<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/cmrevanthreddy/tag-1482" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>cmrevanthreddy - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/1482/rss</link>
                <description>cmrevanthreddy RSS Feed</description>
                
                            <item>
                <title>‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్‌పై రాహుల్ గాంధీ, ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి చర్చ</title>
                                    <description><![CDATA[<p>రాష్ట్ర అభివృద్ధి పథాన్ని మరింత వేగవంతం చేసే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కేబినెట్ సహచరులు, రాష్ట్ర సీనియర్ నాయకులతో కలిసి న్యూఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలను కలిశారు. </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/cm-revanth-reddys-discussion-with-rahul-gandhi-kharge-on-telangana/article-9053"><img src="https://www.vishvambhara.com/media/400/2026-02/whatsapp-image-2026-02-19-at-7.09.12-pm.jpeg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, తెలంగాణ బ్యూరో:</strong> రాష్ట్ర అభివృద్ధి పథాన్ని మరింత వేగవంతం చేసే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కేబినెట్ సహచరులు, రాష్ట్ర సీనియర్ నాయకులతో కలిసి న్యూఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలను కలిశారు. ఈ సమావేశంలో ప్రధానంగా ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్, దాని వ్యూహాత్మక రోడ్‌మ్యాప్‌పై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రభుత్వ ప్రాధాన్యతలు, కీలక వాగ్దానాల అమలుపై జాతీయ నాయకత్వానికి ముఖ్యమంత్రి సమగ్రంగా వివరించారు.</p>
<p><strong>సామాజిక న్యాయానికి ప్రాధాన్యత</strong><br />ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలను మర్యాదపూర్వకంగా కలిసి రాష్ట్ర తాజా పరిణామాలపై చర్చించింది. సమావేశంలో విధానపరమైన నిర్ణయాలు, నిర్మాణాత్మక సంస్కరణలు, ప్రజలకు చేరువయ్యే కార్యక్రమాల గురించి అధిష్ఠానానికి వివరించారు. సామాజిక న్యాయం, సమ్మిళిత అభివృద్ధి పట్ల ప్రభుత్వానికి ఉన్న అంకితభావాన్ని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు.</p>
<p>విశ్వంభర, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర అభివృద్ధి పథాన్ని మరింత వేగవంతం చేసే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కేబినెట్ సహచరులు, రాష్ట్ర సీనియర్ నాయకులతో కలిసి న్యూఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలను కలిశారు. ఈ సమావేశంలో ప్రధానంగా ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్, దాని వ్యూహాత్మక రోడ్‌మ్యాప్‌పై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రభుత్వ ప్రాధాన్యతలు, కీలక వాగ్దానాల అమలుపై జాతీయ నాయకత్వానికి ముఖ్యమంత్రి సమగ్రంగా వివరించారు.</p>
<p>సామాజిక న్యాయానికి ప్రాధాన్యత<br />ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలను మర్యాదపూర్వకంగా కలిసి రాష్ట్ర తాజా పరిణామాలపై చర్చించింది. సమావేశంలో విధానపరమైన నిర్ణయాలు, నిర్మాణాత్మక సంస్కరణలు, ప్రజలకు చేరువయ్యే కార్యక్రమాల గురించి అధిష్ఠానానికి వివరించారు. సామాజిక న్యాయం, సమ్మిళిత అభివృద్ధి పట్ల ప్రభుత్వానికి ఉన్న అంకితభావాన్ని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు.</p>
<p><strong>ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం విప్లవాత్మక చర్యలు</strong><br />డిసెంబర్ 2023లో ‘ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం’ కొలువుదీరినప్పటి నుంచి చేపట్టిన విప్లవాత్మక చర్యలను ముఖ్యమంత్రి నాయకత్వానికి వివరించారు. ముఖ్యంగా మహిళలు, రైతులు, యువత సాధికారత కోసం తీసుకున్న నిర్ణయాలను ప్రస్తావించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వానికి లభిస్తున్న విశేష ప్రజా మద్దతును ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అధిష్ఠానానికి తెలియజేశారు. జాతీయ నాయకత్వం ఇచ్చిన మార్గదర్శకత్వం, తెలంగాణ సమగ్ర, సమాన అవకాశాల అభివృద్ధి దిశగా ప్రభుత్వ సంకల్పాన్ని మరింత బలపరుస్తుందని రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.</p>
