<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/vishvambhara.com/tag-1183" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>vishvambhara.com - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/1183/rss</link>
                <description>vishvambhara.com RSS Feed</description>
                
                            <item>
                <title>ఏపీ నుంచి కేంద్ర మంత్రులు వీరేనా..?</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. అటు కేంద్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. రెండు చోట్లా చంద్రబాబుకు తిరుగులేని పవర్ దక్కింది. అంటు కేంద్రంలో కూడా ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే చంద్రబాబు దయతలిచే పరిస్థితి వచ్చింది. అందుకే ఇప్పుడు ఏపీ నుంచి కేంద్రమంత్రులు ఎక్కువగా ఉండే అవకాశం ఉందంటున్నారు.</p>
<p style="text-align:justify;">ఈ సారి ఏపీ కోటాలో టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు ఇంకొందరు కూడా పోటీలో ఉన్నారు. చంద్రబాబు కనీసం నాలుగు కేంద్రమంత్రి పదవులు ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. అటు జనసేనలో ఇద్దరు ఉన్నారు కాబట్టి.. ఒకరికి అయినా ఇస్తారని అంటున్నారు. ఆ ఛాన్స్ వస్తే జనసేనలో సీనియర్ అయిన మచిలీపట్నం ఎంపీ బాలశౌరికి అదృష్టం వరిస్తుంది. </p>
<p style="text-align:justify;">ఇక ఏపీ నుంచి బీజేపీ తరఫున పురందేశ్వరి పేరు కచ్చితంగా ఉంటుంది. ఆమెతో పాటు సీఎం రమేష్, శ్రీనివాసవర్మల పేర్లు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/these-are-the-union-ministers-from-ap/article-1350"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/12.jpg" alt=""></a><br /><p style="text-align:justify;">ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. అటు కేంద్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. రెండు చోట్లా చంద్రబాబుకు తిరుగులేని పవర్ దక్కింది. అంటు కేంద్రంలో కూడా ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే చంద్రబాబు దయతలిచే పరిస్థితి వచ్చింది. అందుకే ఇప్పుడు ఏపీ నుంచి కేంద్రమంత్రులు ఎక్కువగా ఉండే అవకాశం ఉందంటున్నారు.</p>
<p style="text-align:justify;">ఈ సారి ఏపీ కోటాలో టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు ఇంకొందరు కూడా పోటీలో ఉన్నారు. చంద్రబాబు కనీసం నాలుగు కేంద్రమంత్రి పదవులు ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. అటు జనసేనలో ఇద్దరు ఉన్నారు కాబట్టి.. ఒకరికి అయినా ఇస్తారని అంటున్నారు. ఆ ఛాన్స్ వస్తే జనసేనలో సీనియర్ అయిన మచిలీపట్నం ఎంపీ బాలశౌరికి అదృష్టం వరిస్తుంది. </p>
<p style="text-align:justify;">ఇక ఏపీ నుంచి బీజేపీ తరఫున పురందేశ్వరి పేరు కచ్చితంగా ఉంటుంది. ఆమెతో పాటు సీఎం రమేష్, శ్రీనివాసవర్మల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఏపీ కోటాలో టీడీపీకే ఎక్కువ ప్రాధాన్యత దక్కే అవకాశం ఉండటంతో.. ఏపీ బీజేపీ కోటాలో పురంధేశ్వరికి మాత్రమే కేంద్రమంత్రి పదవి వరిస్తుందని తెలుస్తోంది. </p>
<p style="text-align:justify;">ఆమెకు మోడీ దగ్గర మంచి పట్టు ఉంది కాబట్టి.. ఆమె రికమండేషన్ తో సీఎం రమేశ్ కు కూడా మంత్రి పదవి వచ్చేఛాన్స్ ఉందంటున్నారు. కాకపోతే ఏపీలో బీజేపీని రాబోయే రోజుల్లో విస్తరించాలని కేంద్రం భావిస్తే గనక.. ఎక్కువ పదవులు కేటాయించే అవకాశం కూడా లేకపోలేదు. చూడాలి మరి ఎవరికి పదవులు వరిస్తాయో.</p>
<p style="text-align:justify;"> </p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/these-are-the-union-ministers-from-ap/article-1350</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/these-are-the-union-ministers-from-ap/article-1350</guid>
                <pubDate>Thu, 06 Jun 2024 17:57:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/12.jpg"                         length="65952"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వైఎస్ జగన్ సంచలన ట్వీట్ </title>
                                    <description><![CDATA[<p>రెండు రోజులుగా ప్రభుత్వ కార్యాలయాల్లో టీడీపీ శ్రేణులు విగ్రహాలు, శిలాఫలకాలు ధ్వంసం చేస్తూ వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడులకు పాల్పడుతున్నారు. వాహనాలను ధ్వంసం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన ట్వీట్ చేశారు. </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/ys-jagan-sensational-tweet%C2%A0/article-1326"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/jagan1.jpg" alt=""></a><br /><p>ఏపీలో ఎన్నికల ఫలితాల తర్వాత అక్కడక్కడా విధ్వంసకర పరిస్థితులు నెలకొన్నాయి.  రెండు రోజులుగా ప్రభుత్వ కార్యాలయాల్లో టీడీపీ శ్రేణులు విగ్రహాలు, శిలాఫలకాలు ధ్వంసం చేస్తూ వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడులకు పాల్పడుతున్నారు. వాహనాలను ధ్వంసం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన ట్వీట్ చేశారు. </p>
