<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/ktr/tag-139" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>Ktr - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/139/rss</link>
                <description>Ktr RSS Feed</description>
                
                            <item>
                <title>హామీల అమలులో కాంగ్రెస్ విఫలం.. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ</title>
                                    <description><![CDATA[<p> రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు సగం కాలం పూర్తయినా, ప్రజలకు ఇచ్చిన హామీల్లో 95 శాతం ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఆరోపించారు. </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/congress-failed-to-implement-the-promises/article-9051"><img src="https://www.vishvambhara.com/media/400/2026-02/whatsapp-image-2026-02-19-at-7.03.31-pm.jpeg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, తెలంగాణ బ్యూరో:</strong> రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు సగం కాలం పూర్తయినా, ప్రజలకు ఇచ్చిన హామీల్లో 95 శాతం ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఆరోపించారు. రానున్న 2026-27 బడ్జెట్‌లో అయినా ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు తగిన నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ, సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. నిధులు కేటాయించకపోతే తెలంగాణ సమాజం ఇంకా ఓపిక పట్టే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు, డిక్లరేషన్ల అమలుకు కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు. రెండు బడ్జెట్లలో హామీల అమలుకు నిధులు కేటాయించని ప్రభుత్వం.. ఈ బడ్జెట్‌లో అయినా నిధులు కేటాయించాలని నాలుగు కోట్ల ప్రజల పక్షాన కోరుతున్నానన్నారు.</p>
<p><strong>మహిళలు, రైతులు, యువతకు ద్రోహం </strong><br />ఆరు గ్యారెంటీలలో హామీ ఇచ్చిన మహిళలు, వృద్ధులు, విద్యార్థులు, యువత, రైతన్నల కోసం భారీగా నిధులు కేటాయించాలని కేటీఆర్ కోరారు. అలాగే, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ డిక్లరేషన్ల కింద ఇచ్చిన వాగ్దానాల అమలుకు నిధులు కేటాయించాలన్నారు. రెండు సంవత్సరాలుగా బకాయిపడ్డ హామీలకు, నిధులకు ఈ బడ్జెట్‌లో కేటాయింపులు చేయాలని డిమాండ్ చేశారు. రైతుబంధును రూ.15 వేలకు పెంచుతామని మాటిచ్చి మోసం చేసినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగా క్షమాపణ చెప్పాలని, ఆ మొత్తాన్ని బడ్జెట్‌లో చేర్చాలని డిమాండ్ చేశారు. తొలి ఏడాదే రెండు లక్షల ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి వంటి హామీల అమలుకు కూడా బడ్జెట్‌లో కేటాయింపులు చేయాలన్నారు.</p>
<p><strong>ప్రజాక్షేత్రంలో నిలదీస్తాం - హెచ్చరించిన కేటీఆర్</strong><br />పనికిరాని అంశాలను తెరపైకి తెచ్చి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నాలను తెలంగాణ సమాజం గమనిస్తోందని కేటీఆర్ అన్నారు. నాటి గ్యారంటీ కార్డులే ఇవాళ బాకీ కార్డులై కాంగ్రెస్ పాపాలను ప్రశ్నిస్తున్నాయని పేర్కొన్నారు. "ఇచ్చిన వాగ్దానాల అమలుకు తగిన నిధులు కేటాయించకపోతే, ఎక్కడికక్కడ మోసకారి కాంగ్రెస్‌ను ప్రజలపక్షాన నిలదీస్తాం" అని కేటీఆర్ తీవ్రంగా హెచ్చరించారు. తెలంగాణ ప్రజాగ్రహానికి ముఖ్యమంత్రి, మంత్రులు ప్రజాక్షేత్రంలో తిరగలేరని కేటీఆర్ వ్యాఖ్యానించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/congress-failed-to-implement-the-promises/article-9051</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/congress-failed-to-implement-the-promises/article-9051</guid>
                <pubDate>Thu, 19 Feb 2026 19:08:41 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-02/whatsapp-image-2026-02-19-at-7.03.31-pm.jpeg"                         length="52944"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బందిపోట్లలా దళిత నేత అరెస్టా?: కేటీఆర్</title>
                                    <description><![CDATA[<p>మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వేళ చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలపై బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/dalit-leader-ktr-arrested-like-bandits/article-8924"><img src="https://www.vishvambhara.com/media/400/2026-02/whatsapp-image-2026-02-18-at-6.48.05-pm-(1).jpeg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, తెలంగాణ బ్యూరో: </strong>మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వేళ చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలపై బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఒక దళిత నాయకుడైన బాల్క సుమన్‌ను ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, అకస్మాత్తుగా బందిపోట్ల మాదిరిగా అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని ఆయన ధ్వజమెత్తారు. మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవాలనే ఏకైక లక్ష్యంతో రేవంత్ రెడ్డి సర్కార్ అడ్డదారుల్లో వెళ్తోంది. ఇది ప్రభుత్వ అసమర్థతకు, పిరికిపందతనానికి నిదర్శనం అని కేటీఆర్ మండిపడ్డారు. అరెస్ట్ చేసిన బాల్క సుమన్‌ను తక్షణమే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.