<p><br />డిసెంబర్ 2023లో ‘ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం’ కొలువుదీరినప్పటి నుంచి చేపట్టిన విప్లవాత్మక చర్యలను ముఖ్యమంత్రి నాయకత్వానికి వివరించారు. ముఖ్యంగా మహిళలు, రైతులు, యువత సాధికారత కోసం తీసుకున్న నిర్ణయాలను ప్రస్తావించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వానికి లభిస్తున్న విశేష ప్రజా మద్దతును ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అధిష్ఠానానికి తెలియజేశారు. జాతీయ నాయకత్వం ఇచ్చిన మార్గదర్శకత్వం, తెలంగాణ సమగ్ర, సమాన అవకాశాల అభివృద్ధి దిశగా ప్రభుత్వ సంకల్పాన్ని మరింత బలపరుస్తుందని రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/cm-revanth-reddys-discussion-with-rahul-gandhi-kharge-on-telangana/article-9053</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/cm-revanth-reddys-discussion-with-rahul-gandhi-kharge-on-telangana/article-9053</guid>
                <pubDate>Thu, 19 Feb 2026 19:11:04 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-02/whatsapp-image-2026-02-19-at-7.09.12-pm.jpeg"                         length="82192"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>హామీల అమలులో కాంగ్రెస్ విఫలం.. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ</title>
                                    <description><![CDATA[<p> రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు సగం కాలం పూర్తయినా, ప్రజలకు ఇచ్చిన హామీల్లో 95 శాతం ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఆరోపించారు. </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/congress-failed-to-implement-the-promises/article-9051"><img src="https://www.vishvambhara.com/media/400/2026-02/whatsapp-image-2026-02-19-at-7.03.31-pm.jpeg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, తెలంగాణ బ్యూరో:</strong> రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు సగం కాలం పూర్తయినా, ప్రజలకు ఇచ్చిన హామీల్లో 95 శాతం ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఆరోపించారు. రానున్న 2026-27 బడ్జెట్‌లో అయినా ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు తగిన నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ, సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. నిధులు కేటాయించకపోతే తెలంగాణ సమాజం ఇంకా ఓపిక పట్టే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు, డిక్లరేషన్ల అమలుకు కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు. రెండు బడ్జెట్లలో హామీల అమలుకు నిధులు కేటాయించని ప్రభుత్వం.. ఈ బడ్జెట్‌లో అయినా నిధులు కేటాయించాలని నాలుగు కోట్ల ప్రజల పక్షాన కోరుతున్నానన్నారు.</p>
<p><strong>మహిళలు, రైతులు, యువతకు ద్రోహం </strong><br />ఆరు గ్యారెంటీలలో హామీ ఇచ్చిన మహిళలు, వృద్ధులు, విద్యార్థులు, యువత, రైతన్నల కోసం భారీగా నిధులు కేటాయించాలని కేటీఆర్ కోరారు. అలాగే, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ డిక్లరేషన్ల కింద ఇచ్చిన వాగ్దానాల అమలుకు నిధులు కేటాయించాలన్నారు. రెండు సంవత్సరాలుగా బకాయిపడ్డ హామీలకు, నిధులకు ఈ బడ్జెట్‌లో కేటాయింపులు చేయాలని డిమాండ్ చేశారు. రైతుబంధును రూ.15 వేలకు పెంచుతామని మాటిచ్చి మోసం చేసినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగా క్షమాపణ చెప్పాలని, ఆ మొత్తాన్ని బడ్జెట్‌లో చేర్చాలని డిమాండ్ చేశారు. తొలి ఏడాదే రెండు లక్షల ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి వంటి హామీల అమలుకు కూడా బడ్జెట్‌లో కేటాయింపులు చేయాలన్నారు.</p>
<p><strong>ప్రజాక్షేత్రంలో నిలదీస్తాం - హెచ్చరించిన కేటీఆర్</strong><br />పనికిరాని అంశాలను తెరపైకి తెచ్చి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నాలను తెలంగాణ సమాజం గమనిస్తోందని కేటీఆర్ అన్నారు. నాటి గ్యారంటీ కార్డులే ఇవాళ బాకీ కార్డులై కాంగ్రెస్ పాపాలను ప్రశ్నిస్తున్నాయని పేర్కొన్నారు. "ఇచ్చిన వాగ్దానాల అమలుకు తగిన నిధులు కేటాయించకపోతే, ఎక్కడికక్కడ మోసకారి కాంగ్రెస్‌ను ప్రజలపక్షాన నిలదీస్తాం" అని కేటీఆర్ తీవ్రంగా హెచ్చరించారు. తెలంగాణ ప్రజాగ్రహానికి ముఖ్యమంత్రి, మంత్రులు ప్రజాక్షేత్రంలో తిరగలేరని కేటీఆర్ వ్యాఖ్యానించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/congress-failed-to-implement-the-promises/article-9051</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/congress-failed-to-implement-the-promises/article-9051</guid>