<p>టీడీపీ నేతల దాడులతో ఏపీలో భయానక వాతావరణం నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా ఆయన ఈ విధంగా ట్వీట్ చేశారు. ‘రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొంది. ప్రభుత్వం ఏర్పాటుకాకముందే టీడీపీ ముఠాలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల్లాంటి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. వైయస్సార్‌సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయింది. అధికారపార్టీ ఒత్తిళ్లతో పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారిపోయింది. వెరసి ఐదేళ్లుగా పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి.’ అని పేర్కొన్నారు. </p>
<p>అదేవిధంగా గౌరవ గవర్నర్‌ గారు వెంటనే జోక్యం చేసుకుని పచ్చమూకల అరాచకాలను అడ్డుకోవాలని విన్నవించారు. ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు, ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా నిలవాలని విజ్ఞప్తిచేస్తున్నామని పేర్కొన్నారు. టీడీపీ దాడుల కారణంగా నష్టపోయిన ప్రతి కార్యకర్తకూ, సోషల్‌ మీడియా సైనికులకు తోడుగా ఉంటామని జగన్ భరోసా ఇచ్చారు.</p>
<div class="div_border" contenteditable="false">
<blockquote class="twitter-tweet">
<p dir="ltr" lang="te" xml:lang="te">రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొంది. ప్రభుత్వం ఏర్పాటుకాకముందే టీడీపీ ముఠాలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల్లాంటి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. వైయస్సార్‌సీపీకి చెందిన నాయకులు,…</p>
— YS Jagan Mohan Reddy (@ysjagan) <a href="https://twitter.com/ysjagan/status/1798624761561616749?ref_src=twsrc%5Etfw">June 6, 2024</a></blockquote>

</div>
<p>

</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/ys-jagan-sensational-tweet%C2%A0/article-1326</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/ys-jagan-sensational-tweet%C2%A0/article-1326</guid>
                <pubDate>Thu, 06 Jun 2024 14:14:17 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/jagan1.jpg"                         length="41247"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>‘థాంక్యూ అమ్మా..’ ఎన్టీఆర్ ట్వీట్‌కు బాబు స్పందన</title>
                                    <description><![CDATA[<p>ఏపీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఘ‌న విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఎక్స్ వేదికగా బుధవారం శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా తారక్ ట్వీట్‌కు చంద్రబాబు నాయుడు స్పందించారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/babus-response-to-ntrs-tweet-thank-you-mom/article-1301"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/screenshot-2024-06-06-093712.jpg" alt=""></a><br /><p>ఏపీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఘ‌న విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఎక్స్ వేదికగా బుధవారం శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా తారక్ ట్వీట్‌కు చంద్రబాబు నాయుడు స్పందించారు. 'థాంక్యూ వెరీ మ‌చ్ అమ్మ' అంటూ జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు బ‌దులిచ్చారు. అదేవిధంగా త‌న‌కు శుభాకాంక్ష‌లు తెలిపిన రామ్‌చ‌ర‌ణ్‌, మ‌హేశ్‌బాబు, ఇత‌ర రాజకీయ‌, సినీ ప్ర‌ముఖుల‌కు సైతం ఆయ‌న ధ‌న్య‌వాదాలు తెలిపారు చంద్రబాబు. </p>
<p>ఎన్టీఆర్ బుధవారం తన ట్వీట్‌లో "ప్రియమైన చంద్రబాబు మామయ్యకి.. ఈ చారిత్రాత్మక విజయాన్ని సాధించినందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు సాధించిన ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు నడిపిస్తుందని ఆశిస్తున్నాను. అద్భుతమైన మెజారిటీతో గెలిచిన నారా లోకేశ్ కి, మూడోసారి విజయం సాధించిన బాలకృష్ణ బాబాయికి, ఎంపీలుగా గెలిచిన పురందేశ్వరి అత్తకి, మతుకుమిల్లి శ్రీభరత్‌కు నా శుభాకాంక్షలు" ని పేర్కొన్నాడు. </p>
