<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/app-assembly/tag-1103" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>Ap assembly - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/1103/rss</link>
                <description>Ap assembly RSS Feed</description>
                
                            <item>
                <title>ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో తెలిసిన వ్యక్తి పవన్</title>
                                    <description><![CDATA[<ul>
<li><strong> పవన్‌ను అసెంబ్లీ గేటు తాకనివ్వమని చెప్పారు</strong></li>
<li><strong>వైనాట్ 175 అని చెప్పిన వారికి 11 సీట్లు వచ్చాయి</strong></li>
<li><strong>జనసేన 21కి 21 స్థానాల్లో గెలుపుతో గట్టి సమాధానం</strong></li>
<li><strong>రెండో రోజు అసెంబ్లీలో సీఎం చంద్రబాబు</strong></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/pawan-is-a-person-who-knows-where-to-fall-and/article-2278"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/whatsapp-image-2024-06-22-at-12.42.04-pm.jpeg" alt=""></a><br /><p>ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ పవన్ కల్యాణ్‌ను ఆకాశానికెత్తారు. పవన్ కళ్యాణ్‌ను అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వమని అన్న వైసీపీ నేతలకు సీఎం చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. 21కి 21 స్థానాల్లో గెలిచి పవన్ కళ్యాణ్ గట్టి సమాధానం చెప్పారని అన్నారు. ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో తెలిసిన వ్యక్తి పవన్ అని కొనియాడారు. </p>
<p>ఆనాడు 23 సీట్లు వస్తే దేవుడు రాసిన స్క్రిప్ట్ అని హేళన చేశారని, నేడు కూటమికి 164 సీట్లు వచ్చాయని చంద్రబాబు అన్నారు.  ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్ అని వ్యాఖ్యనించారు. పవన్ ను అసెంబ్లీ గేటు కూడా తాకనీయమని విమర్శించారు. వైకాపా వైనాట్ 175 అని చెప్పి 11 సీట్లు తెచ్చుకున్న పరిస్థితిని చూశాం. నా జీవితంలో ఎప్పుడూ చూడని సభ 15వ శాసన సభ. 15వ శాసనసభను కౌరవసభగా మనం భావించాం అన్నారు. ప్రజా జీవితాలను మార్చే శక్తి ప్రభుత్వ విధానాలకు ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ మేరకు అత్యున్నత, గౌరవ ప్రదమైన సభగా దీనిని తీర్చిదిద్దాలని సభ్యులకు సూచించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/pawan-is-a-person-who-knows-where-to-fall-and/article-2278</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/pawan-is-a-person-who-knows-where-to-fall-and/article-2278</guid>
                <pubDate>Sat, 22 Jun 2024 12:43:58 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/whatsapp-image-2024-06-22-at-12.42.04-pm.jpeg"                         length="91695"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా</title>
                                    <description><![CDATA[<p>ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. మొత్తం 175 మంది ఎమ్మెల్యేలకు గాను, ఇవాళ 172 మంది ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణస్వీకారం చేయించారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/ap-assembly-adjourned-till-tomorrow/article-2236"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/28-19_v_jpg--442x260-4g.webp" alt=""></a><br /><p>ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. మొత్తం 175 మంది ఎమ్మెల్యేలకు గాను, ఇవాళ 172 మంది ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణస్వీకారం చేయించారు. ఎమ్మెల్యేలు జీవీ ఆంజనేయులు (వినుకొండ), పితాని సత్యనారాయణ (ఆచంట), వనమాడి వెంకటేశ్వరరావు (కాకినాడ ) అందుబాటులో లేకపోవడంతో ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు రేపు ప్రమాణం చేయనున్నారు. </p>