                <pubDate>Thu, 19 Feb 2026 19:08:41 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-02/whatsapp-image-2026-02-19-at-7.03.31-pm.jpeg"                         length="52944"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ భేటీ</title>
                                    <description><![CDATA[<p>రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 23న సమావేశం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ కీలక భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై మంత్రులు చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/telangana-cabinet-meeting-on-23rd-of-this-month/article-8889"><img src="https://www.vishvambhara.com/media/400/2026-02/whatsapp-image-2026-02-17-at-6.52.06-pm.jpeg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, తెలంగాణ బ్యూరో:</strong> రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 23న సమావేశం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ కీలక భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై మంత్రులు చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. ముఖ్యంగా త్వరలో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ, ప్రవేశపెట్టాల్సిన బిల్లులపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు.</p>
<p><strong>స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ</strong><br />బడ్జెట్ సమావేశాలతో పాటు, రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న జీహెచ్ఎంసీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై కూడా కేబినెట్ ప్రత్యేకంగా చర్చించనుంది. ఈ ఎన్నికల షెడ్యూల్, అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రులు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.</p>
<p><strong>ఢిల్లీకి తెలంగాణ కేబినెట్ బాట</strong><br />ఈ కేబినెట్ సమావేశానికి ముందు, తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. ఈ నెల 19వ తేదీన దేశ రాజధాని ఢిల్లీలో భారీస్థాయి సమావేశం జరగనుంది. ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్ వేదికగా జరిగే ఈ భేటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర కేబినెట్ మంత్రులందరూ హాజరుకానున్నారు. పార్టీ అధిష్టానంతో జరగబోయే ఈ సమావేశంలో రాష్ట్ర రాజకీయాలు, కీలక నిర్ణయాల గురించి చర్చించనున్నారు. ఢిల్లీ పర్యటన తర్వాత జరగబోయే కేబినెట్ భేటీలో ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.</p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/telangana-cabinet-meeting-on-23rd-of-this-month/article-8889</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/telangana-cabinet-meeting-on-23rd-of-this-month/article-8889</guid>
                <pubDate>Tue, 17 Feb 2026 19:01:03 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-02/whatsapp-image-2026-02-17-at-6.52.06-pm.jpeg"                         length="220805"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>క్షేత్రస్థాయికి రండి.. లేదంటే సస్పెన్షన్లే: సీఎం రేవంత్ రెడ్డి</title>
                                    <description><![CDATA[<p> మున్సిపల్ అధికారులు, కమిషనర్లు క్షేత్రస్థాయిలోకి వెళ్లడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం సచివాలయంలో పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖపై నిర్వహించిన సమీక్షలో ఆయన అధికారులపై సీరియస్ అయ్యారు. </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/cm-revanth-reddy-come-to-field-level-or-else-suspension/article-8876"><img src="https://www.vishvambhara.com/media/400/2026-02/whatsapp-image-2026-02-17-at-5.52.40-pm.jpeg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, తెలంగాణ బ్యూరో: </strong>మున్సిపల్ అధికారులు, కమిషనర్లు క్షేత్రస్థాయిలోకి వెళ్లడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం సచివాలయంలో పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖపై నిర్వహించిన సమీక్షలో ఆయన అధికారులపై సీరియస్ అయ్యారు. కమిషనర్లు, జోనల్ కమిషనర్లు ఉదయం వేళ ఖచ్చితంగా ఫీల్డ్‌లో ఉండి పారిశుధ్య పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు. నగరంలో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. త్వరలో తానే స్వయంగా ప్రతి జోన్‍లో పర్యటిస్తానని, రోడ్లు శుభ్రంగా లేకపోతే బాధ్యులైన అధికారులను అక్కడిక్కడే సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. జీహెచ్ఎంసీ విభజన కారణంగా తలెత్తిన పలు సమస్యలను పరిష్కరించాలని సూచించారు.</p>
<p><strong>పీపీపీ విధానంలో మౌలిక సదుపాయాలు</strong><br />హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను అధిగమించడానికి పీపీపీ విధానంలో స్కైవాక్ బ్రిడ్జిలను ఏర్పాటు చేసే అంశాన్ని అధ్యయనం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. అలాగే, నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్ సమీపంలో మల్టీలెవల్ కార్ పార్కింగ్ ఏర్పాటు చేయాలని, జంక్షన్ల వద్ద స్మార్ట్ పోల్స్ ఏర్పాటుపై దృష్టి సారించాలని సూచించారు.</p>
<p><strong>ప్రకటనల బోర్డుల ద్వారా ఆదాయం పెంపు</strong><br />అడ్వర్టైజింగ్ బోర్డుల నిర్వహణపై జాగ్రత్తలు తీసుకోవాలని, దీనివల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి గండి పడకుండా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల కోసం 10 శాతం ప్రకటన బోర్డులను కేటాయించాలన్నారు. అన్ని ప్రకటనల బోర్డుల నుండి సంవత్సరానికి ఒకసారి ఫీజు వసూలు చేయాలని, అనధికార బోర్డులను తొలగించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.</p>
<p><strong>ప్రజా ప్రతినిధులకు శిక్షణ</strong><br />రాష్ట్రంలో నూతనంగా ఎన్నికైన మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లకు పట్టణ పరిపాలనపై ఒక రోజు శిక్షణ ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ సమీక్షలో సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంఓ సెక్రటరీ మాణిక్‌రాజ్, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.</p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/cm-revanth-reddy-come-to-field-level-or-else-suspension/article-8876</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/cm-revanth-reddy-come-to-field-level-or-else-suspension/article-8876</guid>
                <pubDate>Tue, 17 Feb 2026 17:57:50 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-02/whatsapp-image-2026-02-17-at-5.52.40-pm.jpeg"                         length="63402"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అమర కానిస్టేబుల్ కుటుంబాలకు 'కోటి' భరోసా</title>
                                    <description><![CDATA[<p>విధి నిర్వహణలో ప్రాణాలను పణంగా పెట్టి సమాజ రక్షణ కోసం పోరాడిన అమర కానిస్టేబుళ్ల కుటుంబాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నిజామాబాద్ పర్యటనలో పెద్దపీట వేశారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/1-crore-for-the-families-of-immortal-constables/article-8551"><img src="https://www.vishvambhara.com/media/400/2026-02/whatsapp-image-2026-02-06-at-8.54.24-pm.jpeg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, తెలంగాణ బ్యూరో: </strong>విధి నిర్వహణలో ప్రాణాలను పణంగా పెట్టి సమాజ రక్షణ కోసం పోరాడిన అమర కానిస్టేబుళ్ల కుటుంబాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నిజామాబాద్ పర్యటనలో పెద్దపీట వేశారు. గంజాయి ముఠా దాడుల్లో వీరమరణం పొందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య, దుండగుల కత్తిపోట్లకు బలైన పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన రూ.కోటి ఎక్స్‌గ్రేషియా చెక్కులను సీఎం స్వయంగా అందజేశారు.</p><p><strong>సౌమ్య సాహసం.. గంజాయి ముఠాపై పోరు</strong><br />నిజామాబాద్ జిల్లాలో గంజాయి అక్రమ రవాణాను అడ్డుకునే క్రమంలో గత నెల 23న సౌమ్య చూపిన తెగువ అసాధారణం. అక్రమ రవాణాదారులు వాహనంతో ఆమెను ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన సౌమ్య, హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతూ జనవరి 31న కన్నుమూశారు. కేవలం 25 ఏళ్ల వయసులోనే ఆమె చేసిన ప్రాణత్యాగం రాష్ట్ర పోలీసు రంగానికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఆమె కుటుంబానికి కోటి రూపాయల సాయంతో పాటు ఆమె సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం, సర్వీస్ ముగిసే వరకు పూర్తి వేతనం అందజేస్తామని ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది.</p><p><strong>ప్రమోద్ కుమార్ త్యాగానికి గుర్తింపు</strong><br />గత ఏడాది అక్టోబరులో విధి నిర్వహణలో ఉండగా రౌడీషీటర్ రియాజ్ జరిపిన కత్తి దాడిలో మృతి చెందిన కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ కుటుంబానికి కూడా రూ.కోటి ఆర్థిక సాయాన్ని సీఎం అందించారు. ఈ సాయంతో పాటు ఆయన కుటుంబానికి ఇంటి స్థలం, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాన్ని ప్రభుత్వం ఇప్పటికే ఖరారు చేసింది.</p><p><strong>నేరుగా బాధితుల వద్దకు ముఖ్యమంత్రి</strong><br />మున్సిపల్ ఎన్నికల ప్రచార హడావుడిలో ఉన్నప్పటికీ, నిజామాబాద్ పర్యటనలో భాగంగా ఆ ఇద్దరు వీరుల కుటుంబాలను ప్రత్యేకంగా కలిసిన రేవంత్ రెడ్డి, వారిని ఓదార్చి భరోసా ఇచ్చారు. ప్రభుత్వం మీకు ఎప్పుడూ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. నిజామాబాద్ జిల్లా అభివృద్ధికి ఎంతో మంది నాయకులు కృషి చేశారని, ఇలాంటి సాహసోపేతమైన అధికారుల త్యాగాలు ఎప్పటికీ మరువలేనివని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.<br /></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/1-crore-for-the-families-of-immortal-constables/article-8551</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/1-crore-for-the-families-of-immortal-constables/article-8551</guid>
                <pubDate>Fri, 06 Feb 2026 21:23:48 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-02/whatsapp-image-2026-02-06-at-8.54.24-pm.jpeg"                         length="92373"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సీఎం రేవంత్‌తో భట్టి విక్రమార్క భేటీ</title>
                                    <description><![CDATA[<p> మున్సిపల్ ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రచార వ్యూహాలకు మరింత పదును పెడుతోంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రత్యేకంగా భేటీ అయ్యారు. </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/bhatti-vikramarka-met-with-cm-revanth/article-8549"><img src="https://www.vishvambhara.com/media/400/2026-02/whatsapp-image-2026-02-06-at-8.07.11-pm.jpeg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, తెలంగాణ బ్యూరో: </strong>మున్సిపల్ ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రచార వ్యూహాలకు మరింత పదును పెడుతోంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దాదాపు గంటకు పైగా జరిగిన ఈ సమావేశంలో ఎన్నికల వ్యూహాలు, అభ్యర్థుల సమన్వయం, పార్టీ అంతర్గత అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. ఇటీవల మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన కీలక సమావేశానికి భట్టి విక్రమార్క హాజరుకాకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఆ గైర్హాజరీపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో, నేడు వీరిద్దరూ వ్యక్తిగతంగా భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/bhatti-vikramarka-met-with-cm-revanth/article-8549</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/bhatti-vikramarka-met-with-cm-revanth/article-8549</guid>
                <pubDate>Fri, 06 Feb 2026 21:22:18 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-02/whatsapp-image-2026-02-06-at-8.07.11-pm.jpeg"                         length="83079"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సిట్ అనేది రేవంత్ చేతిలో కీలుబొమ్మ!</title>