</p><p><strong>మంత్రి వివేక్ డైరెక్షన్‌లో ఎన్నికల ప్రక్రియ</strong><br />క్యాతనపల్లిలో జరుగుతున్న ఎన్నిక కేవలం నామమాత్రంగానే ఉందని, తెరవెనుక మంత్రి వివేక్ వెంకటస్వామి నేరుగా అధికారులపై ఒత్తిడి తెస్తూ ఎన్నికల ప్రక్రియను శాసిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. మంత్రి కళ్లసైగలకు అనుగుణంగా రిటర్నింగ్ ఆఫీసర్లు, పోలీసులు నడుచుకోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన వ్యవస్థలు కాంగ్రెస్ నాయకుల చేతిలో కీలుబొమ్మలుగా మారాయని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఉన్నప్పటికీ, దానిని అణచివేసేందుకు ప్రభుత్వం పోలీసు బలగాలను ఉపయోగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.</p><p><strong>పోలీసులకు హెచ్చరిక.. ప్రతిఫలం తప్పదు</strong><br />పోలీసు యంత్రాంగం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి 'ప్రైవేట్ సైన్యం'లా మారిపోయిందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. బాల్క సుమన్‌తో పాటు పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తలను వేధించడం మానుకోవాలని ఆయన సూచించారు. "ఇప్పుడు అధికార పార్టీకి అడుగులకు మడుగులొత్తుతూ, అక్రమాలకు పాల్పడుతున్న ప్రతి ఒక్క పోలీస్ అధికారి గుర్తుంచుకోవాలి.. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. భవిష్యత్తులో మీరు చేసిన ప్రతి తప్పుకు తగిన ప్రతిఫలం చెల్లించుకోవాల్సి ఉంటుంది" అని ఆయన గట్టిగా హెచ్చరించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కాంగ్రెస్ తీరుపై బీఆర్ఎస్ శ్రేణులు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/dalit-leader-ktr-arrested-like-bandits/article-8924</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/dalit-leader-ktr-arrested-like-bandits/article-8924</guid>
                <pubDate>Wed, 18 Feb 2026 19:39:54 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-02/whatsapp-image-2026-02-18-at-6.48.05-pm-%281%29.jpeg"                         length="87429"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తెలంగాణ జాతి హీరో కేసీఆర్: కేటీఆర్</title>
                                    <description><![CDATA[<p>భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ 72వ జన్మదిన వేడుకలు మంగళవారం తెలంగాణ భవన్‌లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాట్లాడుతూ.. తమ నాయకుడు కేసీఆర్ తెలంగాణ జాతికి హీరో అని స్పష్టం చేశారు. </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/telangana-national-hero-kcr-ktr/article-8887"><img src="https://www.vishvambhara.com/media/400/2026-02/whatsapp-image-2026-02-17-at-6.46.12-pm.jpeg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, తెలంగాణ బ్యూరో: </strong>భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ 72వ జన్మదిన వేడుకలు మంగళవారం తెలంగాణ భవన్‌లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాట్లాడుతూ.. తమ నాయకుడు కేసీఆర్ తెలంగాణ జాతికి హీరో అని స్పష్టం చేశారు. కేసీఆర్ ఎప్పుడూ తాను "జాతిపిత"నని చెప్పుకోలేదని, తమ జాతికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన నేతను ప్రజలే అలా పిలుచుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ వేడుకల్లో కేటీఆర్‌తో పాటు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తదితర ముఖ్య నేతలు పాల్గొని 72 కిలోల కేక్ కట్ చేశారు. అలాగే కేసీఆర్ ఉద్యమ ప్రస్థానం, పదేళ్ల పాలనను ప్రతిబింబించే డాక్యుమెంటరీని నేతలు విడుదల చేశారు.</p>
<p><strong>ద్రోహుల జాతి వర్సెస్ ఫైటర్ల జాతి</strong><br />ఈ సందర్భంగా కేటీఆర్ ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉద్యమకారుల మీదకు తుపాకులు తీసుకొని దాడికి వెళ్లిన వారికి "జాతి" నిర్వచనం తెలియదని ఎద్దేవా చేశారు. తెలంగాణ జై నినాదానికి భయపడే వారికి, తెలంగాణ సోయి లేని వారికి జాతి విలువ తెలియదన్నారు. తెలంగాణలో కేవలం "తెలంగాణవాదుల జాతి", "తెలంగాణ ద్రోహుల జాతి" మాత్రమే ఉన్నాయని, తమది ఫైటర్ల జాతి అయితే, వారిది ద్రోహుల జాతి అని కేటీఆర్ ఘాటుగా వ్యాఖ్యానించారు.</p>
<p><strong>కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేయడం అసాధ్యం</strong><br />కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తామని కొందరు అంటున్నారని, తెలంగాణ రాష్ట్రమే కేసీఆర్ ఆనవాళ్లు అయినప్పుడు వాటిని ఎలా చెరిపేస్తారని కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం కోసం పోరాడిన వీరులు, విద్యార్థి అమరవీరుల జాతి తమదని ఆయన కొనియాడారు. కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రి చేయడమే కార్యకర్తలు జన్మదిన సందర్భంగా ఇచ్చే చిరుకానుక అని కేటీఆర్ పిలుపునిచ్చారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/telangana-national-hero-kcr-ktr/article-8887</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/telangana-national-hero-kcr-ktr/article-8887</guid>