<p>ఇదిలా ఉంటే రేపు (జూన్ 22) ఉదయం 10.30 గంటలకు అసెంబ్లీ తిరిగి ప్రారంభం కానుంది. ముగ్గురు ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం అనంతరం స్పీకర్ ఎన్నిక ప్రక్రియ ఉండనుంది. ఏపీ అసెంబ్లీలో రేపు ఉదయం 11 గంటలకు స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడిని ఎన్నుకోనున్నారు. ఇప్పటికే అయ్యన్న తరఫున కూటమి నేతలు నామినేషన్ దాఖలు చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/ap-assembly-adjourned-till-tomorrow/article-2236</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/ap-assembly-adjourned-till-tomorrow/article-2236</guid>
                <pubDate>Fri, 21 Jun 2024 15:09:35 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/28-19_v_jpg--442x260-4g.webp"                         length="25908"                         type="image/webp"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>జగన్ కు గౌరవం ఇవ్వండి.. సీఎం చంద్రబాబు </title>
                                    <description><![CDATA[<p><br /><br /></p>
<p>మాజీ సీఎం జగన్ కు గౌరవం ఇవ్వాలంటూ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. దాంతో అప్పటి నుంచే జగన్ మీద సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ వస్తున్నాయి. ఇక తాజాగా జగన్ కు అసెంబ్లీలో కూడా ప్రతిపక్ష హోదా దక్కలేదు. </p>
<p>దాంతో సాధారణ వ్యక్తిగానే జగన్ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ప్రధాన ప్రతిపక్ష నేత హోదా దక్కకపోవడంతో అసెంబ్లీ గేటు బయటనే జగన్ కారు దిగి లోపలకు నడుచుకుంటూ రావాల్సిన పరిస్థితి వచ్చింది. దాంతో ఇది గమనించిన చంద్రబాబు నాయుడు అసెంబ్లీ గేటు లోనికి జగన్ కారును రానివ్వాలంటూ అధికారులను ఆదేశించారు.</p>
<p>మాజీ సీఎంగా జగన్ కు గౌరవం ఇవ్వాలంటూ తెలిపారు. ఇక ప్రతిపక్షం విషయంలో ఎమ్మెల్యేలు హుందాగా వ్యవహరించాలంటూ టీడీపీ ఎమ్మెల్యేలకు సూచించారు సీఎం చంద్రబాబు నాయుడు. రాగద్వేషాలకు ఏ మాత్రం తావు ఇవ్వొద్దని.. అసెంబ్లీలో</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/cm-chandrababu-give-respect-to-jagan%C2%A0/article-2225"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/1086437-chandrababu-naiduys-jagan.webp" alt=""></a><br /><p><br /><br /></p>
<p>మాజీ సీఎం జగన్ కు గౌరవం ఇవ్వాలంటూ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. దాంతో అప్పటి నుంచే జగన్ మీద సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ వస్తున్నాయి. ఇక తాజాగా జగన్ కు అసెంబ్లీలో కూడా ప్రతిపక్ష హోదా దక్కలేదు. </p>
<p>దాంతో సాధారణ వ్యక్తిగానే జగన్ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ప్రధాన ప్రతిపక్ష నేత హోదా దక్కకపోవడంతో అసెంబ్లీ గేటు బయటనే జగన్ కారు దిగి లోపలకు నడుచుకుంటూ రావాల్సిన పరిస్థితి వచ్చింది. దాంతో ఇది గమనించిన చంద్రబాబు నాయుడు అసెంబ్లీ గేటు లోనికి జగన్ కారును రానివ్వాలంటూ అధికారులను ఆదేశించారు.</p>
<p>మాజీ సీఎంగా జగన్ కు గౌరవం ఇవ్వాలంటూ తెలిపారు. ఇక ప్రతిపక్షం విషయంలో ఎమ్మెల్యేలు హుందాగా వ్యవహరించాలంటూ టీడీపీ ఎమ్మెల్యేలకు సూచించారు సీఎం చంద్రబాబు నాయుడు. రాగద్వేషాలకు ఏ మాత్రం తావు ఇవ్వొద్దని.. అసెంబ్లీలో అయినా.. బయట అయినా చాలా హుందాగానే వ్యవహరించాలంటూ తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/cm-chandrababu-give-respect-to-jagan%C2%A0/article-2225</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/cm-chandrababu-give-respect-to-jagan%C2%A0/article-2225</guid>
                <pubDate>Fri, 21 Jun 2024 14:11:12 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/1086437-chandrababu-naiduys-jagan.webp"                         length="31988"                         type="image/webp"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పవన్ కల్యాణ్‌కు కలిసొచ్చిన ‘21’</title>