<p>ఇక ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి సునామీ సృష్టించిన విష‌యం తెలిసిందే. కూటమికి 164 అసెంబ్లీ స్థానాలు రాగా, అందులో టీడీపీ సొంతంగా 135 స్థానాల్లో విజయాన్ని సొంతం చేసుకుంది. అదేవిధంగా 16 ఎంపీ స్థానాలను కూడా టీడీపీ వశమయ్యాయి. దీంతో వైసీపీ 11 అసెంబ్లీ, 4 ఎంపీ స్థానాల‌కే ప‌రిమిత‌మైంది. అటు జనసేన, బీజేపీ కూడా దూకుడు ప్రదర్శించాయి. జనసేన పోటీ చేసిన‌ 21 అసెంబ్లీ స్థానాల్లోనూ విజ‌య‌ఢంకా మోగించడంతో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.</p>
<div class="div_border" contenteditable="false">
<blockquote class="twitter-tweet">
<p dir="ltr" lang="en" xml:lang="en">Thank you very much Amma! <a href="https://t.co/6BrFdbI3Ij">https://t.co/6BrFdbI3Ij</a></p>
— N Chandrababu Naidu (@ncbn) <a href="https://twitter.com/ncbn/status/1798433850324033880?ref_src=twsrc%5Etfw">June 5, 2024</a></blockquote>

</div>
<p>

</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/babus-response-to-ntrs-tweet-thank-you-mom/article-1301</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/babus-response-to-ntrs-tweet-thank-you-mom/article-1301</guid>
                <pubDate>Thu, 06 Jun 2024 09:41:18 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/screenshot-2024-06-06-093712.jpg"                         length="131188"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బర్డ్‌ ఫ్లూతో తొలి మరణం.. డబ్ల్యూహెచ్ఓ ధ్రువీకరణ</title>
                                    <description><![CDATA[<p>కొన్ని రోజులుగా ప్రపంచాన్ని కలవరపెడుతున్న బర్డ్ ఫ్లూ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. సాధారణంగా పక్షులకు మాత్రమే పరిమితం కాలేదు. తాజాగా ప్రపంచంలో తొలి బర్డ్ ఫ్లూ మరణం సంభవించడం ఆందోళన కలిగిస్తోంది.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/international/who-confirms-first-bird-flu-death/article-1299"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/screenshot-2024-06-06-090303.jpg" alt=""></a><br /><p>కొన్ని రోజులుగా ప్రపంచాన్ని కలవరపెడుతున్న బర్డ్ ఫ్లూ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. సాధారణంగా పక్షులకు మాత్రమే పరిమితం కాలేదు. తాజాగా ప్రపంచంలో తొలి బర్డ్ ఫ్లూ మరణం సంభవించడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకూ ఈ వేరియంట్ మనుషులకు సోకడం దాదాపు అసాధ్యంగా భావించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) పేర్కొంది. అయితే బర్డ్ ఫ్లూ ఇప్పుడు పక్షులు, జంతువులతో పాటు మనుషులకూ వ్యాపిస్తోంది.</p>
<p>అంతేకాదు తాజాగా బర్డ్ ఫ్లూ కారణంగా ప్రపంచంలో తొలి మరణం సంభవించింది. మెక్సికో దేశంలో హెచ్5ఎన్2 బర్డ్ ఫ్లూ వేరియంట్ బారినపడిన 25ఏళ్ల ఓ వ్యక్తి ఇటీవల మరణించినట్లు డబ్ల్యూహెచ్‌వో ధ్రువీకరించింది. జ్వరం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు, విరేచనాలు, కడుపులో తిప్పడం తదితర సమస్యలతో బాధపడ్డ రోగి ఏప్రిల్ 24న కన్నుమూశాడు. బాధితుడు బర్డ్ ఫ్లూ బారిన పడిన విషయాన్ని మెక్సికో అధికారులు మే 23న ప్రపంచ ఆరోగ్య సంస్థకు సమాచారం అందించారు. </p>
<p>అయితే రోగికి వ్యాధి ఎలా సోకిందనే దానిపై సమాచారం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అయితే, మెక్సికోలోని కోళ్లల్లో  హెచ్5ఎన్2 ఇన్ఫెక్షన్లు వెలుగు చూసినట్లు పేర్కొంది. అయితే, కోళ్ల నుంచి మనిషికి ఈ వ్యాధి ఎలా వ్యాపించిందో నిర్ధారించడం కష్టంగా మారిందని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. మరోవైపు, అమెరికాలో బర్డ్ ఫ్లూకు చెందిన కొత్త వేరియంట్ వ్యాపిస్తోంది. అయితే, ఇది రోగుల నుంచి ఇతరులకు వ్యాపిస్తోందనేందుకు ఇంతవరకూ ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని అధికారులు పేర్కొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>International</category>
                                    

                <link>https://www.vishvambhara.com/international/who-confirms-first-bird-flu-death/article-1299</link>
                <guid>https://www.vishvambhara.com/international/who-confirms-first-bird-flu-death/article-1299</guid>
                <pubDate>Thu, 06 Jun 2024 09:05:08 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/screenshot-2024-06-06-090303.jpg"                         length="154785"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఎమ్మెల్సీ కౌంటింగ్‌లో దూసుకుపోతున్న తీన్మార్ మల్లన్న</title>