                                    <description><![CDATA[<p>రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసుల అందడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/sit-is-a-puppet-in-revanths-hands/article-7810"><img src="https://www.vishvambhara.com/media/400/2026-01/ddf431a8-3d4c-40c8-bf1f-9e33e9ebeedd.jpg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, తెలంగాణ బ్యూరో: </strong>రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసుల అందడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. గురువారం సిరిసిల్లలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి 'డైవర్షన్ పాలిటిక్స్' చేస్తోందని ధ్వజమెత్తారు. సిట్ అనేది రేవంత్ రెడ్డి సిట్ అంటే కూర్చుంటుంది.. స్టాండ్ అంటే నిలబడుతుందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాళేశ్వరం, కారు రేస్, గొర్రెల పంపిణీ.. ఇలా రోజుకో డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ పేరుతో కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. ఇవన్నీ 'కార్తీకదీపం' సీరియల్ లాగా సాగదీయడం తప్ప ఇందులో వాస్తవం ఏమీ లేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. సింగరేణి కుంభకోణాన్ని బయటపెట్టినందుకే తనతో పాటు హరీష్ రావుకు నోటీసులు ఇచ్చారని ఆయన ఆరోపించారు.</p>
<p><strong>ట్యాపింగ్ నేరమెలా అవుతుంది?</strong><br />ఫోన్ ట్యాపింగ్ అంశంపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. "ట్యాపింగ్ చేయడం నేరమేం కాదు. 1952 నుంచి దేశ భద్రత కోసం, ప్రభుత్వాలను అస్థిరపరిచే కుట్రల నుంచి రక్షించేందుకు నిఘా వ్యవస్థలు ఈ పని చేస్తూనే ఉన్నాయి. ఇది పూర్తిగా పోలీసు వ్యవస్థ కనుసన్నల్లో జరిగే ప్రక్రియ. ఇందులో మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఎలాంటి సంబంధం ఉండదు. ప్రభుత్వానికి కావాల్సిన సమాచారం కోసం పోలీసులు సమాచారాన్ని సేకరిస్తారు" అని ఆయన వివరించారు.</p>
<p><strong>ముందు డీజీపీని విచారించండి</strong><br />ఈ కేసులో తనను, హరీష్ రావును పిలవడంలో అర్థం లేదని కేటీఆర్ అన్నారు. "ఫోన్ ట్యాపింగ్ కేసులో ముందుగా విచారించాల్సింది ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డినే. ఆయనను వదిలేసి మమ్మల్ని పిలిస్తే ఏం వస్తుంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాపింగ్ చేయిస్తున్నారు. రేపు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక విచారణ జరిపిస్తే వీళ్లంతా జైలుకు వెళ్లడం ఖాయం" అని హెచ్చరించారు.</p>
<p><strong>విచారణకు వెళ్తాను</strong><br />సిట్ ఇచ్చిన నోటీసుల మేరకు తాను విచారణకు వెళ్తానని కేటీఆర్ స్పష్టం చేశారు. తన ఫోన్ ట్యాపింగ్ అవుతోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నప్పుడు ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఇది పూర్తిగా అబద్ధపు కేసు అని, ఇందులో ఎలాంటి ఆధారాలు లేవని ఆయన కొట్టిపారేశారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. హామీలు అమలు చేయలేకనే రేవంత్ రెడ్డి ఇలాంటి చిల్లర రాజకీయాలకు తెరలేపుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు.</p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/sit-is-a-puppet-in-revanths-hands/article-7810</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/sit-is-a-puppet-in-revanths-hands/article-7810</guid>
                <pubDate>Thu, 22 Jan 2026 20:29:54 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-01/ddf431a8-3d4c-40c8-bf1f-9e33e9ebeedd.jpg"                         length="63150"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తెలంగాణకు భారీ 'స్టీల్' ప్లాంట్</title>
                                    <description><![CDATA[<p>రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని 'తెలంగాణ రైజింగ్' బృందం దావోస్ వేదికగా అద్భుతాలు చేస్తోంది.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/a-huge-steel-plant-for-telangana/article-7777"><img src="https://www.vishvambhara.com/media/400/2026-01/6919f3e2-3051-475b-b83c-766742dbbf9b.jpg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, తెలంగాణ బ్యూరో: </strong>రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని 'తెలంగాణ రైజింగ్' బృందం దావోస్ వేదికగా అద్భుతాలు చేస్తోంది. డక్టైల్ ఐరన్ (డీఐ) పైపుల తయారీలో గ్లోబల్ లీడర్ అయిన రష్మి గ్రూప్, తెలంగాణలో భారీ స్టీల్ ఉత్పత్తి యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్-2026 వేదికగా నేడు రూ.12,500 కోట్ల పెట్టుబడికి సంబంధించి అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది.ఈ మెగా ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రంలో సుమారు 12,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. తయారీ రంగానికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వ వ్యూహానికి రష్మి గ్రూప్ రాక మరింత బలాన్ని చేకూర్చింది. రాష్ట్రంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన బొగ్గు సరఫరా లింకేజీలు సహా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.</p>