                <pubDate>Tue, 17 Feb 2026 18:48:10 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-02/whatsapp-image-2026-02-17-at-6.46.12-pm.jpeg"                         length="80466"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష: కేటీఆర్</title>
                                    <description><![CDATA[<p>తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం బీఆర్ఎస్ భవిష్యత్ కార్యచరణపై ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టత ఇచ్చారు. </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/sri-ramaraksha-ktr-is-the-leadership-of-kcr/article-8820"><img src="https://www.vishvambhara.com/media/400/2026-02/whatsapp-image-2026-02-13-at-6.10.24-pm.jpeg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, తెలంగాణ బ్యూరో: </strong>తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం బీఆర్ఎస్ భవిష్యత్ కార్యచరణపై ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టత ఇచ్చారు. అధికార పార్టీ అడ్డదారులు తొక్కినా, క్షేత్రస్థాయిలో గులాబీ జెండా ధైర్యంగా నిలబడిందని ధీమా వ్యక్తం చేశారు. దాదాపు 30 శాతానికి పైగా వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలవడం సామాన్యమైన విషయం కాదని, ఇది తమ పార్టీపై ప్రజలకున్న నమ్మకానికి నిదర్శనమని పేర్కొన్నారు. కేవలం 15 మున్సిపాలిటీల్లోనే కాకుండా, మరో 37 చోట్ల హంగ్ ఏర్పడేలా ఫలితాలు రావడం వెనుక తమ కార్యకర్తల వీరోచిత పోరాటం ఉందని కేటీఆర్ కొనియాడారు.</p>
<p><strong>అధికార దుర్వినియోగంపై ధ్వజం</strong><br />ఎన్నికల ప్రక్రియలో కాంగ్రెస్ తీరును కేటీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు. గద్వాల, వర్ధన్నపేట వంటి చోట్ల జరిగిన రీ-కౌంటింగ్ గందరగోళాన్ని ప్రస్తావిస్తూ.. అధికారులను అడ్డం పెట్టుకుని, డబ్బు, మద్యం పంపిణీ చేసి అధికార పార్టీ అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికలు సహజంగా అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయని, కానీ ఇక్కడ కాంగ్రెస్ 80-90 శాతం స్థానాలు గెలుచుకోలేకపోవడమే ఆ పార్టీ వైఫల్యానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, దమ్ముంటే ఉప ఎన్నికలకు వెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన బహిరంగ సవాల్ విసిరారు.</p>
<p><strong>ఎర్రజెండాతో దోస్తీ.. కొత్త సమీకరణాలు</strong><br />ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం కార్పొరేషన్ ఫలితాల నేపథ్యంలో కేటీఆర్ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. కాంగ్రెస్, బీజేపీల కుమ్మక్కు రాజకీయాలను తిప్పికొట్టేందుకు సీపీఐతో కలిసి నడిచేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. సింగరేణి ప్రాంతంలో జరుగుతున్న అరాచకాలను అడ్డుకోవాలంటే వామపక్షాలు, బీఆర్ఎస్ కలవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే సీపీఐ నేత కూనంనేని సాంబశివరావుతో మాట్లాడి, కొత్తగూడెం కార్పొరేషన్‌లో ఎర్రజెండాకు పూర్తి మద్దతు ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. కేతన్‌పల్లి మున్సిపాలిటీలో ఇదే తరహాలో కలిసి పనిచేసి విజయం సాధించామని ఆయన గుర్తు చేశారు.</p>
<p>బీఆర్ఎస్ పని అయిపోయిందన్న విమర్శకులకు ఈ ఫలితాలే సమాధానమని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రధాన ప్రతిపక్షంగా తాము ప్రజల గొంతుకగా మారడంలో సఫలమయ్యామని, భవిష్యత్తులో మరిన్ని మెరుగైన ఫలితాల కోసం పకడ్బందీ కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. పార్టీకి కలిసొచ్చే తటస్థులను, ప్రజాస్వామిక శక్తులను కలుపుకొని పోతామని.. రాష్ట్రానికి కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని ప్రజలు భావిస్తున్నారని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ జనంలోనే ఉంటామని స్పష్టం చేశారు. అక్రమ కేసులకు భయపడకుండా పోరాడిన కార్యకర్తలకు అండగా ఉంటామని, త్వరలోనే కొత్త కార్యాచరణ రూపొందిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు.</p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/sri-ramaraksha-ktr-is-the-leadership-of-kcr/article-8820</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/sri-ramaraksha-ktr-is-the-leadership-of-kcr/article-8820</guid>
                <pubDate>Fri, 13 Feb 2026 20:56:33 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-02/whatsapp-image-2026-02-13-at-6.10.24-pm.jpeg"                         length="81983"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>&quot;ఇది ముమ్మాటికీ రాజకీయ కక్ష సాధింపే!&quot; </title>