                                    <description><![CDATA[<ul>
<li><strong>21 స్థానాల్లో పోటీ చేసి విజయం</strong></li>
<li><strong>21 ఎమ్మెల్యేలతో 21వ తారీఖున ప్రమాణ స్వీకారం</strong></li>
<li><strong>నెట్టింట పవన్ అభిమానుల పోస్టులు </strong></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/pawan-kalyans-21/article-2214"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/screenshot-2024-06-21-114448.jpg" alt=""></a><br /><p>జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ‘21’ నెంబర్ బాగా కలిసివచ్చిందని జన సైనికులు అంటున్నారు. టాలీవుడ్‌లో అగ్రహీరోగా ఉన్న పవన్ కల్యాణ్ రాజకీయాలపై మక్కువతో 2019 ఎన్నికలతో ప్రజా క్షేత్రంలోకి అడుగుపెట్టారు. భీమవరం, గాజువాక అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన పవన్ కల్యాణ్ ఆయా స్థానాల్లో ఘోర ఓటమిని చవి చూశారు. </p>
<p>అయితే, రెండోసారి 2024 ఎన్నికల్లో ఎన్డీయే కూటమితో జత కట్టి 21 స్థానాల్లో జనసేన అభ్యర్థులతో కలిసి బరిలో నిలిచారు. ఈసారి పవన్ ఒకే ఒక్క నియోజకవర్గం (పిఠాపురం) నుంచి పోటీ చేసి భారీ మెజారిటీని కైవసం చేసుకున్నారు. తన సమీప అభ్యర్థి వైఎస్సార్సీపీ నాయకురాలు వంగ గీతపై 70,354 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. </p>
<p>అంతేకాదు.. జనసేన అభ్యర్థులు 21మంది పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయాన్ని కైవసం చేసుకున్నారు. ఇవాళ(శుక్రవారం) అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో పవన్ కల్యాణ్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండాపోయింది. ‘21 సీట్లు తీసుకుని, 21 సీట్లు గెలిచి, 21మంది ఎమ్మెల్యేలతో 21వ తేదీన అసెంబ్లీలో అడుగుపెట్టిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు శుభాకాంక్షలు’ అంటూ పోస్టులు పెడుతున్నారు. దీంతో 21 నెంబర్ పవన్ ‌కల్యాణ్‌కు బాగా కలిసివచ్చిందని కామెంట్స్ చేస్తున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/pawan-kalyans-21/article-2214</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/pawan-kalyans-21/article-2214</guid>
                <pubDate>Fri, 21 Jun 2024 11:47:43 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/screenshot-2024-06-21-114448.jpg"                         length="138890"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం</title>
                                    <description><![CDATA[<ul>
<li><strong>ఏపీ శాసనసభలో సీఎం, మంత్రుల ప్రమాణస్వీకారం </strong></li>
<li><strong>తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన పవన్ కల్యాణ్</strong></li>
<li><strong>ఫుల్ జోష్‌లో జనసైనికులు</strong></li>
<li><strong>పవన్‌ను ఆలింగనం చేసుకున్న సీఎం చంద్రబాబు </strong></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/ap-assembly-sessions-begin/article-2210"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/screenshot-2024-06-21-101033.jpg" alt=""></a><br /><p>ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నేడు(శుక్రవారం), రేపు సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఇతర మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి వారితో ప్రమాణం చేయిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్‌ ప్రమాణ స్వీకారం చేశారు. </p>
<p>ఆ తర్వాత మిగతా మిగతా మంత్రులు, మహిళా ఎమ్మెల్యేలు అనంతరం మిగిలిన ఎమ్మెల్యేల అక్షర క్రమం ప్రకారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే తొలిసారిగా పవన్‌ కల్యాణ్‌, లోకేష్‌లు అసెంబ్లీలో అడుగుపెట్టారు. కాగా రేపు ఎమ్మెలంతా రేపు(శనివారం) స్పీకర్‌ను ఎన్నుకోనున్నారు. మాజీ సీఎం జగన్ కూడా ఈ కార్యక్రమానికి వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఐదేళ్ల తర్వాత సీఎం హోదాలో చంద్రబాబు అసెంబ్లీకి హాజరయ్యారు. సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. అదేవిధంగా పవన్ కల్యాణ్ తొలిసారి శాసనసభలో అడుగుపెట్టడంతో జనసైనికులు ఫుల్ జోష్‌లో ఉన్నారు.</p>
