<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/karnataka/tag-1255" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>karnataka - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/1255/rss</link>
                <description>karnataka RSS Feed</description>
                
                            <item>
                <title>ఉర్దూ పాఠశాలల వేళల్లో మార్పు</title>
                                    <description><![CDATA[<p>పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రంలోని ఉర్దూ మీడియం పాఠశాలల పనివేళల్లో కీలక మార్పులు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/national/change-in-timings-of-urdu-schools/article-8312"><img src="https://www.vishvambhara.com/media/400/2026-02/88c6c5aa-36cf-4641-8da1-50cbe501ffe9.jpg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, తెలంగాణ బ్యూరో: </strong>పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రంలోని ఉర్దూ మీడియం పాఠశాలల పనివేళల్లో కీలక మార్పులు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. 2026 ఫిబ్రవరి 17 లేదా 18 నుంచి రంజాన్ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో, విద్యార్థులు, ఉపాధ్యాయుల సౌకర్యార్థం ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, మరియు అన్-ఎయిడెడ్ ఉర్దూ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పాఠశాలలు ఉండనున్నాయి. రంజాన్ ప్రారంభం నుండి మార్చి 20, 2026 వరకు ఈ పనివేళలు అమలులో ఉండనున్నాయి. మార్చి 20 తర్వాత తిరిగి యథావిధిగా పాత పనివేళలే అమలులోకి వస్తాయి.</p>
<p>2002 అక్టోబరు 31 నాటి స్టాండింగ్ ఆర్డర్‌ను అనుసరిస్తూ ఉర్దూ, మైనారిటీ భాషా పాఠశాలల డైరెక్టరేట్ ఈ నిర్ణయం తీసుకుంది. సాధారణ పాఠశాలల్లో పనిచేసే ముస్లిం ఉపాధ్యాయులు, విద్యార్థులు కూడా సాయంత్రం నిర్ణీత సమయం కంటే అరగంట ముందుగానే ఇంటికి వెళ్లేందుకు ప్రత్యేక అనుమతి లభించింది. ఎండల తీవ్రత, ఉపవాస దీక్షల (రోజా) వల్ల కలిగే అలసటను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఈ వెసులుబాటు కల్పించింది.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                    

                <link>https://www.vishvambhara.com/national/change-in-timings-of-urdu-schools/article-8312</link>
                <guid>https://www.vishvambhara.com/national/change-in-timings-of-urdu-schools/article-8312</guid>
                <pubDate>Mon, 02 Feb 2026 21:18:08 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-02/88c6c5aa-36cf-4641-8da1-50cbe501ffe9.jpg"                         length="47301"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సినిమాపై 'రాజకీయ' నీడ.. సీఎం సిద్ధరామయ్యకు ప్రకాష్ రాజ్ విజ్ఞప్తి</title>
                                    <description><![CDATA[<p>కళలకు, సాహిత్యానికి రాజకీయ రంగు పూయడం సరికాదని సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ అభిప్రాయపడ్డారు. </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/movies/prakash-raj-appeals-to-cm-siddaramaiah-to-cast-a-political/article-8108"><img src="https://www.vishvambhara.com/media/400/2026-01/6620d6b9-cce0-44f1-8e5e-995d38a0d9fe.jpeg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, సినిమా బ్యూరో: </strong>కళలకు, సాహిత్యానికి రాజకీయ రంగు పూయడం సరికాదని సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ అభిప్రాయపడ్డారు. 17వ బెంగళూరు అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో బ్రాండ్ అంబాసిడర్‌గా పాల్గొన్న ఆయన, చలన చిత్ర రంగంలో పెరుగుతున్న రాజకీయ జోక్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చలన చిత్రోత్సవాల ప్రధాన ఉద్దేశం విభిన్న సంస్కృతులను, భిన్నమైన ఆలోచనలను ప్రపంచానికి పరిచయం చేయడమేనని ప్రకాష్ రాజ్ గుర్తు చేశారు.</p>