                                    <description><![CDATA[<p>గత ప్రభుత్వ నిర్ణయాలపై విచారణ పేరుతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నోటీసులు పంపడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/this-is-what-a-political-party-can-do/article-8088"><img src="https://www.vishvambhara.com/media/400/2026-01/97279399-9214-45e4-828a-fb754cda49f1.jpg" alt=""></a><br /><div><strong>విశ్వంభర, తెలంగాణ బ్యూరో:</strong> గత ప్రభుత్వ నిర్ణయాలపై విచారణ పేరుతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నోటీసులు పంపడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు. ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్య అని, ప్రస్తుత ప్రభుత్వం తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే ఇదంతా చేస్తోందని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో ఉన్న విద్యుత్ సంక్షోభాన్ని అధిగమించడానికి కేసీఆర్ ప్రభుత్వం ఎంతో ముందుచూపుతో నిర్ణయాలు తీసుకుందని కేటీఆర్ గుర్తు చేశారు. చత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కానీ, యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణం కానీ అప్పట్లో ఉన్న అత్యవసర పరిస్థితుల దృష్ట్యా, నిబంధనలకు లోబడే జరిగాయని ఆయన స్పష్టం చేశారు. ఏ విచారణకైనా తాము సిద్ధమని, అయితే ఆ విచారణ పారదర్శకంగా ఉండాలని ఆయన డిమాండ్ చేశారు.</div>
<div> </div>
<div><strong>నోటీసులకు తాము భయపడే ప్రసక్తే లేదు..</strong></div>
<div>ప్రజా కోర్టులో ఓడిపోయినప్పటికీ, తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ స్థానం సుస్థిరమని, ఇలాంటి నోటీసులకు తాము భయపడే ప్రసక్తే లేదని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేక, ఇలాంటి పాత అంశాలను మళ్ళీ తెరపైకి తెచ్చి కాలయాపన చేస్తోందని ఆయన మండిపడ్డారు. చట్టపరంగానే ఈ నోటీసులను ఎదుర్కొంటామని, నిజనిజాలు త్వరలోనే ప్రజల ముందుకు వస్తాయని కేటీఆర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/this-is-what-a-political-party-can-do/article-8088</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/this-is-what-a-political-party-can-do/article-8088</guid>
                <pubDate>Thu, 29 Jan 2026 20:24:22 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-01/97279399-9214-45e4-828a-fb754cda49f1.jpg"                         length="10017"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>హరీశ్, కేటీఆర్‌లపై కవిత ఘాటు విమర్శలు</title>
                                    <description><![CDATA[<p><strong> </strong>తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. బీఆర్‌ఎస్ ముఖ్య నేతలు హరీశ్ రావు, కేటీఆర్‌లపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/kavitha-criticizes-harish-ktr/article-7918"><img src="https://www.vishvambhara.com/media/400/2026-01/43c8d8c4-6b20-4fcb-8e38-939ff22df464.jpeg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, తెలంగాణ బ్యూరో: </strong>తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. బీఆర్‌ఎస్ ముఖ్య నేతలు హరీశ్ రావు, కేటీఆర్‌లపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నైనీ కోల్ బ్లాక్ టెండర్ల వ్యవహారంలో ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. నైనీ టెండర్ల విషయంలో హరీశ్ రావు వైఖరిని కవిత తీవ్రంగా తప్పుబట్టారు. "భట్టి విక్రమార్క ప్రెస్ మీట్ పెట్టగానే మా 'గుంట నక్క' (హరీశ్ రావు) రంగంలోకి దిగారు. ఆ మాటలను గుడ్డిగా నమ్మి కేటీఆర్ కూడా ప్రెస్ మీట్ పెట్టారు" అని ఎద్దేవా చేశారు.</p>
<p>ఈ వ్యవహారంలో సృజన్ రెడ్డి కేవలం చిన్న చేప మాత్రమేనని, అసలు తిమింగలం లాంటి కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డిని కాపాడేందుకే హరీశ్ రావు తాపత్రయపడుతున్నారని ఆరోపించారు. ఒక కాంట్రాక్టర్‌కు అన్యాయం జరుగుతోందని బీఆర్‌ఎస్ ఆవేదన చెందడం హాస్యాస్పదమని మండిపడ్డారు.</p>
<p>ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ తీరుపై కవిత సెటైర్లు వేశారు. ఈ కేసు విచారణ రెండేళ్లుగా సాగుతూ.. ఏళ్ల తరబడి సాగే 'కార్తీకదీపం' సీరియల్‌ను తలపిస్తోందని విమర్శించారు. కేవలం ఎన్నికల లబ్ధి కోసమే దీనిని వాడుకుంటున్నారని ఆరోపించారు. తీవ్రవాదుల కోసం వాడాల్సిన ట్యాపింగ్‌ను రాజకీయాల కోసం వాడటం సరికాదని, బాధితులకు వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.</p>
<p><strong>కొత్త పార్టీపై సంకేతాలు: ‘జాగృతి పార్టీ’లో చేరండి!</strong></p>
<p>తన రాజకీయ భవిష్యత్తుపై కవిత స్పష్టతనిస్తూనే, కొత్త పార్టీ పేరుపై హింట్ ఇచ్చారు. తాను కాంగ్రెస్‌లో చేరుతానన్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలను కొట్టిపారేశారు. "నేను కాంగ్రెస్‌లో చేరను. మీరే జాగృతి పార్టీలో చేరండి. భవిష్యత్తులో నేను స్థాపించే పార్టీనే అధికారంలోకి వస్తుంది.. అప్పుడు మీకు కీలక పదవి ఇస్తా" అని వ్యాఖ్యానించారు. దీనితో ఆమె స్థాపించబోయే కొత్త పార్టీ పేరు 'తెలంగాణ జాగృతి'అని ఉండబోతోందనే చర్చ మొదలైంది.</p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/kavitha-criticizes-harish-ktr/article-7918</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/kavitha-criticizes-harish-ktr/article-7918</guid>
                <pubDate>Sun, 25 Jan 2026 18:27:42 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-01/43c8d8c4-6b20-4fcb-8e38-939ff22df464.jpeg"                         length="48852"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కేటీఆర్‌పై సిట్ ప్రశ్నల వర్షం</title>
