<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/bail/tag-1056" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>bail - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/1056/rss</link>
                <description>bail RSS Feed</description>
                
                            <item>
                <title>మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఊరట</title>
                                    <description><![CDATA[<p>వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది. 2023లో సత్తెనపల్లిలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల లక్కీ డ్రా వ్యవహారంలో నమోదైన కేసులో గుంటూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టు బుధవారం ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/relief-for-former-minister-ambati-rambabu/article-8903"><img src="https://www.vishvambhara.com/media/400/2026-02/whatsapp-image-2026-02-18-at-1.36.42-pm.jpeg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, ఏపీ బ్యూరో: </strong>వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది. 2023లో సత్తెనపల్లిలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల లక్కీ డ్రా వ్యవహారంలో నమోదైన కేసులో గుంటూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టు బుధవారం ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. ఈ కేసు విచారణలో భాగంగా అంబటిని తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ సత్తెనపల్లి పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి తోసిపుచ్చారు. దీంతో గత కొంతకాలంగా వరుస కేసులతో ఇబ్బందులు పడుతున్న ఆయనకు ఈ తీర్పు పెద్ద ఉపశమనంగా మారింది.</p>
<p><strong>విడుదలపై వీడని ఉత్కంఠ</strong><br />ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసుతో పాటు మరికొన్ని ఫిర్యాదుల నేపథ్యంలో అంబటి రాంబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనల సమయంలో పోలీసులను బెదిరించారన్న ఆరోపణలపై పట్టాభిపురం పోలీసులు నమోదు చేసిన కేసులో ఈనెల 11నే ఆయనకు గుంటూరు ఎక్సైజ్ కోర్టు బెయిల్ ఇచ్చింది. అయితే, అదే సమయంలో సంక్రాంతి లక్కీ డ్రా కేసులో పీటీ వారెంట్ జారీ కావడంతో ఆయన జైలు నుండి విడుదల కాకుండా అడ్డంకులు ఎదురయ్యాయి. తాజా కోర్టు నిర్ణయంతో ఆ అడ్డంకులు తొలగిపోయాయి.</p>
<p><strong>రాజకీయ కోణంలో విచారణ</strong><br />సంక్రాంతి సంబరాల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా లక్కీ డ్రా నిర్వహించి నిధులు వసూలు చేశారన్నది అంబటిపై ఉన్న ప్రధాన ఆరోపణ. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం, పోలీసుల కస్టడీ విన్నపాన్ని తిరస్కరిస్తూనే బెయిల్ మంజూరు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ప్రభుత్వం కావాలనే పాత కేసులను తిరగదోడి తనను ఇబ్బంది పెడుతోందని అంబటి తరపు న్యాయవాదులు వాదించగా, విచారణకు సహకరించడం లేదని పోలీసులు పేర్కొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/relief-for-former-minister-ambati-rambabu/article-8903</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/relief-for-former-minister-ambati-rambabu/article-8903</guid>
                <pubDate>Wed, 18 Feb 2026 13:58:13 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-02/whatsapp-image-2026-02-18-at-1.36.42-pm.jpeg"                         length="66221"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఐబొమ్మ రవికి హైకోర్టులో ఊరట.. షరతులతో కూడిన బెయిల్ మంజూరు</title>
