<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/cbn/tag-1169" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>cbn - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/1169/rss</link>
                <description>cbn RSS Feed</description>
                
                            <item>
                <title>టీడీపీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..?</title>
                                    <description><![CDATA[<p>* చంద్రబాబుతో ఇద్దరు ఎమ్మెల్యేలు భేటీ<br />* మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే సైతం హాజరు<br />* త్వరలో సైకిల్ ఎక్కుతారని ప్రచారం<br />* మర్యాద పూర్వకంగా కలిశామంటున్న ఎమ్మెల్యేలు</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/brs-mlas-into-tdp/article-2638"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/new-project.jpg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, జూబ్లీహిల్స్  :</strong> తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలన సంఘటన జరిగింది. ఇన్ని రోజులు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌ పార్టీలోకి జంప్ అవుతున్న నేతలు ఇప్పుడు ఒక్కసారిగా రూట్ మార్చినట్లు తెలుస్తోంది.ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లో అడుగు పెట్టడం.. సీఎం రేవంత్ రెడ్డితో చర్చలు చేపట్టడం తెలిసిందే. ఈ క్రమంలో చంద్రబాబు ఆదివారం ఎన్టీఆర్ భవన్‌కు వెళ్లి టీడీపీ శ్రేణులతో మీటింగ్ పెట్టారు. తెలంగాణలో తెలుగు దేశం పార్టీకి పూర్వవైభవం తెస్తానని ఈ సందర్భంగా ప్రకటించారు. పార్టీ నుంచి నాయకులు మాత్రమే బయటకు వెళ్లారని.. కేడర్ బలంగా ఉందని తెలిపారు. చంద్రబాబు ఈ కామెంట్స్ చేసిన గంటల వ్యవధిలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు చంద్రబాబుతో భేటీ కావడం సంచలనంగా మారింది. ఆదివారం రాత్రి జూబ్లీహిల్స్ లోని చంద్రబాబు ఇంటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అరెకపూడి గాంధీ, ప్రకాశ్ గౌడ్, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు వెళ్లి కలిసి రావడం రాష్ట్ర రాజకీయ వర్గాలను షాక్‌కు గురి చేశాయి.  అయితే చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు చెప్పామని ఎమ్మెల్యేలు చెబుతున్నప్పటికీ.. వీరంతా సైకిల్ ఎక్కేందుకే రెడీ అయ్యారని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే ఈ నేతల పేర్లు పార్టీ మారతారనే వారి జాబితాలో ఉన్నాయి. ఇలాంటి సమయంలో టీడీపీ అధినేతను కలవడం పలు అనుమానాలకు తావిస్తోంది.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/brs-mlas-into-tdp/article-2638</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/brs-mlas-into-tdp/article-2638</guid>
                <pubDate>Mon, 08 Jul 2024 10:27:19 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/new-project.jpg"                         length="96660"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Admin (vishwambhara)]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఏపీ కొత్త సీఎస్‌గా నీరభ్ కుమార్?</title>
                                    <description><![CDATA[<p>ఏపీలో ప్రభుత్వం మారడంతో గత ప్రభుత్వంలో కీలకంగా పని చేసిన అధికారుల్లో టెన్షన్ మొదలైంది. తాజా  సమాచారం ప్రకారం కొత్త సీఎస్‌గా 1987 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ నీరబ్ కుమార్‌ ప్రసాద్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు నియమించాలనుకుంటున్నారని తెలుస్తోంది. </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/-draft--add-your-title/article-1378"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/424004378_42959.jpg" alt=""></a><br /><p>ఏపీలో ప్రభుత్వం మారడంతో గత ప్రభుత్వంలో కీలకంగా పని చేసిన అధికారుల్లో టెన్షన్ మొదలైంది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే ఆయన గురువారం చంద్రబాబుతో భేటీ అయి వ్యక్తిగత కారణాలతో సెలవుపై వెళుతున్నట్లు కాబోయే ముఖ్యమంత్రికి ఆయన తెలిపినట్లు సమాచారం. ఇదే నెలతో ప్రస్తుత సీఎస్‌ జవహర్‌రెడ్డి పదవీ కాలం కూడా ముగియనుంది. </p>
<p>ఈ నెలాఖరు వరకు ఆయన పదవీ విరమణ చేయనున్నారు. అయితే ఇప్పుడు సీఎస్ సెలవు మీద వెళ్ళగానే కొత్త సీఎస్‌ను నియమించే అవకాశం ఉండగా ఆయన స్థానంలో ఇంతకు ముందు కె. విజయానంద్‌ను నియమిస్తారని కథనాలు వచ్చాయి. కానీ ప్రస్తుతం తెలుస్తున్న సమాచారాన్ని బట్టి కొత్త సీఎస్‌గా 1987 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ నీరబ్ కుమార్‌ ప్రసాద్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు నియమించాలనుకుంటున్నారని తెలుస్తోంది. </p>