                                    <description><![CDATA[<p>నల్గొండ- ఖమ్మం - వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్న విజయం దిశగా దూసుకెళ్తున్నారు. ఇప్పటివరకు 1.92లక్షల మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/theinmar-mallanna-who-is-jumping-in-the-mlc-counting/article-1297"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/gptoboiawaa2gsv.jpg" alt=""></a><br /><p>నల్గొండ- ఖమ్మం - వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్న విజయం దిశగా దూసుకెళ్తున్నారు. ఇప్పటివరకు 1.92లక్షల మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. అందులోమల్లన్నకు 14 వేల ఓట్ల ఆధిక్యం లభించింది. ఇంకా లెక్కించాల్సిన మొదటి ప్రాధాన్యత ఓట్లే 1.44 లక్షలు ఉన్నాయి. అందులో చెల్లనిఓట్లు వేరుచేయాల్సి ఉంది.</p>
<p>ఇప్పటి వరకు మొదటి రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 36,210 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 28,540, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 11,395, స్వతంత్ర అభ్యర్థి అశోక్ పాలకూరికి 9,019 ఓట్లు పోల్ అయ్యాయి. ఇక రెండో రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థికి 34,575, బీఆర్ఎస్ అభ్యర్థికి 27,573, బీజేపీ అభ్యర్థికి 12,841, స్వతంత్ర అభ్యర్థికి 11,018ఓట్లు పోల్ అయ్యాయి. మొత్తంగా కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు ఇప్పటి వరకు 70,785 ఓట్లు పోల్ అయ్యాయి. </p>
<p>బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి మొత్తంగా 56,113 ఓట్లు పోల్ కాగా, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 24,236, స్వతంత్ర అభ్యర్థి అశోక్ పాలకూరికి 20,037 ఓట్లు పోల్ అయ్యాయి. వీరిలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఇప్పటి వరకు 14,672 మెజారిటీని సాధించారు. మొత్తం పోల్ అయిన ఓట్లు 3,36,013 కాగా ఒక్కో రౌండ్‌కు 96వేల ఓట్ల చొప్పున మొదటి ప్రాధాన్యత కోసం నాలుగు రౌండ్లలో ఓట్లు లెక్కిస్తున్నారు అధికారులు. </p>
<p>ఇప్పటి వరకు రెండు రౌండ్లు కలిపి లక్షా 92వేల ఓట్లు లెక్కింపును పూర్తి చేశారు. మరో రెండు రౌండ్లు మిగిలి ఉండగా ఇంకా లక్షా 44వేల ఓట్లు మిగిలి ఉన్నాయి. ఇవాళ(గురువారం) సాయంత్రం లోపు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యే అవకాశముంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తైన తర్వాత రెండో ప్రాధాన్యత కోసం 52మంది అభ్యర్థుల్లో ఒక్కొక్కరిని ఎలిమినేషన్ ప్రక్రియ మొదలవుతుంది.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/theinmar-mallanna-who-is-jumping-in-the-mlc-counting/article-1297</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/theinmar-mallanna-who-is-jumping-in-the-mlc-counting/article-1297</guid>
                <pubDate>Thu, 06 Jun 2024 08:20:34 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/gptoboiawaa2gsv.jpg"                         length="17566"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం తేదీ మార్పు</title>
                                    <description><![CDATA[<p>అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎంగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఈనెల 9వ తేదీన నిర్ణయించిన విషయం తెలిసిందే.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/change-in-the-date-of-chandrababus-swearing-in-as-cm/article-1295"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/kv7ltkf_chandrababu-naidu_625x300_04_june_24.jpg" alt=""></a><br /><p>అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎంగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఈనెల 9వ తేదీన నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే, తాజా సమాచారం ప్రకారం ఆ తేదీలో మార్పు చేసినట్లు తెలుస్తోంది. ఈనెల 9వ తేదీన ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం ఉండటంతో చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఈనెల 12వ తేదీన చేయించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. </p>