                                    <description><![CDATA[<p>తెలంగాణను కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ను సిట్ అధికారులు శుక్రవారం సుదీర్ఘంగా విచారించారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/sit-rains-questions-on-ktr/article-7900"><img src="https://www.vishvambhara.com/media/400/2026-01/90d0155d-1b33-44b1-82d0-f22e67ab8af7.jpg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, తెలంగాణ బ్యూరో: </strong>తెలంగాణను కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ను సిట్ అధికారులు శుక్రవారం సుదీర్ఘంగా విచారించారు. జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయంలో ఉదయం ప్రారంభమైన ఈ విచారణ సాయంత్రం వరకు దాదాపు 7 గంటల పాటు కొనసాగింది. రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న ఈ విచారణలో సిట్ బృందం కేటీఆర్ నుంచి పలు కీలక విషయాలను రాబట్టినట్లు సమాచారం. ఈ కేసులో ఏ4 ప్రధాన నిందితుడిగా ఉండి, ప్రస్తుతం జైలులో ఉన్న మాజీ డీసీపీ రాధాకిషన్ రావును అధికారులు విచారణ కేంద్రానికి రప్పించారు. కేటీఆర్, రాధాకిషన్ రావులను ఒకే గదిలో కూర్చోబెట్టి, గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలపై ఆరా తీశారు. నిందితుడు ఇచ్చిన వాంగ్మూలానికి, కేటీఆర్ చెబుతున్న సమాధానాలకు మధ్య ఉన్న పొంతనను అధికారులు నిశితంగా పరిశీలించారు.</p>
<p>తొమ్మిది మంది సభ్యులతో కూడిన సిట్ బృందం, సీపీ సజ్జనార్ పర్యవేక్షణలో కేటీఆర్‌పై ప్రశ్నల వర్షం కురిపించింది. 2023 ఎన్నికలకు ముందు అప్పటి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్‌కు ఆదేశాలు ఎవరిచ్చారు? దీని వెనుక ఉన్న రాజకీయ ప్రయోజనం ఏమిటి? ఎస్‌ఐబీ (SIB) అధికారులకు, ప్రభుత్వ పెద్దలకు మధ్య వారధిగా ఎవరు వ్యవహరించారు? ఎన్నికల సమయంలో పార్టీ విరాళాల కోసం బిల్డర్లు, వ్యాపారవేత్తల ఫోన్లు ట్యాప్ చేసి వారిని బెదిరించినట్లు వస్తున్న ఆరోపణల్లో నిజమెంత? పార్టీ ఫండ్స్ సేకరించడంలో పోలీసు అధికారుల ప్రమేయం ఎందుకు ఉంది? వంటి అంశాలపై సిట్ అధికారులు కేటీఆర్‌ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది.  సిట్ అధికారులు ఈ విచారణను వీడియో రికార్డింగ్ కూడా చేసినట్లు తెలుస్తోంది. కేటీఆర్ ఇచ్చిన సమాధానాలను ఇతర నిందితుల స్టేట్‌మెంట్లతో పోల్చి చూసి, అవసరమైతే మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉందని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి.</p>
<p><strong>బీఆర్ఎస్ శ్రేణుల్లో గుబులు</strong><br />కేటీఆర్ విచారణ వార్త బయటకు రావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది. ఇప్పటికే హరీష్ రావు, ఇప్పుడు కేటీఆర్‌ను విచారించడంతో.. ఈ కేసు కేవలం అధికారులకే పరిమితం కాకుండా రాజకీయంగా పెద్దలందరినీ చుట్టుముట్టే అవకాశం ఉందని స్పష్టమవుతోంది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ప్రైవేట్ వ్యక్తుల డేటాను దొంగిలించడం, విపక్ష నేతల కదలికలపై నిఘా ఉంచడం వంటి అంశాలపై సిట్ వద్ద పక్కా ఆధారాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. </p>
<p>హైదరాబాద్ సీపీ నేతృత్వంలోని బృందం సేకరించిన ఆధారాలు, టెక్నికల్ డేటా ఆధారంగా త్వరలోనే చార్జిషీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఈ కేసులో రాజకీయ నాయకుల ప్రమేయంపై స్పష్టత రావడంతో, రాబోయే రోజుల్లో మరిన్ని అరెస్టులు ఉంటాయా అన్నది రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.</p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/sit-rains-questions-on-ktr/article-7900</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/sit-rains-questions-on-ktr/article-7900</guid>
                <pubDate>Fri, 23 Jan 2026 21:40:45 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-01/90d0155d-1b33-44b1-82d0-f22e67ab8af7.jpg"                         length="73473"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఇది 'లీకుల' ప్రభుత్వం: కేటీఆర్</title>
                                    <description><![CDATA[<p>కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు 'కాలక్షేప కథాచిత్రాలు' నడుపుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధ్వజమెత్తారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/this-is-the-leak-government-ktr/article-7890"><img src="https://www.vishvambhara.com/media/400/2026-01/d69b7c2b-158b-4ef8-bf1d-6bc4c36a98db.jpg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, తెలంగాణ బ్యూరో: </strong>కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు 'కాలక్షేప కథాచిత్రాలు' నడుపుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధ్వజమెత్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సెట్ విచారణ ముగిసిన అనంతరం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై, సిట్ తీరుపై ఆయన నిప్పులు చెరిగారు. విచారణ గదిలో ఆరుగురు అధికారుల మధ్య జరిగిన విషయాలు బయటకు ఎలా వస్తున్నాయని కేటీఆర్ ప్రశ్నించారు. "ఇది లీకు వీరుల ప్రభుత్వం. విచారణలో ఏమీ లేకపోయినా, బయటకు మాత్రం ఏదో జరిగిపోతోందని తప్పుడు లీకులు ఇస్తున్నారు. హీరోయిన్ల పేర్లు వాడుతూ మా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. ఇదే విషయం అధికారులను అడిగితే.. తాము మీడియాకు ఏమీ చెప్పలేదని నీళ్లు నములుతున్నారు" అని ఆయన విమర్శించారు.</p>