<p><strong>శ్రీధర్ బాబు కృషితోనే ఈ విజయం</strong><br />ఈ భారీ పెట్టుబడిని రాష్ట్రానికి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఈ భేటీలో కేవలం పరిశ్రమ స్థాపనే కాకుండా, పర్యావరణ హితమైన గ్రీన్ మాన్యుఫ్యాక్చరింగ్, సర్క్యులర్ ఎకానమీ వంటి అంశాల్లో ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు రష్మి గ్రూప్ అంగీకరించింది. ఈ ప్లాంట్ 'లేబర్–ఇంటెన్సివ్' (ఎక్కువ మంది శ్రామికుల అవసరం ఉన్న) విధానంతో నడుస్తుందని, తద్వారా స్థానిక యువతకు మెరుగైన ఉపాధి దొరుకుతుందని కంపెనీ డైరెక్టర్ సంజిబ్ కుమార్ పట్వారి తెలిపారు. ఆసియా, యూరప్, ఆఫ్రికా, అమెరికా వంటి 40కి పైగా దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న రష్మి గ్రూప్ తెలంగాణను తన ప్రధాన కేంద్రంగా ఎంచుకోవడం రాష్ట్ర పారిశ్రామిక నైపుణ్యానికి నిదర్శనమని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/a-huge-steel-plant-for-telangana/article-7777</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/a-huge-steel-plant-for-telangana/article-7777</guid>
                <pubDate>Wed, 21 Jan 2026 18:31:22 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-01/6919f3e2-3051-475b-b83c-766742dbbf9b.jpg"                         length="75147"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తెలంగాణతో సోనియాది పేగుబంధం: రేవంత్ రెడ్డి</title>
                                    <description><![CDATA[<p>తెలంగాణతో సోనియాది పేగుబంధం అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌ పరేడ్ గ్రౌండ్స్‌లో ఆదివారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన ప్రసంగించారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/sonias-intestinal-connection-with-telangana-is-revanth-reddy/article-1140"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/screenshot-2024-06-02-111402.jpg" alt=""></a><br /><p>తెలంగాణతో సోనియాది పేగుబంధం అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌ పరేడ్ గ్రౌండ్స్‌లో ఆదివారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన ప్రసంగించారు. తెలంగాణ ప్రజల కలలను నిజం చేసిన సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్‌లకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. </p><p>తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియాగాంధీని ఎందుకు ఆహ్వానించారని కొందరు ప్రశ్నిస్తున్నారని రేవంత్ అన్నారు. కానీ తల్లిని పిలవడానికి ఎవరి అనుమతి లేదని రేవంత్ చెప్పుకొచ్చారు. ‘ప్రపంచంతో నా తెలంగాణ పోటీ పడుతోంది.. ప్రపంచ పటంలోనే హైదరాబాద్‌ను ప్రత్యేకంగా నిలపబోతున్నాం’ అని రేవంత్ రెడ్డి అన్నారు. సర్వ</p><p>అదేవిధంగా 70 రోజుల్లోనే 30వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు, 11,062 పోస్టులకు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆరు గ్యారంటీలకు 1.28కోట్ల దరఖాస్తులు వచ్చాయని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందులో డూప్లికేట్ అప్లికేషన్లు మినహాయించగా 1.9కోట్ల దరఖాస్తులు మిగిలినట్లు చెప్పారు. వాటిని కంప్యూటరీకరించి ప్రజలందరికీ సంక్షేమ పథకాలను అందుబాటులోకి తేవాలని కృషి చేస్తున్నట్లు తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/sonias-intestinal-connection-with-telangana-is-revanth-reddy/article-1140</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/sonias-intestinal-connection-with-telangana-is-revanth-reddy/article-1140</guid>
                <pubDate>Sun, 02 Jun 2024 11:16:43 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/screenshot-2024-06-02-111402.jpg"                         length="88267"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        