                                    <description><![CDATA[<p> చలనచిత్ర పరిశ్రమను కుదిపేసిన పైరసీ వెబ్‌సైట్ నిర్వాహకుడు రవికి ఎట్టకేలకు ఊరట లభించింది. </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/aibomma-ravi-granted-conditional-bail-in-high-court/article-8883"><img src="https://www.vishvambhara.com/media/400/2026-02/whatsapp-image-2026-02-17-at-6.18.45-pm.jpeg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, తెలంగాణ బ్యూరో: </strong>చలనచిత్ర పరిశ్రమను కుదిపేసిన పైరసీ వెబ్‌సైట్ నిర్వాహకుడు రవికి ఎట్టకేలకు ఊరట లభించింది. సుదీర్ఘ కాలంగా జైలు జీవితం గడుపుతున్న రవికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ మంజూరైనప్పటికీ, కొన్ని కఠినమైన నిబంధనలను కోర్టు విధించింది. రవి ప్రతిరోజూ సంబంధిత పోలీసు స్టేషన్ (సీపీఎస్) ఎదుట హాజరు కావాలని, దేశం విడిచి వెళ్లకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా, తన పాస్‌పోర్టును వెంటనే పోలీసులకు అప్పగించాలని కోర్టు ఆదేశించింది.</p>
<p><strong>వేల కోట్ల నష్టం.. అండమాన్‌లో అరెస్ట్</strong><br />సినిమాలను అక్రమంగా పైరసీ చేస్తూ పరిశ్రమకు వేల కోట్ల రూపాయల నష్టం కలిగించాడనే ఆరోపణలతో రవిని గత ఏడాది నవంబర్ 16న పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ పైరసీ దందా ద్వారా రవి కోట్ల రూపాయల అక్రమ సంపాదన గడించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పోలీసుల కళ్లుగప్పి అండమాన్ దీవుల్లోని ఒక ఐలాండ్‌లో దాక్కున్న రవిని గుర్తించి, అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించారు. అరెస్ట్‌కు ముందు పోలీసులకు సవాల్ విసిరిన రవి వ్యవహారం అప్పట్లో సంచలనం సృష్టించింది.</p>
<p><strong>నెట్టింట రవికి మద్దతు.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్</strong><br />రవి అరెస్ట్ తర్వాత సోషల్ మీడియాలో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. పలువురు నెటిజన్లు రవికి మద్దతుగా నిలవడం హాట్ టాపిక్‌గా మారింది. థియేటర్లలో సినిమా టికెట్ల ధరలు, ఆహార పదార్థాలు, నీళ్ల బాటిళ్ల ధరలు సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రవిని హీరోతో పోల్చుతూ, సామాన్యుడికి అందుబాటులో సినిమాలు చూపిస్తున్నాడంటూ అతడికి పొగడ్తలు కురిపించడం గమనార్హం. </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/aibomma-ravi-granted-conditional-bail-in-high-court/article-8883</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/aibomma-ravi-granted-conditional-bail-in-high-court/article-8883</guid>
                <pubDate>Tue, 17 Feb 2026 18:22:21 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-02/whatsapp-image-2026-02-17-at-6.18.45-pm.jpeg"                         length="50764"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>గాదె ఇన్నయ్యఇంట్లో విషాదం</title>
                                    <description><![CDATA[<p>మావోయిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నారనే ఆరోపణలతో ఇటీవల ఎన్‌ఐఏ  అధికారులు అరెస్ట్ చేసిన సామాజిక ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/tragedy-in-gade-innayyas-house/article-7606"><img src="https://www.vishvambhara.com/media/400/2026-01/6734494a-b1e4-4dfd-a87e-0a966c02597e.jpg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, తెలంగాణ బ్యూరో:</strong> మావోయిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నారనే ఆరోపణలతో ఇటీవల ఎన్‌ఐఏ  అధికారులు అరెస్ట్ చేసిన సామాజిక ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన తల్లి థెరిసమ్మ గురువారం రాత్రి కన్నుమూశారు. జనగామ జిల్లా జాఫర్‌గఢ్ మండలం సాగరంలోని స్వగృహంలో థెరిసమ్మ వృద్ధాప్య సమస్యల కారణంగా మరణించారు.</p>
<p>ఇటీవల ఇన్నయ్య అరెస్ట్ కావడం, ఆయన జైలులో ఉండటంతో కుటుంబం తీవ్ర ఆందోళనలో ఉంది. తల్లి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఇన్నయ్యకు అనుమతి ఇవ్వాలని కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయించారు. దీంతో తల్లి అంత్యక్రియల నిమిత్తం గాదె ఇన్నయ్యకు 48 గంటల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన శనివారం జరగనున్న అంత్యక్రియల్లో పాల్గొననున్నారు. ఈ మేరకు జైలు అధికారులకు ఆదేశాలు అందడంతో ఇన్నయ్య చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు.</p>