<p>పాత ప్రశ్నలనే అడుగుతూ వేధిస్తున్నారని, విచారణ పేరుతో సమయం వృథా చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. "మీకు ఏ నటులు ఫిర్యాదు చేశారు?" అని ప్రశ్నిస్తే అధికారులు సమాధానం చెప్పలేకపోయారని తెలిపారు. "ఇవాళ్టి విచారణలో నేను తప్ప ఏ ‘రావూ’ లేరు.. నన్ను ఎవరితోనూ కలిపి విచారించలేదు" అని స్పష్టం చేశారు.</p>
<p><strong>బొగ్గు కుంభకోణంపై చర్యలేవి?</strong><br />రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలపై ప్రభుత్వం మౌనంగా ఉందని కేటీఆర్ విమర్శించారు. హరీష్ రావు ఆధారాలతో సహా బయటపెట్టిన సింగరేణి టెండర్ల అక్రమాలపై చర్యలు ఎందుకు లేవని ప్రశ్నించారు. బొగ్గు కుంభకోణంలో సీఎం రేవంత్ రెడ్డి బావమరిదే 'కింగ్ పిన్' అని, ఆయనపై చర్యలు తీసుకునే దమ్ము ప్రభుత్వానికి ఉందా? అని సవాల్ విసిరారు. "ఇప్పుడు మా ఫోన్లు ట్యాప్ అవ్వట్లేదా? అని అడిగితే అధికారులు మౌనం వహిస్తున్నారు" అని ఎద్దేవా చేశారు. ఎన్నిసార్లు విచారణ పేరుతో వేధించినా తట్టుకుంటామన్నారు. ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని.. ఎవరికీ భయపడే ప్రసక్తే లేదని కేటీఆర్ స్పష్టం చేశారు.</p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/this-is-the-leak-government-ktr/article-7890</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/this-is-the-leak-government-ktr/article-7890</guid>
                <pubDate>Fri, 23 Jan 2026 21:32:35 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-01/d69b7c2b-158b-4ef8-bf1d-6bc4c36a98db.jpg"                         length="70400"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కేటీఆర్‌కు ఫోన్ ట్యాపింగ్ సెగ</title>
                                    <description><![CDATA[<p>రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ ముమ్మరమైంది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) నోటీసులు జారీ చేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/ktrs-phone-tapping-seg/article-7827"><img src="https://www.vishvambhara.com/media/400/2026-01/35abe762-bc86-4f79-bae6-69ef423ae1f3.jpg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, తెలంగాణ బ్యూరో:</strong> రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ ముమ్మరమైంది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) నోటీసులు జారీ చేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. గురువారం మధ్యాహ్నం హైదరాబాద్ నందినగర్‌లోని కేటీఆర్ నివాసానికి చేరుకున్న పోలీసులు, ఆయనకు స్వయంగా ఈ నోటీసులు అందజేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక సమాచారం సేకరించేందుకు గాను కేటీఆర్‌ను విచారించాల్సిన అవసరం ఉందని సిట్ అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారణాధికారుల ముందు హాజరు కావాలని ఆ నోటీసుల్లో స్పష్టం చేశారు. కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన నిందితుల వాంగ్మూలాలు, దర్యాప్తులో వెలుగు చూసిన అంశాల ఆధారంగా కేటీఆర్‌ను ప్రశ్నించనున్నట్లు సమాచారం.</p>
<p><strong>కేసు నేపథ్యమిదే</strong><br />గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతలు, వ్యాపారవేత్తలు, చివరకు తమ పార్టీ నేతల ఫోన్లను కూడా అక్రమంగా ట్యాప్ చేశారనే ఆరోపణలపై ప్రస్తుత ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించింది. ఈ కేసులో ఇప్పటికే పలువురు ఉన్నతాధికారులు జైలులో ఉండగా, తాజాగా రాజకీయ నేతల వైపు దర్యాప్తు మళ్ళింది. కేటీఆర్ నివాసానికి పోలీసులు వెళ్లిన విషయం తెలియగానే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడకు చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.</p>
<p><strong>రాజకీయ ప్రకంపనలు</strong><br />కేటీఆర్‌కు నోటీసులు అందడంపై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ప్రభుత్వం ఇలాంటి చర్యలకు దిగుతోందని వారు ఆరోపిస్తున్నారు. అయితే, చట్టం తన పని తాను చేసుకుపోతుందని, విచారణలో అన్ని నిజాలు బయటపడతాయని అధికార పక్షం స్పష్టం చేస్తోంది. రేపటి విచారణలో కేటీఆర్ ఎలాంటి సమాధానాలు ఇస్తారు? ఈ కేసు మరిన్ని మలుపులు తిరగబోతోందా? అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.</p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/ktrs-phone-tapping-seg/article-7827</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/ktrs-phone-tapping-seg/article-7827</guid>
                <pubDate>Thu, 22 Jan 2026 21:24:04 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-01/35abe762-bc86-4f79-bae6-69ef423ae1f3.jpg"                         length="56002"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సిట్ అనేది రేవంత్ చేతిలో కీలుబొమ్మ!</title>