<div class="div_border" contenteditable="false">
<blockquote class="twitter-tweet">
<p dir="ltr" lang="te" xml:lang="te">ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభలో తొలిసారిగా అడుగుపెట్టిన గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ <a href="https://twitter.com/PawanKalyan?ref_src=twsrc%5Etfw">@PawanKalyan</a> గారు. ఆత్మీయంగా పలకరించుకున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ <a href="https://twitter.com/ncbn?ref_src=twsrc%5Etfw">@ncbn</a> గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు.<a href="https://twitter.com/hashtag/PawanKalyanAneNenu?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#PawanKalyanAneNenu</a> <a href="https://twitter.com/hashtag/GameChangerPK?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#GameChangerPK</a> <a href="https://t.co/fNfdgbrmHG">pic.twitter.com/fNfdgbrmHG</a></p>
— JanaSena Shatagni (@JSPShatagniTeam) <a href="https://twitter.com/JSPShatagniTeam/status/1804009494814560286?ref_src=twsrc%5Etfw">June 21, 2024</a></blockquote>

</div>
<p>

</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/ap-assembly-sessions-begin/article-2210</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/ap-assembly-sessions-begin/article-2210</guid>
                <pubDate>Fri, 21 Jun 2024 10:11:44 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/screenshot-2024-06-21-101033.jpg"                         length="139213"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఏపీ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్ గా బుచ్చయ్య చౌదరి..!</title>
                                    <description><![CDATA[<p><br /><br /></p>
<p>ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా అందరూ ఊహించనట్టుగానే రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎన్నికయ్యారు. రాజకీయాల్లో చాలా సీనియర్ నేతగా.. టీడీపీ పుట్టుక నుంచి ఉన్న ఆయనకు ఈ సారి మంత్రి పదవి దక్కలేదు. కానీ ఆయనకు చాలా కీలక పదవి ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. దాదాపు ఏడుసార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. </p>
<p>పైగా టీడీపీకి మొదట్లో అండగా ఉన్న వారిలో బుచ్చయ్య కుటుంబం కూడా ఉంది. కాబట్టి ఆయనకు మరోసారి పదవి ఇచ్చారు చంద్రబాబు నాయుడు. తాజాగా ఆయనకు ప్రొటెం స్పీకర్ పదవి రావడంపై బుచ్చయ్య స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. రేపు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఎదుట ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పుకొచ్చారు. </p>
<p>స్పీకర్ గా నా బాధ్యతలు స్వీకరిస్తానని ఆయన వివరించారు. ఇక మీదట ఏపీలో అసెంబ్లీ చాలా పద్ధతిగా నడుస్తుందని భావిస్తున్నాను అంటూ తెలిపారు బుచ్చయ్య చౌదరి. ఇక శుక్రవారం</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/butchaiah-chaudhary-as-ap-assembly-protem-speaker/article-2117"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/gorantla-butchaiah-chowdary_v_jpg--1280x720-4g.webp" alt=""></a><br /><p><br /><br /></p>
<p>ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా అందరూ ఊహించనట్టుగానే రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎన్నికయ్యారు. రాజకీయాల్లో చాలా సీనియర్ నేతగా.. టీడీపీ పుట్టుక నుంచి ఉన్న ఆయనకు ఈ సారి మంత్రి పదవి దక్కలేదు. కానీ ఆయనకు చాలా కీలక పదవి ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. దాదాపు ఏడుసార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. </p>