<p>చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ముందుగానే రెండు తేదీల్లో పండితులు మంచి ముహూర్తాలు చూశారు. అందుకే ప్రమాణ స్వీకారంలో మార్పు చేసుకోవడానికి ఏ ఇబ్బందీ రాలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదేవిధంగా ప్రమాణస్వీకారం చేసే ప్రాంతంపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లను ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీనుకు అప్పగించినట్లు తెలుస్తోంది. బోయపాటి చంద్రబాబుతో పాటు, బాలయ్యకు అత్యంత సన్నిహితడనే విషయం తెలిసిందే.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/change-in-the-date-of-chandrababus-swearing-in-as-cm/article-1295</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/change-in-the-date-of-chandrababus-swearing-in-as-cm/article-1295</guid>
                <pubDate>Thu, 06 Jun 2024 07:57:26 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/kv7ltkf_chandrababu-naidu_625x300_04_june_24.jpg"                         length="220225"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>హిమాలయాల్లో ట్రెక్కింగ్ చేస్తూ 9 మంది మృతి</title>
                                    <description><![CDATA[<p>హిమాలయ పర్వతాల్లో విన్యాసాలు చేస్తుండగా విషాదం మిగిలింది. ట్రెక్కింగ్ చేస్తూ తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. సహస్రతల్ ప్రాంతంలో వాతావరణం అనుకూలించకపోవడంతో ఈ విషాదం నెలకొన్నట్లు తెలుస్తోంది.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/crime/9-people-died-while-trekking-in-himalayas/article-1293"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/1200-675-21643998-thumbnail-16x9-uttarakhand-trek-accident.jpg" alt=""></a><br /><p>హిమాలయ పర్వతాల్లో విన్యాసాలు చేస్తుండగా విషాదం మిగిలింది. ట్రెక్కింగ్ చేస్తూ తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. సహస్రతల్ ప్రాంతంలో వాతావరణం అనుకూలించకపోవడంతో ఈ విషాదం నెలకొన్నట్లు తెలుస్తోంది. మరికొంత మంది మంచులో చిక్కుకుపోయారు. అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. </p>
<p>కర్ణాటకకు చెందిన 18మంది ట్రెక్కర్లు ముగ్గురు స్థానిక గైడ్‌లు, మహారాష్ట్రకు చెందిన ఒకరు హిమాలయాల్లో టెక్కింగ్ చేస్తున్నారు. సుమారు 4,100-4400 మీటర్ల ఎత్తులో ఉన్న సహస్రతల్ ఆల్పైన్ సరస్సు వద్ద వారు ఈ విన్యాసం చేస్తున్నారు. అయితే ఉన్నట్టుండి వారు మంచులో చిక్కుకుపోయారు. వారిలో తొమ్మిది మంది మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. మరో తొమ్మిది మంది ఆచూకీ లభ్యం కాలేదని తెలిపారు. </p>
<p>అటవీశాఖకు చెందిన పది మంది సభ్యుల రెస్క్యూ టీమ్, ఎస్‌డీఆర్ఎఫ్ బృందం బుధవారం తెల్లవారుజామున ఉత్తరకాశీ నుంచి బయల్దేరాయన్నారు. ఉత్తరకాశీ జిల్లా ఆస్పత్రి, భట్వాడీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అప్రమత్తం చేసినట్లు తెలిపారు. 14మంది రక్షణ సిబ్బంది, ఓ వైద్యుడిని ఘటనాస్థలానికి పంపామని చెప్పారు. క్షతగాత్రులను వెంటనే తరలించడానికి హెలికాప్టర్, అంబులెన్స్‌లను సిద్ధం చేశామన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>Crime</category>
                                    

                <link>https://www.vishvambhara.com/crime/9-people-died-while-trekking-in-himalayas/article-1293</link>
                <guid>https://www.vishvambhara.com/crime/9-people-died-while-trekking-in-himalayas/article-1293</guid>
                <pubDate>Thu, 06 Jun 2024 07:41:26 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/1200-675-21643998-thumbnail-16x9-uttarakhand-trek-accident.jpg"                         length="64818"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>చంద్రబాబుకు ఎన్టీఆర్, చరణ్, సినీ ప్రముఖుల శుభాకాంక్షలు</title>
                                    <description><![CDATA[<p>ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి తిరుగులేని విజయాన్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లకు సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/ntr-charan-film-celebrities-wish-chandrababu/article-1291"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/chandrababu-2.jpg" alt=""></a><br /><p>ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి తిరుగులేని విజయాన్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లకు సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా కూటమి విజయంపై పాన్ ఇండియా స్టార్, టాలీవుడ్ యంగ్ హీరో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పందించారు. </p>