                                    <description><![CDATA[<p>రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసుల అందడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/sit-is-a-puppet-in-revanths-hands/article-7810"><img src="https://www.vishvambhara.com/media/400/2026-01/ddf431a8-3d4c-40c8-bf1f-9e33e9ebeedd.jpg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, తెలంగాణ బ్యూరో: </strong>రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసుల అందడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. గురువారం సిరిసిల్లలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి 'డైవర్షన్ పాలిటిక్స్' చేస్తోందని ధ్వజమెత్తారు. సిట్ అనేది రేవంత్ రెడ్డి సిట్ అంటే కూర్చుంటుంది.. స్టాండ్ అంటే నిలబడుతుందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాళేశ్వరం, కారు రేస్, గొర్రెల పంపిణీ.. ఇలా రోజుకో డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ పేరుతో కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. ఇవన్నీ 'కార్తీకదీపం' సీరియల్ లాగా సాగదీయడం తప్ప ఇందులో వాస్తవం ఏమీ లేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. సింగరేణి కుంభకోణాన్ని బయటపెట్టినందుకే తనతో పాటు హరీష్ రావుకు నోటీసులు ఇచ్చారని ఆయన ఆరోపించారు.</p>
<p><strong>ట్యాపింగ్ నేరమెలా అవుతుంది?</strong><br />ఫోన్ ట్యాపింగ్ అంశంపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. "ట్యాపింగ్ చేయడం నేరమేం కాదు. 1952 నుంచి దేశ భద్రత కోసం, ప్రభుత్వాలను అస్థిరపరిచే కుట్రల నుంచి రక్షించేందుకు నిఘా వ్యవస్థలు ఈ పని చేస్తూనే ఉన్నాయి. ఇది పూర్తిగా పోలీసు వ్యవస్థ కనుసన్నల్లో జరిగే ప్రక్రియ. ఇందులో మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఎలాంటి సంబంధం ఉండదు. ప్రభుత్వానికి కావాల్సిన సమాచారం కోసం పోలీసులు సమాచారాన్ని సేకరిస్తారు" అని ఆయన వివరించారు.</p>
<p><strong>ముందు డీజీపీని విచారించండి</strong><br />ఈ కేసులో తనను, హరీష్ రావును పిలవడంలో అర్థం లేదని కేటీఆర్ అన్నారు. "ఫోన్ ట్యాపింగ్ కేసులో ముందుగా విచారించాల్సింది ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డినే. ఆయనను వదిలేసి మమ్మల్ని పిలిస్తే ఏం వస్తుంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాపింగ్ చేయిస్తున్నారు. రేపు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక విచారణ జరిపిస్తే వీళ్లంతా జైలుకు వెళ్లడం ఖాయం" అని హెచ్చరించారు.</p>
<p><strong>విచారణకు వెళ్తాను</strong><br />సిట్ ఇచ్చిన నోటీసుల మేరకు తాను విచారణకు వెళ్తానని కేటీఆర్ స్పష్టం చేశారు. తన ఫోన్ ట్యాపింగ్ అవుతోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నప్పుడు ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఇది పూర్తిగా అబద్ధపు కేసు అని, ఇందులో ఎలాంటి ఆధారాలు లేవని ఆయన కొట్టిపారేశారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. హామీలు అమలు చేయలేకనే రేవంత్ రెడ్డి ఇలాంటి చిల్లర రాజకీయాలకు తెరలేపుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు.</p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/sit-is-a-puppet-in-revanths-hands/article-7810</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/sit-is-a-puppet-in-revanths-hands/article-7810</guid>
                <pubDate>Thu, 22 Jan 2026 20:29:54 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-01/ddf431a8-3d4c-40c8-bf1f-9e33e9ebeedd.jpg"                         length="63150"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>గ్రీన్ కోను కాపాడేందుకు బ్యాగులు తీసుకుంటున్నారా?</title>
                                    <description><![CDATA[<p>మున్సిపల్ ఎన్నికల నగారా మోగుతున్న వేళ బీఆర్ఎస్ శ్రేణులకు ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/taking-bags-to-save-green-co/article-7795"><img src="https://www.vishvambhara.com/media/400/2026-01/2b18c593-1c0a-41e1-b686-cd36199a4c1c.jpg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, తెలంగాణ బ్యూరో: </strong>మున్సిపల్ ఎన్నికల నగారా మోగుతున్న వేళ బీఆర్ఎస్ శ్రేణులకు ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. బుధవారం తెలంగాణ భవన్‌లో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. అభ్యర్థులు ఎవరనేది పక్కనపెట్టి, మళ్లీ కేసీఆర్ సీఎం కావాలంటే 'కారు' గుర్తు చూసి ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తాము పదేళ్లలో చేసిన అభివృద్ధిని, కాంగ్రెస్ హయాంలో ఆగిపోయిన పనులను ప్రజలకు వివరిస్తామని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీలు కలిసే దావోస్‌లో చర్చలు జరుపుతున్నాయన్నారు. వీరి బండారం బయటపెడతామని కేటీఆర్ తెలిపాు.