<p>ఇటీవల కాలంలో సాహిత్య, సినిమా వేదికలపై రాజకీయ ప్రభావం పెరిగిపోయిందని, ఇది కళాకారుల స్వేచ్ఛను హరిస్తోందని ప్రకాష్ రాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ వేదికలపై పాలస్తీనా సినిమాలను నిషేధించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఇది ఆమోదయోగ్యం కాదని, కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించాలని కోరారు. "పాలస్తీనా చిత్రాల ప్రదర్శన విషయంలో కేరళ ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. అక్కడ ఆ సినిమాలను ప్రదర్శించారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే దిశగా అడుగులు వేయాలి" అని ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు విజ్ఞప్తి చేశారు.</p>
<p><strong>ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందన</strong><br />చిత్రోత్సవ ప్రారంభ వేడుకల్లో పాల్గొన్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చిత్ర పరిశ్రమకు భరోసా ఇచ్చారు. సమాజ శ్రేయస్సును కోరుతూ, సామాజిక మార్పు కోసం నిర్మించే చిత్రాలకు తమ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కర్ణాటక చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Movies</category>
                                    

                <link>https://www.vishvambhara.com/movies/prakash-raj-appeals-to-cm-siddaramaiah-to-cast-a-political/article-8108</link>
                <guid>https://www.vishvambhara.com/movies/prakash-raj-appeals-to-cm-siddaramaiah-to-cast-a-political/article-8108</guid>
                <pubDate>Fri, 30 Jan 2026 14:38:41 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-01/6620d6b9-cce0-44f1-8e5e-995d38a0d9fe.jpeg"                         length="170657"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సిలికాన్ సిటీ కాదు.. ట్రాఫిక్ సిటీ! </title>
                                    <description><![CDATA[<p>ట్రాఫిక్ కష్టాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన కర్ణాటక రాజధాని బెంగళూరు, ప్రపంచంలోనే అత్యంత రద్దీ నగరాల జాబితాలో రెండో స్థానానికి చేరింది.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/national/traffic-city-is-not-silicon-city/article-7831"><img src="https://www.vishvambhara.com/media/400/2026-01/b46740a1-0c57-4dc3-98e3-cdfe92839f21.jpg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, నేషనల్ బ్యూరో:</strong> ట్రాఫిక్ కష్టాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన కర్ణాటక రాజధాని బెంగళూరు, ప్రపంచంలోనే అత్యంత రద్దీ నగరాల జాబితాలో రెండో స్థానానికి చేరింది. నెదర్లాండ్స్‌కు చెందిన లొకేషన్ టెక్నాలజీ సంస్థ 'టామ్‌టామ్' విడుదల చేసిన 2025 ట్రాఫిక్ సూచీలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. మెక్సికో సిటీ ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలవగా.. భారత ఐటీ హబ్ అయిన బెంగళూరు రెండో స్థానంలో నిలిచి వాహనదారుల అవస్థలను కళ్లకు కట్టింది.</p>
<p>టామ్‌టామ్ విడుదల చేసిన ట్రాఫిక్ సూచీ-2025 ప్రకారం.. బెంగళూరు నగరంలో కేవలం 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి సగటున 36 నిమిషాల 9 సెకన్ల సమయం పడుతోంది. 2024తో పోలిస్తే ఈ సమయం మరో 2 నిమిషాలు పెరగడం గమనార్హం. రద్దీ వేళల్లో నగరంలో వాహనాల సగటు వేగం గంటకు కేవలం 13.9 కిలోమీటర్లకు పడిపోయింది. అంటే వాహనం కంటే వేగంగా మనిషి నడవగలడనే విమర్శలు వినిపిస్తున్నాయి.  2025, మే 17న బెంగళూరులో ట్రాఫిక్ రికార్డు స్థాయికి చేరింది. ఆ రోజు సాయంత్రం 6 గంటల సమయంలో 15 నిమిషాల ప్రయాణంలో వాహనదారులు కేవలం 2.5 కిలోమీటర్లు మాత్రమే కదలగలిగారు. సగటున ఒక బెంగళూరు వాసి ఏడాదికి 168 గంటల సమయాన్ని (అంటే సుమారు ఏడు రోజుల పాటు) కేవలం ట్రాఫిక్ జామ్‌లలోనే కోల్పోతున్నట్లు నివేదిక స్పష్టం చేసింది. </p>