<p>ఎక్స్ వేదికగా ఈ విధంగా ట్వీట్ చేశారు. ‘ప్రియమైన చంద్రబాబు మావయ్యకి ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించిందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు.. మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపున నడిపిస్తుందని ఆశిస్తున్నా. అద్భుతమైన మెజారిటీతో గెలిచిన నారా లోకేశ్‌కు, మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయికి, ఎంపీలుగా గెలిచిన శ్రీభరత్, పురందేశ్వరి అత్తకి నా శుభాకాంక్షలు’ అని ట్వీట్‌లో పేర్కొన్నాడు. </p>
<p>అదేవిధంగా మరో ట్వీట్‌లో ‘జనసేన అధినేత పవన్ కల్యాణ్ గారికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు’ అంటూ రాసుకొచ్చాడు. ఎన్టీఆర్‌తో పాటు చంద్రబాబుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శుభాకాంక్షలు తెలిపాడు. ‘దార్శనికుడు చంద్రబాబుకు శుభాకాంక్షలు. అద్భుతమైన విజయం సాధించారు’ అంటూ రాసుకొచ్చాడు. అదేవిధంగా టాలీవుడ్ ప్రముఖ రచయిత పరుచూరి గోపాల కృష్ణ చంద్రబాబు గెలుపు పట్ల స్పందిస్తూ ‘ ఏపీ ఎన్నికల్లో విజయం సాధించిన కూటమి సభ్యులందరికీ విజయాభినందనలు. చంద్రబాబు, పురందేశ్వరి, పవన్ కల్యాణ్‌లకు ప్రత్యేక అభినందనలు అంటూ పేర్కొన్నారు. </p>
<p>అదేవిధంగా టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున స్పందిస్తూ.. ‘ ప్రధాని మోడీ నాయకత్వంలో ఎన్డీయే కూటమికి, ఏపీలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు శుభాకాంక్షలు. ఆ దేవుడి ఆశీస్సులు మీపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా.’ అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. అదేవిధంగా గాయని స్మిత.. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరితో దిగిన ఫొటోను షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలిపింది.</p>
<div class="div_border" contenteditable="false">
<blockquote class="twitter-tweet">
<p dir="ltr" lang="te" xml:lang="te">ప్రియమైన <a href="https://twitter.com/ncbn?ref_src=twsrc%5Etfw">@ncbn</a> మావయ్యకి ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించిందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు… మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపున నడిపిస్తుందని ఆశిస్తున్నాను.<br /><br />అద్భుతమైన మెజారిటీతో గెలిచిన <a href="https://twitter.com/naralokesh?ref_src=twsrc%5Etfw">@naralokesh</a> కి, మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయికి, MPలుగా…</p>
— Jr NTR (@tarak9999) <a href="https://twitter.com/tarak9999/status/1798287485879140762?ref_src=twsrc%5Etfw">June 5, 2024</a></blockquote>

</div>
<p>

</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Movies</category>
                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/ntr-charan-film-celebrities-wish-chandrababu/article-1291</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/ntr-charan-film-celebrities-wish-chandrababu/article-1291</guid>
                <pubDate>Wed, 05 Jun 2024 15:58:12 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/chandrababu-2.jpg"                         length="33367"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>‘బీజేపీ కోసమే బీఆర్ఎస్ బలిదానం..’ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు </title>
                                    <description><![CDATA[<p>తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని బీఆర్ఎస్ ఆత్మ బలిదానం చేసుకుందని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/cm-revanth-reddys-sensational-comments-of-brs-martyrdom-for-bjp%C2%A0/article-1289"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/screenshot-2024-06-05-153218.jpg" alt=""></a><br /><p>తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని బీఆర్ఎస్ ఆత్మ బలిదానం చేసుకుందని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇవాళ(బుధవారం) మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బీజేపీ గెలిచిన ఎనిమిది స్థానాల్లో ఏడింటికి బీఆర్ఎస్‌కు డిపాజిట్లు కూడా దక్కలేదన్నారు. ఈ విషయాన్ని తాను మొదటి నుంచీ ఈ విషయాన్ని చెబుతూనే ఉన్నానని తెలిపారు. సిద్దిపేటలో హరీశ్ రావు తమ పార్టీ ఓట్లను రఘునందన్ రావుకు వేయించారని దుయ్యబట్టారు.</p>
<p>తమ ప్రభుత్వంపై కేసీఆర్ కుట్రలు ఎప్పటికీ ఆగవని రేవంత్ వ్యాఖ్యానించారు. ఆయన ఓ రాజకీయ జూదగాడు అంటూ సెటైర్ వేశారు. అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్‌తో కలిసి మోడీ తమ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని చూస్తే మహారాష్ట్ర ఫలితాలే వస్తాయని హెచ్చరించారు. అక్కడ మహా కూటమి ప్రభుత్వాన్ని కూల్చితే మోడీ తలెత్తుకోలేని ఫలితాలను ప్రజలు ఇచ్చారని వెల్లడించారు. మోడీని దేశ ప్రజలు తిరస్కరించారని, ఒక్క వ్యక్తి పేరుతో ‘మోడీ గ్యారంటీ’ అనిచెప్పడం వల్లే బీజేపీకి మెజార్టీ రాలేదని స్పష్టం చేశారు. </p>