<p>గత కొద్దిరోజుల క్రితం జాఫర్‌గఢ్ మండల కేంద్రంలోని ఆయన నిర్వహిస్తున్న అనాథాశ్రమంపై ఎన్‌ఐఏ అధికారులు మెరుపు దాడులు నిర్వహించి, నాలుగు వాహనాల్లో వచ్చి ఇన్నయ్యను అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి ఆయన జైలులోనే ఉంటున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/tragedy-in-gade-innayyas-house/article-7606</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/tragedy-in-gade-innayyas-house/article-7606</guid>
                <pubDate>Fri, 16 Jan 2026 18:46:36 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-01/6734494a-b1e4-4dfd-a87e-0a966c02597e.jpg"                         length="71896"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కేజ్రీవాల్ కు మళ్లీ షాక్.. బెయిల్ పై స్టే విధించిన కోర్టు</title>
                                    <description><![CDATA[<p>కేజ్రీవాల్ కు మరోసారి షాక్ తగిలింది. ఎన్నో ప్రయత్నాల తర్వాత నిన్న గురువారం రాత్రి బెయిల్ వచ్చిందని సంతోషించే లోపే.. బెయిల్ మీద స్టే విధించింది హైకోర్టు. గురువారం రాత్రి ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్ కు బెయిల్ ఇవ్వడంతో దాన్ని సవాల్ చేస్తూ ఈడీ హైకోర్టులో పిటిషన్ వేసింది. దానిపై హైకోర్టు విచారణ జరిపింది. </p>
<p>బెయిల్ మీద స్టే విధించింది. హైకోర్టులో జస్టిస్ సుధీర్ కుమార్ జైన్, జస్టిస్ రవీందర్ దుడేజాతో కూడిన ధర్మాసనం ఈ స్టే విధించింది. కాగా ఈ బెంచ్ కంటే ముందు ఈడీ బెయిల్ మీద మీద స్టే విధించాలంటూ వేసిన పిటిషన్ ను తోసిపుచ్చింది. కానీ తర్వాత బెంచ్ మాత్రం దానిపై స్టే విధించింది. </p>
<p>పూర్తి స్థాయిలో కేసును విచారించేందుకు అనుకూలమైన సమయాన్ని తమకు ఇవ్వలేదని.. తమ వాదన వినిపించేందుకు సమయం ఇవ్వలేదని హైకోర్టులో ఈడీ తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ వాదించారు.</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/national/the-court-stayed-the-shock-bail-of-kejriwal-again/article-2234"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/download3.jpeg" alt=""></a><br /><p>కేజ్రీవాల్ కు మరోసారి షాక్ తగిలింది. ఎన్నో ప్రయత్నాల తర్వాత నిన్న గురువారం రాత్రి బెయిల్ వచ్చిందని సంతోషించే లోపే.. బెయిల్ మీద స్టే విధించింది హైకోర్టు. గురువారం రాత్రి ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్ కు బెయిల్ ఇవ్వడంతో దాన్ని సవాల్ చేస్తూ ఈడీ హైకోర్టులో పిటిషన్ వేసింది. దానిపై హైకోర్టు విచారణ జరిపింది. </p>
<p>బెయిల్ మీద స్టే విధించింది. హైకోర్టులో జస్టిస్ సుధీర్ కుమార్ జైన్, జస్టిస్ రవీందర్ దుడేజాతో కూడిన ధర్మాసనం ఈ స్టే విధించింది. కాగా ఈ బెంచ్ కంటే ముందు ఈడీ బెయిల్ మీద మీద స్టే విధించాలంటూ వేసిన పిటిషన్ ను తోసిపుచ్చింది. కానీ తర్వాత బెంచ్ మాత్రం దానిపై స్టే విధించింది. </p>
<p>పూర్తి స్థాయిలో కేసును విచారించేందుకు అనుకూలమైన సమయాన్ని తమకు ఇవ్వలేదని.. తమ వాదన వినిపించేందుకు సమయం ఇవ్వలేదని హైకోర్టులో ఈడీ తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ వాదించారు. మనీలాండరింగ్ యాక్ట్‌లోని సెక్షన్ 45ని ప్రస్తావించిన అడిషనల్ సొలిసిటర్ జనరల్ బెయిల్‌పై స్టే విధించాలని కోరారు. ప్రస్తుతం దానిపై ఇంకా విచారణ జరిగే అవకాశం ఉంది.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                    

                <link>https://www.vishvambhara.com/national/the-court-stayed-the-shock-bail-of-kejriwal-again/article-2234</link>
                <guid>https://www.vishvambhara.com/national/the-court-stayed-the-shock-bail-of-kejriwal-again/article-2234</guid>