<p><strong>భారత్ లోని ఇతర నగరాల పరిస్థితి</strong><br />ప్రపంచంలోని టాప్-5 రద్దీ నగరాల్లో బెంగళూరుతో పాటు మహారాష్ట్రలోని పుణె (5వ స్థానం) కూడా చోటు దక్కించుకుంది. ముంబయి (18వ స్థానం), దిల్లీ (23వ స్థానం), కోల్‌కతా (29వ స్థానం),  జైపుర్‌ (30వ స్థానం)చెన్నై (32వ స్థానం). హైదరాబాద్ (47వ స్థానం)ల్లో నిలిచాయి. ప్రపంచవ్యాప్తంగా 500 నగరాల్లో సేకరించిన 3.65 ట్రిలియన్ కిలోమీటర్ల డేటా ఆధారంగా ఈ ర్యాంకులను కేటాయించారు. పెరుగుతున్న వాహనాల సంఖ్య, రోడ్ల విస్తరణ లేకపోవడం, మౌలిక సదుపాయాల పనుల జాప్యం కారణంగానే భారత్‌లోని మెట్రో నగరాలు ఈ జాబితాలో ముందు వరుసలో నిలుస్తున్నాయి.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                    

                <link>https://www.vishvambhara.com/national/traffic-city-is-not-silicon-city/article-7831</link>
                <guid>https://www.vishvambhara.com/national/traffic-city-is-not-silicon-city/article-7831</guid>
                <pubDate>Thu, 22 Jan 2026 21:27:55 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-01/b46740a1-0c57-4dc3-98e3-cdfe92839f21.jpg"                         length="53371"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>విహారయాత్రలో విషాదం.. జలపాతంలో పడి హైదరాబాదీ మృతి</title>
                                    <description><![CDATA[<p>వర్షాలకు జలపాతం వద్ద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో నీటి మధ్యలో ఉన్న రాళ్లపై శ్రవణ్, అతని స్నేహితుడు సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించారు. కాలుజారడంతో ఇద్దరూ నీటిలో పడిపోయారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/crime/a-hyderabadi-died-after-falling-into-a-waterfall-during-a/article-1655"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/screenshot-2024-06-11-124438.jpg" alt=""></a><br /><p>సరదాగా విహారయాత్రకు వెళ్లిన ఓ యువకుడు జలపాతంలో జారిపడి మృతిచెందాడు. ఈ ఘటన కర్ణాటకలోని హెబ్బె జలపాతం వద్ద జరిగింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌కు చెందిన శ్రావణ్ ప్రముఖ ఈ- కామర్స్ కంపెనీలో సిస్టం అనలిస్టుగా పనిచేస్తున్నాడు. స్నేహితులతో టూర్ ప్లాన్ చేసుకుని అద్దెబైక్‌పై కర్ణాటకలోని పర్యాటక కేంద్రాలను చుట్టివచ్చారు. </p>
<p>కెమ్మనగుండిలోని హెబ్బె జలపాతం చూసేందుకు వచ్చిన స్నేహితులు అక్కడ ఫొటోలు తీసుకుంటూ సరదాగా గడిపారు. అప్పటి వరకు బాగానే ఉన్నా..  ఇటీవలి వర్షాలకు జలపాతం వద్ద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో నీటి మధ్యలో ఉన్న రాళ్లపై శ్రవణ్, అతని స్నేహితుడు సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించారు. కాలుజారడంతో ఇద్దరూ నీటిలో పడిపోయారు.</p>
<p>నీళ్లలోని రాయి తగిలి శ్రవణ్ కు తీవ్ర గాయాలయ్యాయి. అక్కడున్న వారు ఈ స్నేహితులు ఇద్దరినీ ఒడ్డుకు చేర్చి పోలీసులకు సమాచారం అందించారు. అంబులెన్స్ తో వచ్చిన పోలీసులు వారిద్దరినీ వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే శ్రవణ్ మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో స్నేహితులు శ్రావణ్ కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. అందివచ్చిన కొడుకు మృతిచెందడంతో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Crime</category>
                                    

                <link>https://www.vishvambhara.com/crime/a-hyderabadi-died-after-falling-into-a-waterfall-during-a/article-1655</link>
                <guid>https://www.vishvambhara.com/crime/a-hyderabadi-died-after-falling-into-a-waterfall-during-a/article-1655</guid>