<p>ఆయన గతంలో చంద్రబాబు హయాంలో కీలక శాఖలకు ముఖ్య కార్యదర్శిగా పని చేశారు. ప్రస్తుతం అటవీ, పర్యావరణ,సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈయన తర్వాత అనంతరాములు, శ్రీలక్ష్మి, గోపాలకృష్ణ ద్వివేది, రజత్ భార్గవ్‌ల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అయినప్పటికీ నీరబ్ కుమార్ వైపే చంద్రబాబు మొగ్గు చూపిస్తున్నట్లు సమాచారం. అయితే, దీనికి సంబంధించి అధికారికంగా ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉన్నట్లు స్పష్టమవుతోంది.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/-draft--add-your-title/article-1378</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/-draft--add-your-title/article-1378</guid>
                <pubDate>Fri, 07 Jun 2024 09:56:32 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/424004378_42959.jpg"                         length="19239"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>జూన్ 12న స్కూళ్లకు సెలవు?</title>
                                    <description><![CDATA[<p>ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణుల్లో సంబురాలు అంబరాన్నంటాయి. గురువారం ఢిల్లీ వెళ్లి బీజేపీ అధినేతలతో చర్చలు జరిపిన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు పదవుల సర్దుబాటుపై చర్చించారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/june-12-is-a-holiday-for-schools/article-1368"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/slider6.jpg" alt=""></a><br /><p>ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణుల్లో సంబురాలు అంబరాన్నంటాయి. గురువారం ఢిల్లీ వెళ్లి బీజేపీ అధినేతలతో చర్చలు జరిపిన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు పదవుల సర్దుబాటుపై చర్చించారు. అనంతరం స్వరాష్ట్రానికి చేరుకున్న చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై సమీక్షించారు. </p>
<p>తొలుత ఈనెల చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఈనెల 9వ తేదీన నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే, అదేరోజు  ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం ఉండటంతో చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఈనెల 12వ తేదీన నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ముందుగానే రెండు తేదీల్లో పండితులు మంచి ముహూర్తాలు చూశారు. </p>
<p>అందుకే ప్రమాణ స్వీకారంలో మార్పు చేసుకోవడానికి ఏ ఇబ్బందీ కలగలేదు.  ఇదిలా ఉండగా, స్కూళ్లకు సంబంధించి 2023-24 విద్యాసంవత్సరానికి గానూ అకాడమిక్ క్యాలెండర్‌ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన విషయం తెలిసిందే. జూన్ 12 నుంచి స్కూళ్లు పున: ప్రారంభం అవుతాయని తెలిపింది. మొత్తం 229 రోజులు పని చేస్తాయని తెలిపింది. అలాగే 88 రోజుల పాటు సెలవులు ఉండనున్నాయని పేర్కొంది. </p>
<p>అయితే చంద్రబాబు ప్రమాణ స్వీకారం రోజు రాష్ట్రంలోని స్కూళ్లకు సెలవు ప్రకటించాలని పాఠశాల ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ప్రకాష్‌ను మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ కోరారు. సీఎంగా చంద్రబాబు 12న ప్రమాణ స్వీకారం చేస్తున్నందున కార్యక్రమంలో టీచర్లు పాల్గొనేలా ఈ వెసులుబాటు కల్పించాలని విన్నవించారు. స్కూళ్ల పున:ప్రారంభ తేదీని 13వ తేదీ నాటికి వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/june-12-is-a-holiday-for-schools/article-1368</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/june-12-is-a-holiday-for-schools/article-1368</guid>
                <pubDate>Fri, 07 Jun 2024 07:39:04 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/slider6.jpg"                         length="93363"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఉత్కంఠగా ఏపీ ఎన్నికల కౌంటింగ్.. ప్రముఖుల ముందజ</title>
                                    <description><![CDATA[<p>ఏపీలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఉత్కంఠగా కొనసాగుతోంది. ఎన్నికల్లో మొత్తం 3.33 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోగా 4.61 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/counting-of-ap-elections-is-exciting-ahead-of-celebrities/article-1181"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/screenshot-2024-06-04-090756.jpg" alt=""></a><br /><p>ఏపీలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఉత్కంఠగా కొనసాగుతోంది. ఎన్నికల్లో మొత్తం 3.33 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోగా 4.61 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు. అన్ని జిల్లాల్లో 8 గంటలకు లెక్కింపు ప్రారంభమైంది. పార్లమెంట్ నియోజకవర్గాలకు 2443 ఈవీఎం టేబుళ్లు 443 పోస్టల్ బ్యాలెట్ టేబుళ్లు అసెంబ్లీ నియోజకవర్గాలకు 2446 ఈవీఎం టేబుళ్లు, 557 పోస్టల్ బ్యాలెట్ టేబుళ్లు ఉన్నాయి.</p>