<p>పైగా టీడీపీకి మొదట్లో అండగా ఉన్న వారిలో బుచ్చయ్య కుటుంబం కూడా ఉంది. కాబట్టి ఆయనకు మరోసారి పదవి ఇచ్చారు చంద్రబాబు నాయుడు. తాజాగా ఆయనకు ప్రొటెం స్పీకర్ పదవి రావడంపై బుచ్చయ్య స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. రేపు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఎదుట ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పుకొచ్చారు. </p>
<p>స్పీకర్ గా నా బాధ్యతలు స్వీకరిస్తానని ఆయన వివరించారు. ఇక మీదట ఏపీలో అసెంబ్లీ చాలా పద్ధతిగా నడుస్తుందని భావిస్తున్నాను అంటూ తెలిపారు బుచ్చయ్య చౌదరి. ఇక శుక్రవారం నాడు అసెంబ్లీ ప్రొటెం స్పీకర్ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం ఉంది.  </p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/butchaiah-chaudhary-as-ap-assembly-protem-speaker/article-2117</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/butchaiah-chaudhary-as-ap-assembly-protem-speaker/article-2117</guid>
                <pubDate>Wed, 19 Jun 2024 15:53:32 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/gorantla-butchaiah-chowdary_v_jpg--1280x720-4g.webp"                         length="37602"                         type="image/webp"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు.. జగన్ కు చంద్రబాబు వార్నింగ్..!</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>చంద్రబాబును మంగళవారం ఎన్డీయే శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అనేక విషయాలపై మాట్లాడారు. తనను ఎన్నుకున్న ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలిపారు. ఏపీలో ఇప్పుడు నిర్మాణాత్మక అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. </p>
<p>ఇక ఏపీ రాజధానిగా అమరావతే ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. విశాఖను ఆర్థిక రాజధానిగా తీర్చి దిద్దుతామన్నారు. అంతే కాకుండా రాబోయే రోజుల్లో ఎవరూ కూడా పదవి వచ్చిందని విర్రవీగొద్దంటూ తెలిపారు. ఇక ఇదే సందర్భంగా జగన్ కు ఇన్ డైరెక్టుగా వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు. </p>
<p>తప్పు చేసిన వారికి శిక్ష పడాలని.. లేదంటే అదే తప్పు చేయడం వారికి అలవాటుగా మారుతుందని ఆయన తెలిపారు. నా కుటుంబానికి అవమానం జరిగింది. అది కౌరవ సభ అని గౌరవ సభగా మార్చిన తర్వాతనే వస్తానని చెప్పి బయటకు వచ్చాను. ప్రజలు నా తీర్పును గౌరవించారు. కాబట్టి ప్రజలను నిలబెట్టాలి అంటూ చెప్పుకొచ్చారు చంద్రబాబు.</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/chandrababu-warns-jagan-that-those-who-do-wrong-must-be/article-1683"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/download-(23).jpeg" alt=""></a><br /><p> </p>
<p>చంద్రబాబును మంగళవారం ఎన్డీయే శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అనేక విషయాలపై మాట్లాడారు. తనను ఎన్నుకున్న ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలిపారు. ఏపీలో ఇప్పుడు నిర్మాణాత్మక అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. </p>
<p>ఇక ఏపీ రాజధానిగా అమరావతే ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. విశాఖను ఆర్థిక రాజధానిగా తీర్చి దిద్దుతామన్నారు. అంతే కాకుండా రాబోయే రోజుల్లో ఎవరూ కూడా పదవి వచ్చిందని విర్రవీగొద్దంటూ తెలిపారు. ఇక ఇదే సందర్భంగా జగన్ కు ఇన్ డైరెక్టుగా వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు. </p>
<p>తప్పు చేసిన వారికి శిక్ష పడాలని.. లేదంటే అదే తప్పు చేయడం వారికి అలవాటుగా మారుతుందని ఆయన తెలిపారు. నా కుటుంబానికి అవమానం జరిగింది. అది కౌరవ సభ అని గౌరవ సభగా మార్చిన తర్వాతనే వస్తానని చెప్పి బయటకు వచ్చాను. ప్రజలు నా తీర్పును గౌరవించారు. కాబట్టి ప్రజలను నిలబెట్టాలి అంటూ చెప్పుకొచ్చారు చంద్రబాబు. చంద్రబాబు మాటలను బట్టి చూస్తుంటే జగన్ ను వదిలిపెట్టబోరని తెలుస్తోంది.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/chandrababu-warns-jagan-that-those-who-do-wrong-must-be/article-1683</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/chandrababu-warns-jagan-that-those-who-do-wrong-must-be/article-1683</guid>