                <pubDate>Fri, 21 Jun 2024 15:01:18 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/download3.jpeg"                         length="6496"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రేవ్ పార్టీ కేసు.. నటి హేమకు బెయిల్</title>
                                    <description><![CDATA[<p>బెంగళూరు రేవ్ పార్టీ కేసులో టాలీవుడ్ నటి హేమ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో హేమకు ఊరట లభించింది.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/crime/actress-hema-gets-bail-in-rave-party-case/article-1730"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/rave-party-hema-696x497.jpg" alt=""></a><br /><p>బెంగళూరు రేవ్ పార్టీ కేసులో టాలీవుడ్ నటి హేమ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో హేమకు ఊరట లభించింది. బెంగళూరు స్పెషల్ కోర్టు ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా హేమ పరప్పన అగ్రహార జైల్లో ఉంది. బెయిల్ లభించిన నేపథ్యంలో ఆమె జైలు నుంచి బయటికి రానుంది. </p>
<p>బెంగళూరు పోలీసులు మరికొంతమంది టాలీవుడ్ సెలబ్రిటీలను ఈ పార్టీకి తరలించే ప్రయత్నం చేసినట్లు ధ్రువీకరించారు. దీంతో విచారణకు హాజరు కావాలని నోటీసులు కూడా పంపించారు. తొలిసారి జారీ చేసిన నోటీసులకు అనారోగ్య కారణాలతో హేమ విచారణకు హాజరు కాలేదు. దీంతో రెండోసారి కూడా బెంగళూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. అప్పుడు బుర్ఖా ధరించి విచారణకు హాజరైంది హేమ. ఆ తర్వాత కోర్టు ఆమెకు 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. </p>
<p>ఆ తర్వాత మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా హేమ సభ్యత్వాన్ని రద్దు చేసింది. తాజాగా హేమకు బెయిల్ మంజూరు కావడంతో హేమకు కాస్త ఊరట లభించినట్లైంది. ఇవాళ బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా హేమ తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు. హేమ నుంచి ఎలాంటి మాదకద్రవ్యాలు లభించలేదని, చాలా రోజుల తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించామని హేమ తరఫు న్యాయవాది మహేష్ కిరణ్ శెట్టి వాదించారు. దీంతో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయాలని కోర్టు ఆదేశించింది.</p>]]></content:encoded>
                
                                                            <category>Movies</category>
                                            <category>Crime</category>
                                    

                <link>https://www.vishvambhara.com/crime/actress-hema-gets-bail-in-rave-party-case/article-1730</link>
                <guid>https://www.vishvambhara.com/crime/actress-hema-gets-bail-in-rave-party-case/article-1730</guid>
                <pubDate>Thu, 13 Jun 2024 07:26:38 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/rave-party-hema-696x497.jpg"                         length="67608"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పరువు నష్టం దావా కేసు.. రాహుల్ గాంధీకి ఊరట</title>
                                    <description><![CDATA[<p>గతేడాది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీపై రాహుల్‌ గాంధీ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీంతో రాహుల్‌పై బీజేపీ పరువు నష్టం దావా వేసింది.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/national/defamation-case-is-a-relief-for-rahul-gandhi/article-1390"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/rahul-gandhi-3.jpg" alt=""></a><br /><p>గతేడాది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీపై రాహుల్‌ గాంధీ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీంతో రాహుల్‌పై బీజేపీ పరువు నష్టం దావా వేసింది. అయితే, తాజాగా ఈ కేసులో రాహుల్ గాంధీకి ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించి విచారణ చేపట్టిన బెంగళూరు స్పెషల్‌ కోర్టు  బెయిల్‌ మంజూరు చేసింది. 2019-2023 బీజేపీ పాలనలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని, ప్రతీ పనిలోనూ 40శాతం కమీషన్ తీసుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు. </p>
