<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/russia-ukraine-crisis-effect/tag-1512" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>Russia-Ukraine Crisis Effect - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/1512/rss</link>
                <description>Russia-Ukraine Crisis Effect RSS Feed</description>
                
                            <item>
                <title>త్వరలో 3వేల ఉద్యోగాలు.. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటన</title>
                                    <description><![CDATA[<p>హైదరాబాద్‌లోని బస్ భవన్ ప్రాంగణంలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర అవతరణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సజ్జనార్ జాతీయ జెండాను ఎగురవేశారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/rtc-md-sajjanar-announcement-of-3-thousand-jobs-soon/article-1147"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/8-16.jpg" alt=""></a><br /><p>తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనర్ కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్‌లోని బస్ భవన్ ప్రాంగణంలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర అవతరణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సజ్జనార్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం టీజీఎస్ఆర్టీసీ భద్రతా సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు.</p>
<p>అనంతరం ఆయన మాట్లాడుతూ.. కొత్త బస్సులకు అనుగుణంగా 3 వేల ఉద్యోగాలనుభర్తీ చేయాలని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించిందని తెలిపారు. ప్రభుత్వ అనుమతితో వాటిని వీలైనంత త్వరగా భర్తీ చేస్తామని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర చిరస్మరణీయమని కొనియాడారు. 'బస్ కా పయ్యా నహీ ఛలేగా’ నినాదంతో చేపట్టిన సమ్మె తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిందని ఆయన గుర్తు చేశారు. </p>
<p>తెలంగాణ ఉద్యమ స్పూర్తితోనే సంస్థలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చినట్లు తెలిపారు. టీజీఎస్ఆర్టీసీ కుటుంబం తరపున అమరులకు ఘన నివాళులర్పిస్తున్నామని తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులు 2011లో 29 రోజులపాటు 'మేము సైతం' అంటూ సకల జనుల సమ్మెను కొనసాగించారని గుర్తు చేశారు. అతి పెద్ద సమ్మెగా నిలిచిన సకల జనుల సమ్మెలో పెద్ద ఎత్తున 56,604 మంది ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొని స్వరాష్ట్ర సాధనకు నిర్విరామంగా కృషి చేశారని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర చరిత్రలో నిలిచిపోయింది.” అని అన్నారు. </p>
<p>మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య పథకాన్ని ప్రభుత్వం ప్రకటించిన 48 గంటల్లోనే అమలు చేశామని చెప్పారు. మహాలక్ష్మి పథక అమలుకు ముందు ప్రతి రోజు సగటున 45 లక్షల మంది ప్రయాణిస్తే.. ప్రస్తుతం రోజుకి సగటున 55 లక్షల మంది టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో రాకపోకలు సాగిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో దాదాపు 7 ఏళ్లకుపైగా పెండింగ్ లో ఉన్న 2017 వేతన సవరణను చేసి.. ఉద్యోగులకు 21 శాతం ఫిట్ మెంట్ ను సంస్థ ప్రకటించిందన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/rtc-md-sajjanar-announcement-of-3-thousand-jobs-soon/article-1147</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/rtc-md-sajjanar-announcement-of-3-thousand-jobs-soon/article-1147</guid>
                <pubDate>Sun, 02 Jun 2024 13:09:14 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/8-16.jpg"                         length="309259"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        