</p><p><strong>సింగరేణి కుంభకోణంపై 'సిట్టింగ్ జడ్జి' విచారణకు డిమాండ్</strong><br />సింగరేణి బొగ్గు గనుల కేటాయింపులో గతంలో ఎన్నడూ లేనంత దోపిడీ జరుగుతోందని కేటీఆర్ మండిపడ్డారు. కొత్త విధానం పేరుతో కాంగ్రెస్ నేతలు రూ.6 వేల కోట్లు పంచుకుంటున్నారని ఆరోపించారు. దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఫార్ములా-ఇ రేసులో తాము 'గ్రీన్ కో'కు లబ్ధి చేకూర్చామని విమర్శించిన రేవంత్ సర్కార్.. ఇప్పుడు దావోస్‌లో వారితోనే చర్చలు జరపడం వెనుక అర్థమేమిటని ప్రశ్నించారు. గ్రీన్ కోను కాపాడేందుకు బ్యాగులు తీసుకుంటున్నారా? అని ఎద్దేవా చేశారు.</p><p><strong>జిల్లాల రద్దుపై హెచ్చరిక</strong><br />కొత్త జిల్లాలను రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. జిల్లాల తొలగింపుపై ప్రజల్లో ఆందోళన ఉందన్నారు. ఇప్పుడు కాంగ్రెస్‌కు ఓటు వేస్తే జిల్లాల రద్దుకు మీరు అనుమతి ఇచ్చినట్లే అవుతుందని చెప్పారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరిట జిల్లా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు జిల్లాలనే ఎత్తేస్తారా? అని ప్రశ్నించారు. 'ఫ్యూచర్ సిటీ' పేరుతో జంట నగరాల అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారని, సికింద్రాబాద్ ఉద్యమకారులపై అక్రమ అరెస్టులు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డిని నిలదీశారు.</p><p>సీఎం రేవంత్‌కు సవాళ్లు<br />సీఎం రేవంత్ రెడ్డి కాలికి బలపం కట్టుకుని తిరిగినా సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పరాభవం తప్పలేదని, పటాన్‌చెరులో కాంగ్రెస్ ఎమ్మెల్యే సైతం బీఆర్ఎస్‌కే ఓటు వేయమని చెబుతున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. రెండేళ్లలో రూ.2.5 లక్షల కోట్ల అప్పు చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. ఆ నిధులతో రాష్ట్రానికి ఏం చేసిందో చూపించాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసును రెండేళ్లుగా కేవలం రాజకీయాల కోసమే సాగదీస్తున్నారని విమర్శించారు.<br /></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/taking-bags-to-save-green-co/article-7795</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/taking-bags-to-save-green-co/article-7795</guid>
                <pubDate>Wed, 21 Jan 2026 20:06:29 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-01/2b18c593-1c0a-41e1-b686-cd36199a4c1c.jpg"                         length="24646"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఇది 'సిట్' విచారణ కాదు.. 'పిచ్చి' విచారణ</title>
                                    <description><![CDATA[<p>రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/this-is-not-a-sit-inquiry-but-a-madness-inquiry/article-7764"><img src="https://www.vishvambhara.com/media/400/2026-01/0a009c7d-5bfb-4e57-8010-5cf13f874603.jpeg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, తెలంగాణ బ్యూరో: </strong>రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. మాజీ మంత్రి హరీశ్ రావును సిట్ విచారణకు పిలవడంపై తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇది నిష్పక్షపాతంగా జరుగుతున్న విచారణ కాదని, కేవలం రాజకీయ కక్షసాధింపులో భాగంగానే ప్రభుత్వం ఇలా చేస్తోందని ధ్వజమెత్తారు. "ఇది సిట్ (SIT) విచారణ కాదు.. ఇదొక పిచ్చి విచారణ" అంటూ కేటీఆర్ అభివర్ణించారు. తమ పార్టీ నాయకులను వేధించడమే లక్ష్యంగా ఈ విచారణ సాగుతోందని ఆరోపించారు. ఒకవేళ ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టి వేధించాలని చూస్తే.. న్యాయం కోసం హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు పోరాడుతామని ఆయన స్పష్టం చేశారు.</p>
<p><strong>హామీలు నెరవేర్చలేకనే ఈ డ్రామాలు</strong><br />అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ఇప్పుడు ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేక చేతులెత్తేసిందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ప్రజలు తమ సమస్యలపై నిలదీస్తుంటే, వారి దృష్టిని మళ్లించేందుకే పాత కేసులను తోడుతూ ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు. కేవలం ఫోన్ ట్యాపింగ్ అంశమే కాకుండా, సింగరేణి టెండర్లలో జరుగుతున్న అవినీతిపై కేటీఆర్ బాంబు పేల్చారు.  సింగరేణి టెండర్ల కుంభకోణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డి అసలు సూత్రధారి అని కేటీఆర్ ఆరోపించారు. ఈ టెండర్ల వ్యవహారంలో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని.. దీనిపై సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో గొంతు నొక్కే ప్రయత్నం చేస్తే ఊరుకోమని, ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎండగడుతూనే ఉంటామని కేటీఆర్ పునరుద్ఘాటించారు. రాజకీయ ప్రయోజనాల కోసం పోలీసు వ్యవస్థను వాడుకోవడం తగదని ఆయన హితవు పలికారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/this-is-not-a-sit-inquiry-but-a-madness-inquiry/article-7764</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/this-is-not-a-sit-inquiry-but-a-madness-inquiry/article-7764</guid>
                <pubDate>Tue, 20 Jan 2026 15:11:56 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-01/0a009c7d-5bfb-4e57-8010-5cf13f874603.jpeg"                         length="166589"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        