<p>రాహుల్‌ ఆరోపణలను సీరియస్‌గా తీసుకున్న కర్ణాటక బీజేపీనేతలు కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు డీకే శివకుమార్‌, సిద్ధరామయ్య, రాహుల్‌ గాంధీ సహా కాంగ్రెస్‌ నేతలు అప్పటి ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై సహా తమ పార్టీ నేతలపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్‌ కేశవ్‌ ప్రసాద్‌ ఆ పార్టీ తరఫున పరువు నష్టం దావా వేశారు. 40 శాతం కమీషన్‌ ప్రభుత్వం’గా అభివర్ణిస్తూ పత్రికల్లో పెద్ద ఎత్తున ప్రకటనలు ఇప్పించారని దుయ్యబట్టారు. </p>
<p>అదేవిధంగా వివిధ రకాల ఉద్యోగాలకు బీజేపీ ‘రేటు కార్డులు’ పెట్టిందంటూ హస్తం పార్టీ పోస్టర్లు అతికించి తమ పార్టీ పరువుకు భంగం కలిగించిందని పిటిషన్‌లో ప్రస్తావించారు. ఇక ఈ కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు గత వారం బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే. రాహుల్ ఈ కేసులో సహ నిందితుడు కాగా ఆయన విచారణకు హాజరయ్యారు. వాదోపవాదనలు విన్న కోర్టు రాహుల్‌కు బెయిల్ మంజూరు చేస్తూ తదుపరి విచారణను జులై 30కి వాయిదా వేస్తూ తీర్పునిచ్చింది.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                    

                <link>https://www.vishvambhara.com/national/defamation-case-is-a-relief-for-rahul-gandhi/article-1390</link>
                <guid>https://www.vishvambhara.com/national/defamation-case-is-a-relief-for-rahul-gandhi/article-1390</guid>
                <pubDate>Fri, 07 Jun 2024 12:21:51 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/rahul-gandhi-3.jpg"                         length="51452"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పిన్నెల్లికి ముందస్తు బెయిల్ మంజూరు చేసిన కోర్టు</title>
                                    <description><![CDATA[<p>వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బిగ్ రిలీఫ్ లభించింది. ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో ఆయనకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/court-grants-anticipatory-bail-to-pinnelli/article-955"><img src="https://www.vishvambhara.com/media/400/2024-05/337286-pinnelli.jpg" alt=""></a><br /><p>వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బిగ్ రిలీఫ్ లభించింది. ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో ఆయనకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. మే 13న ఏపీలో ఎన్నికలు జరిగిన సమయంలో మాచర్ల నియోజకవర్గం పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రం ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఆ పోలింగ్ కేంద్రంలోకి వెళ్లిన పిన్నెల్లి.. ఈవీఎం మెషిన్‌ను ధ్వంసం చేశారు. </p><p>ఈ కేసుతో పాటు పోలింగ్ తర్వాత జరిగిన మూడు ఘటనల్లోనూ తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టులో పిన్నెల్లి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు ఇవాళ(సోమవారం) విచారించింది. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం పిన్నెల్లికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/court-grants-anticipatory-bail-to-pinnelli/article-955</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/court-grants-anticipatory-bail-to-pinnelli/article-955</guid>
                <pubDate>Mon, 27 May 2024 17:42:07 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-05/337286-pinnelli.jpg"                         length="41340"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        