                <pubDate>Tue, 11 Jun 2024 16:19:48 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/download-%2823%29.jpeg"                         length="8549"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రిజల్ట్ ఎఫెక్ట్.. ఏపీలో 3 రోజలు మద్యం బంద్</title>
                                    <description><![CDATA[<p>ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ నెల 4న రానున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఓట్ల లెక్కింపు రోజు ఎలాంటి అల్లర్లు చోటు చేసుకోకుండా ముందుజాగ్రత్త చర్యగా మూడు రోజుల పాటు వైన్స్ షాపులను బంద్ చేయాలని ఆదేశించింది. జూన్ 3 నుంచి 5 వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మద్యం షాపులను మూసివేయాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాలు జారీ చేశారు. </p>
<p>  </p>
<p>కౌంటింగ్ కేంద్రాల దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. దీంతో పాటు ఓట్ల లెక్కింపు జరిగే కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు డీజీపీ చెప్పారు. హోటళ్లు, లాడ్జిలను క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని జిల్లాలోని పోలీసులకు ఆదేశించారు. అనుమానాస్పదంగా ఎవరైనా ఉంటే అదుపులోకి తీసుకోవాలని సూచించారు. సోషల్ మీడియాపై కూడా నిఘా పెట్టాలని తెలిపారు. అల్లర్లకు ప్రేరేపించేలా.. రెచ్చగొట్టేలా ఎవరైనా పోస్టులు పెడితే</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/result-effect-3-days-liquor-ban-in-ap/article-1014"><img src="https://www.vishvambhara.com/media/400/2024-05/img-20240529-wa0008.jpg" alt=""></a><br /><p>ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ నెల 4న రానున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఓట్ల లెక్కింపు రోజు ఎలాంటి అల్లర్లు చోటు చేసుకోకుండా ముందుజాగ్రత్త చర్యగా మూడు రోజుల పాటు వైన్స్ షాపులను బంద్ చేయాలని ఆదేశించింది. జూన్ 3 నుంచి 5 వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మద్యం షాపులను మూసివేయాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాలు జారీ చేశారు. </p>
<p> </p>
<p>కౌంటింగ్ కేంద్రాల దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. దీంతో పాటు ఓట్ల లెక్కింపు జరిగే కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు డీజీపీ చెప్పారు. హోటళ్లు, లాడ్జిలను క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని జిల్లాలోని పోలీసులకు ఆదేశించారు. అనుమానాస్పదంగా ఎవరైనా ఉంటే అదుపులోకి తీసుకోవాలని సూచించారు. సోషల్ మీడియాపై కూడా నిఘా పెట్టాలని తెలిపారు. అల్లర్లకు ప్రేరేపించేలా.. రెచ్చగొట్టేలా ఎవరైనా పోస్టులు పెడితే వారిపై కూడా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. </p>
<p> </p>
<p>ఏపీలో పోలింగ్ రోజు నుంచి మూడు రోజుల పాటు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో.. కౌంటింగ్ పోలీసులకు సవాల్ గా మారింది. కౌంటింగ్ నేపధ్యంలో అల్లర్లు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్సీ రిపోర్టులు కూడా ఉన్నాయి. దీంతో.. పోలీసులు అప్రమత్తం అవుతున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/result-effect-3-days-liquor-ban-in-ap/article-1014</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/result-effect-3-days-liquor-ban-in-ap/article-1014</guid>
                <pubDate>Wed, 29 May 2024 13:49:42 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-05/img-20240529-wa0008.jpg"                         length="382644"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        