<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/rangareddy-district/tag-1126" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>Rangareddy district - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/1126/rss</link>
                <description>Rangareddy district RSS Feed</description>
                
                            <item>
                <title>రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి.. శవం పక్కన రెండేళ్ల కొడుకు రోదన</title>
                                    <description><![CDATA[<p>రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టు మండలంలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. ఐనాంగూడా దగ్గర ఘోరరోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బైకును డీసీఎం వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న వ్యక్తి మృతి చెందాడు. ఆయనతో పాటు బైక్ పై తన రెండేళ్ల కొడుకు ఉన్నాడు. కళ్లెదుటే తండ్రి చనిపోవడం.. చుట్ట జనాలు రావడం.. రక్తం మడుగులో పడి ఉండటం చూస్తే అక్కడ ఏం జరుగుతుందో ఆ రెండేళ్ల చిన్నారికి అర్థం కాలేదు. ఏ చేయాలో తెలియక రెండేళ్ల బాబు కన్నీరుమున్నీరు అవుతున్నాడు. దిక్కుతోచని స్థితిలో ఏడుస్తున్న బాబును చూసిన వారికి కూడా కన్నీళ్లు ఆగలేదు. </p>
<p>  </p>
<p>ఈ ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తిని కొవ్వూరుకి చెందిన ప్రసాద్ గా గుర్తించారు. ఏదైనా పని వెతుకుంటూ జీవనం సాగించడానికి వారం రోజుల క్రితం ఇనాంగూడా వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. పాల ప్యాకెట్ కోసం బయటకు వచ్చినపుడు ఈ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/crime/two-year-old-son-cries-next-to-his-fathers-death-in-a/article-1041"><img src="https://www.vishvambhara.com/media/400/2024-05/img-20240530-wa0006.jpg" alt=""></a><br /><p>రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టు మండలంలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. ఐనాంగూడా దగ్గర ఘోరరోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బైకును డీసీఎం వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న వ్యక్తి మృతి చెందాడు. ఆయనతో పాటు బైక్ పై తన రెండేళ్ల కొడుకు ఉన్నాడు. కళ్లెదుటే తండ్రి చనిపోవడం.. చుట్ట జనాలు రావడం.. రక్తం మడుగులో పడి ఉండటం చూస్తే అక్కడ ఏం జరుగుతుందో ఆ రెండేళ్ల చిన్నారికి అర్థం కాలేదు. ఏ చేయాలో తెలియక రెండేళ్ల బాబు కన్నీరుమున్నీరు అవుతున్నాడు. దిక్కుతోచని స్థితిలో ఏడుస్తున్న బాబును చూసిన వారికి కూడా కన్నీళ్లు ఆగలేదు. </p>
<p> </p>
<p>ఈ ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తిని కొవ్వూరుకి చెందిన ప్రసాద్ గా గుర్తించారు. ఏదైనా పని వెతుకుంటూ జీవనం సాగించడానికి వారం రోజుల క్రితం ఇనాంగూడా వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. పాల ప్యాకెట్ కోసం బయటకు వచ్చినపుడు ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి కారణమైన డీసీఎం వాహనం అతివేగంతో వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. ప్రసాద్ స్పాట్ లోనే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Crime</category>
                                    

                <link>https://www.vishvambhara.com/crime/two-year-old-son-cries-next-to-his-fathers-death-in-a/article-1041</link>
                <guid>https://www.vishvambhara.com/crime/two-year-old-son-cries-next-to-his-fathers-death-in-a/article-1041</guid>
                <pubDate>Thu, 30 May 2024 14:35:54 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-05/img-20240530-wa0006.jpg"                         length="138673"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        