<p>రాష్ట్ర వ్యాప్తంగా 33 ప్రాంతాల్లో 401 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటుచేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. ఈ క్రమంలో పిఠాపురంలో పోస్టల్ బ్యాలెట్లలో ఎక్కువగా చెల్లని ఓట్లు నమోదవడంతో ఆందోళన నెలకొంది. ప్రస్తుతం ఈ స్థానం నుంచి పోటీలో ఉన్న పవన్ కల్యాన్ 1000 ఓట్ల మెజార్టీతో ముందజలో ఉన్నారు. అటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పలో 1549ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.  సీఎం జగన్ పులివెందులలో లీడింగ్‌లో ఉన్నారు. అదేవిధంగా జనసేన నేత నాదెండ్ల మనోహర్ తెనాలి అసెంబ్లీ స్థానంలో ముందంజలో ఉన్నారు.</p>
<p>హిందూపురం నియోజకవర్గంలో పోటీ చేస్తున్న బాలకృష్ణ మొదటి రౌండ్‌లో  1880ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అదేవిధంగా కడప ఎంపీ స్థానంలో వైఎస్ అవినాష్ రెడ్డి 2,274 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మంగళగిరిలో నారా లోకేష్ లీడ్‌లో ఉన్నారు. కాగా, నగరి నుంచి పోటీ చేస్తున్న రోజా వెనుకంజలో ఉన్నారు. వైసీపీకి కంచుకోటగా ఉన్న కడపలో టీడీపీ అభ్యర్థి మాధవీరెడ్డి 655 ఓట్ల ఆధిక్యంలో కొనసాగారు. ఈ స్థానంలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా వెనుకబడ్డారు. </p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/counting-of-ap-elections-is-exciting-ahead-of-celebrities/article-1181</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/counting-of-ap-elections-is-exciting-ahead-of-celebrities/article-1181</guid>
                <pubDate>Tue, 04 Jun 2024 09:09:52 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/screenshot-2024-06-04-090756.jpg"                         length="140775"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>స్థానిక సమరంపై చంద్రబాబు ఫోకస్.. తెలంగాణలో పోటీకి సన్నద్ధం</title>
                                    <description><![CDATA[<p>లోక్ సభ ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదలైన తర్వాత ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సమాయత్తమవుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో నిర్వహించే స్థానిక సంస్థల ఎన్నికలపై టీడీపీ అధినేత చంద్రబాబు ఫోకస్ చేశారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/chandrababus-focus-on-local-struggle-is-preparation-for-competition-in/article-1087"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/31032024cbn-inner.jpg" alt=""></a><br /><p>ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం అధికార వైసీపీ, టీడీజీ-బీజేపీ-జనసేన కూటమికి మధ్య పోటీ బాహాబాహీగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో లోక్ సభ ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదలైన తర్వాత ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సమాయత్తమవుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో నిర్వహించే స్థానిక సంస్థల ఎన్నికలపై టీడీపీ అధినేత చంద్రబాబు ఫోకస్ చేశారు.</p>
<p>హైదరాబాద్‌లో శుక్రవారం టీటీడీపీ నాయకులతోసమావేశమయ్యారు చంద్రబాబు. ఈ సమావేశంలో ఆయన కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడానికి సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. ఇక నుంచి ఏపీతో పాటు తెలంగాణ రాజకీయాలకూ సమయం కేటాయిస్తానని చంద్రబాబు చెప్పినట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. అదేవిధంగా స్థానిక సమరానికి టీడీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించినట్లు సమాచారం.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/chandrababus-focus-on-local-struggle-is-preparation-for-competition-in/article-1087</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/chandrababus-focus-on-local-struggle-is-preparation-for-competition-in/article-1087</guid>
                <pubDate>Sat, 01 Jun 2024 09:37:48 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/31032024cbn-inner.jpg"                         length="36411"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        