<p>అందుకే ఎన్డీయే కూటమిలోని మరో వ్యక్తిని ప్రధాని చేయాలని బీజేపీకి సూచించారని రేవంత్ రెడ్డి అన్నారు. వెంటనే మోదీని తన పదవికి రాజీనామా చేయాలని ఎన్డీయే నేతలు కోరాలన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు బూడిదే మిగిలిందని, కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని కుట్ర చేస్తే బీఆర్ఎస్ కాలగర్భంలో కలిసిపోతుందని హెచ్చరించారు. అదేవిధంగా ఏపీ ఫలితాలపై రేవంత్ స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన తీర్పును చంద్రబాబు, జగన్ స్వాగతించారని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ఆహ్వానిస్తే తప్పకుండా వెళ్తాన‌ని అన్నారు. ఏపీలో ఏ ప్రభుత్వం వచ్చినా సామరస్యంగానే రాష్ట్ర సమస్యలు పరిష్కరించుకుంటామని గుర్తుచేశారు.</p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/cm-revanth-reddys-sensational-comments-of-brs-martyrdom-for-bjp%C2%A0/article-1289</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/cm-revanth-reddys-sensational-comments-of-brs-martyrdom-for-bjp%C2%A0/article-1289</guid>
                <pubDate>Wed, 05 Jun 2024 15:37:20 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/screenshot-2024-06-05-153218.jpg"                         length="130228"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రధాని రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి</title>
                                    <description><![CDATA[<p>ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు.. ఈ సందర్భంగా తన రాజీనామా లేఖను రాష్ట్రపతికి అందజేయగా రాష్ట్రపతి ఆ రాజీనామాను ఆమోదించారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/national/the-president-accepted-the-prime-ministers-resignation/article-1287"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/1200-675-21642262-932-21642262-1717578072297.jpg" alt=""></a><br /><p>ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తన రాజీనామా లేఖను రాష్ట్రపతికి అందజేశారు. రాష్ట్రపతి ఆ రాజీనామాను ఆమోదించారు. తదుపరి మంత్రివర్గం ఏర్పడే వరకు మోడీని ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగాలని కోరారు.  </p>
<p>17వ లోక్‌సభను రద్దు చేయాలని సిఫార్సు చేశారు. 18వ లోక్‌సభకు సార్వత్రిక ఎన్నికలు మార్చి మధ్య నుంచి జూన్ మొదటి వారం వరకు జరిగాయి.  జూన్ 5, మంగళవారం ఓట్ల లెక్కింపు జరిగింది. ప్రధాని మోదీ నేతృత్వంలో బీజేపీ 340 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే. </p>
<p>అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ (టీడీపీ), జనతాదళ్ (యునైటెడ్), శివసేన, లోక్ జనషాకీ పార్టీ (రామ్ విలాస్), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీతో సహా దాని మిత్రపక్షాల మద్దతు అవసరముంది. చారిత్రాత్మక విజయం తర్వాత బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి పీఎం మోడీ మాట్లాడుతూ.. ఎన్డీఏ వరుసగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పారు.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                    

                <link>https://www.vishvambhara.com/national/the-president-accepted-the-prime-ministers-resignation/article-1287</link>
                <guid>https://www.vishvambhara.com/national/the-president-accepted-the-prime-ministers-resignation/article-1287</guid>
                <pubDate>Wed, 05 Jun 2024 14:46:10 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/1200-675-21642262-932-21642262-1717578072297.jpg"                         length="89067"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>‘బలగం’ మొగిలయ్యకు తీవ్ర అస్వస్థత </title>
