article-1014</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/result-effect-3-days-liquor-ban-in-ap/article-1014</guid>
                <pubDate>Wed, 29 May 2024 13:49:42 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-05/img-20240529-wa0008.jpg"                         length="382644"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రిజల్ట్స్ తర్వాత జనసేన ఉండదు.. పవన్‌పై వేణు స్వామి జోస్యం!</title>
                                    <description><![CDATA[<p>ఏపీలో ఎన్నికల ఫలితాలపై రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రచారం శైలి, పోలింగ్ సరళి చూసిన తర్వాత ఫలితాలను అంచనా వేయడం ఎవరితరం కావడం లేదు. అన్ని పార్టీ బయటకు ధీమాగా కనిపిస్తున్నా.. ఎక్కడో తెలియని భయాందోళనలో ఉన్నాయి. ఇక రాజకీయ విశ్లేషకులకు కూడా ఈసారి జరిగిన పోలింగ్ విధానం అంతుపట్టడం లేదు. దీంతో ఎవరు గెలుస్తారో అంత సులభంగా చెప్పలేక పోతున్నారు. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది ఒక టెన్షన్ అయితే.. పిఠాపురంలో పవన్ పరిస్థితి ఏంటీ అనే విషయంలో కూడా డబుల్ టెన్షన్ పట్టుకుంది. </p>
<p>  </p>
<p>ఏపీలో రాజకీయాలపై ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి సంచలన కామెంట్స్ చేశారు. మరోసారి జగన్ సీఎం అవుతారని చెప్పారు. చంద్రబాబుకు రాజయోగం లేదని అన్నారు. ఇక పవన్ కల్యాణ్ సినిమాలు చేసుకుంటే మంచిదని చూపించారు. పవన్ ప్రభావం ఏపీలో ఉండదని చెప్పారు. పిఠాపురంలో కూడా ఆయన గెలవడం కష్టమేనని</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/venu-swamys-prediction-on-pawan-that-there-will-be-no/article-895"><img src="https://www.vishvambhara.com/media/400/2024-05/img-20240526-wa0004.jpg" alt=""></a><br /><p>ఏపీలో ఎన్నికల ఫలితాలపై రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రచారం శైలి, పోలింగ్ సరళి చూసిన తర్వాత ఫలితాలను అంచనా వేయడం ఎవరితరం కావడం లేదు. అన్ని పార్టీ బయటకు ధీమాగా కనిపిస్తున్నా.. ఎక్కడో తెలియని భయాందోళనలో ఉన్నాయి. ఇక రాజకీయ విశ్లేషకులకు కూడా ఈసారి జరిగిన పోలింగ్ విధానం అంతుపట్టడం లేదు. దీంతో ఎవరు గెలుస్తారో అంత సులభంగా చెప్పలేక పోతున్నారు. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది ఒక టెన్షన్ అయితే.. పిఠాపురంలో పవన్ పరిస్థితి ఏంటీ అనే విషయంలో కూడా డబుల్ టెన్షన్ పట్టుకుంది. </p>
<p> </p>
<p>ఏపీలో రాజకీయాలపై ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి సంచలన కామెంట్స్ చేశారు. మరోసారి జగన్ సీఎం అవుతారని చెప్పారు. చంద్రబాబుకు రాజయోగం లేదని అన్నారు. ఇక పవన్ కల్యాణ్ సినిమాలు చేసుకుంటే మంచిదని చూపించారు. పవన్ ప్రభావం ఏపీలో ఉండదని చెప్పారు. పిఠాపురంలో కూడా ఆయన గెలవడం కష్టమేనని అన్నారు. ఎన్నికల తర్వాత ఏపీలో ఓ పార్టీ ఉండదని జోస్యం చెప్పారు. అయితే.. ఆయన పార్టీ పేరు చెప్పలేదు. కానీ.. వేణు స్వామి చెప్పే విధానం బట్టి జనసేన ఉండదా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. </p>
<p> </p>
<p>గతంలో కూడా ఏపీ రాజకీయాలపై చాలా సార్లు జోతిష్యం చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని అన్నారు. కానీ.. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆయనను చాలా మంది ట్రోల్ చేశారు. మరి ఏపీ విషయంలో వేణుస్వామి జోతిష్యం నిజం అవుతుందో లేదో చూడాలి. ఆయన మాత్రం తన దగ్గరు ఉన్న జగన్, చంద్రబాబు, పవన్ జాతకాలు చూసి చెప్పానని అన్నారు. గ్రౌండ్ లో ఉండే రాజకీయాలు తనకు తేలియదని.. కేవలం రాశులు, నక్షత్రాలు చూసి మాత్రమే చెప్పానని అన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/venu-swamys-prediction-on-pawan-that-there-will-be-no/article-895</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/venu-swamys-prediction-on-pawan-that-there-will-be-no/article-895</guid>
                <pubDate>Sun, 26 May 2024 20:20:13 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-05/img-20240526-wa0004.jpg"                         length="53983"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        