                <pubDate>Tue, 11 Jun 2024 12:46:05 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/screenshot-2024-06-11-124438.jpg"                         length="119659"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రభుత్వాన్ని కూల్చేందుకు చేతబడి : డీకే శివకుమార్</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><strong>విశ్వంభర, కర్ణాటక : </strong>కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి తనపై, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై చేతబడి చేస్తున్నారని ఆరోపించారు. కేరళలోని ఓ ఆలయంలో రాజకీయ ప్రత్యర్థులు ‘అఘోరాలు’, ‘తాంత్రికుల’ ద్వారా తాంత్రిక పూజలు చేస్తున్నారని పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన, కేరళలోని రాజరాజేశ్వరి ఆలయానికి సమీపంలోని ఏకాంత ప్రదేశంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జంతుబలితో కూడిన శత్రుభైరవి యాగం నిర్వహిస్తున్నట్లు తనకు విశ్వసనీయ సమాచారం ఉందని చెప్పారు.</p>
<p style="text-align:justify;"><br />ఈ పూజలో పాల్గొన్న వారు దీని గురించి మాకు చెప్పారు. ఎవరెవరు దానిలో పాల్గొన్నారో మాకు తెలుసు, ఈ యాగం కోసం 21 ఎర్ర మేకలు, మూడు గేదెలు, 21 నల్ల గొర్రెలు, ఐదు పందులను బలి ఇస్తున్నట్లు తెలిసింది. రాజ కంటక, మారణ మోహనా స్తంభన యాగాలు చేసేందుకు వారు ప్రత్యేకంగా తాంత్రికులతో పూజలు చేస్తున్నారు. ఈ యాగాలు ఎవరు చేస్తున్నారో</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/dk-sivakumar-uses-sorcery-to-bring-down-the-government/article-1073"><img src="https://www.vishvambhara.com/media/400/2024-05/992.jpg" alt=""></a><br /><p style="text-align:justify;"><strong>విశ్వంభర, కర్ణాటక : </strong>కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి తనపై, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై చేతబడి చేస్తున్నారని ఆరోపించారు. కేరళలోని ఓ ఆలయంలో రాజకీయ ప్రత్యర్థులు ‘అఘోరాలు’, ‘తాంత్రికుల’ ద్వారా తాంత్రిక పూజలు చేస్తున్నారని పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన, కేరళలోని రాజరాజేశ్వరి ఆలయానికి సమీపంలోని ఏకాంత ప్రదేశంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జంతుబలితో కూడిన శత్రుభైరవి యాగం నిర్వహిస్తున్నట్లు తనకు విశ్వసనీయ సమాచారం ఉందని చెప్పారు.</p>
<p style="text-align:justify;"><br />ఈ పూజలో పాల్గొన్న వారు దీని గురించి మాకు చెప్పారు. ఎవరెవరు దానిలో పాల్గొన్నారో మాకు తెలుసు, ఈ యాగం కోసం 21 ఎర్ర మేకలు, మూడు గేదెలు, 21 నల్ల గొర్రెలు, ఐదు పందులను బలి ఇస్తున్నట్లు తెలిసింది. రాజ కంటక, మారణ మోహనా స్తంభన యాగాలు చేసేందుకు వారు ప్రత్యేకంగా తాంత్రికులతో పూజలు చేస్తున్నారు. ఈ యాగాలు ఎవరు చేస్తున్నారో కూడా మాకు తెలుసు, వారు ఇందులో నిష్ణాతులు, వారు చేయాలనుకున్నది చేయనివ్వండి, వాళ్ళు చేతబడి పూజలు చేసిన మేము నమ్మే శక్తి మమ్మల్ని రక్షిస్తుంది. నిమ్మకాయ నిపుణులకు భయపడనని, తాను నమ్మినబంటునని, ప్రజల ఆశీస్సులే తనను, సిద్ధరామయ్యను కాపాడతాయని శివకుమార్ అన్నారు.</p>
<p style="text-align:justify;"><br />విలేకరుల సమావేశంలో బీజేపీ లేదా జేడీఎస్ నాయకులు ఈ పూజలు చేస్తున్నారా అని ప్రశ్నించినప్పుడు కర్ణాటకకు చెందిన రాజకీయ నాయకులే దీనికి కారణమని అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన జూన్ 2న బెంగళూరులో శాసన సభ్యుల సమావేశం ఉంటుందని ప్రకటించారు. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలందరినీ దీనికి ఆహ్వానించినట్లు చెప్పారు. ఈ సమావేశంలో పార్టీ వ్యవహారాలు, ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చించనున్నట్లు తెలిపారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.vishvambhara.com/dk-sivakumar-uses-sorcery-to-bring-down-the-government/article-1073</link>
                <guid>https://www.vishvambhara.com/dk-sivakumar-uses-sorcery-to-bring-down-the-government/article-1073</guid>
                <pubDate>Fri, 31 May 2024 14:25:38 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-05/992.jpg"                         length="13174"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        