                                    <description><![CDATA[<p>జబర్దస్త్ ఫేమ్ వేణు దర్శకత్వంలో వ‌చ్చిన బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం ‘బ‌లగం’. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను విశేషంగా అలరించింది.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/movies/balagam-mogilaya-is-seriously-ill%C2%A0/article-1285"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/screenshot-2024-06-05-143257.jpg" alt=""></a><br /><p>జబర్దస్త్ ఫేమ్ వేణు దర్శకత్వంలో వ‌చ్చిన బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం ‘బ‌లగం’. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను విశేషంగా అలరించింది. అయితే ఈ సినిమాలో క్లైమాక్స్ పాట అంద‌రినీ ఏడిపించిన విష‌యం తెలిసిందే. బుడ‌గ‌జంగాల క‌ళాకారులు ప‌స్తం మొగిల‌య్య దంప‌తులు పాడిన ఈ పాట తెలంగాణ ప్ర‌జ‌ల‌ను కన్నీళ్లు పెట్టించింది. అయితే ప్రస్తుతం మొగిలయ్య ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. </p>
<p>ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు ఆయనను వరంగల్‌లోని సంరక్ష సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేర్పించారు. మొగిలయ్య కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఇక మొగిలయ్య ప్రాణాలను కాపాడాల‌ని, త‌మ‌ని ఆదుకోవాల‌ని ఆయ‌న‌ భార్య కొముర‌మ్మ ప్ర‌భుత్వాన్ని వేడుకుంది. ఇదివరకే మొగిలయ్య అనారోగ్యానికి గురి కాగా మెగాస్టార్ చిరంజీవి సాయమందించారు. బీఆర్ఎస్ ప్ర‌భుత్వ హయాంలో ఆదుకుంటామని హామీ ఇచ్చింది. అయితే ఇప్పుడు రేవంత్ ప్రభుత్వంలో మొగిలయ్యను ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ తరుణంలోనే తమ కుటుంబాన్ని ఆదుకోవాలని బలగం మొగిలయ్య భార్య కోరింది. ఎవరైనా సాయం చేయాలని వేడుకుంది.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Movies</category>
                                    

                <link>https://www.vishvambhara.com/movies/balagam-mogilaya-is-seriously-ill%C2%A0/article-1285</link>
                <guid>https://www.vishvambhara.com/movies/balagam-mogilaya-is-seriously-ill%C2%A0/article-1285</guid>
                <pubDate>Wed, 05 Jun 2024 14:36:43 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/screenshot-2024-06-05-143257.jpg"                         length="78482"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మూడోసారి ప్రధానమంత్రిగా మోదీ.. ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు</title>
                                    <description><![CDATA[<p>సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ  హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. కేంద్రంలో బీజేపీ మళ్లీ కొలువుదీరనుంది. నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/national/the-time-has-come-for-modi-to-take-oath-as/article-1283"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/screenshot-2024-06-05-141309.jpg" alt=""></a><br /><p>సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ  హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. కేంద్రంలో బీజేపీ మళ్లీ కొలువుదీరనుంది. నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టడానికి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. జూన్ 8వ తేదీన ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సమాచారం. </p>
<p>ఎన్నికల్లో బీజేపీ 240 సీట్లతో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 99 స్థానాలతో కాంగ్రెస్ రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది. మొత్తంగా ఎన్డీయే కూటమికి 293 స్థానాలు, ఇండియా కూటమికి 233 సీట్లు దక్కాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ మార్క్ 272ను ఎన్డీయే దాటడంతో ప్రభుత్వ ఏర్పాటుకు సన్నద్ధమవుతోంది.</p>
<p>మంగళవారం వెలువడిన ఫలితాల్లో ఎన్డీయే కూటమి స్పష్టమైన ఆధిక్యం రావడంతో ప్రభుత్వ ఏర్పాటుకు కార్యచరణ మొదలుపెట్టింది. ఇప్పటికే ప్రధాని మోడీ నివాసంలో కేంద్ర కేబినెట్ చివరిసారిగా భేటీ అయింది. ప్రస్తుత లోక్ సభ రద్దుకు సిఫార్సు చేసింది. బుధవారం సాయంత్రం 4గంటలకు ఎన్డీయే భాగస్వామ్య పక్షనేతలు కీలక సమావేశం జరగనుంది.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                    

                <link>https://www.vishvambhara.com/national/the-time-has-come-for-modi-to-take-oath-as/article-1283</link>
                <guid>https://www.vishvambhara.com/national/the-time-has-come-for-modi-to-take-oath-as/article-1283</guid>
                <pubDate>Wed, 05 Jun 2024 14:15:22 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/screenshot-2024-06-05-141309.jpg"                         length="74818"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        