బీజేపీకి మాజీ కేంద్రమంత్రి సూర్యకాంత పాటిల్ రాజీనామా

బీజేపీకి మాజీ కేంద్రమంత్రి సూర్యకాంత పాటిల్ రాజీనామా

లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం పాలైన కొద్ది రోజుల తర్వాత, కేంద్ర మాజీ మంత్రి సూర్యకాంత పాటిల్ భారతీయ జనతా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.

లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం పాలైన కొద్ది రోజుల తర్వాత, కేంద్ర మాజీ మంత్రి సూర్యకాంత పాటిల్ భారతీయ జనతా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ‘గత 10 ఏళ్లలో నేను చాలా నేర్చుకున్నాను, పార్టీకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అని ఆమె రాజీనామా అనంతరం పేర్కొన్నారు. 

2014లో శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీతో విడిపోయిన తర్వాత బీజేపీలో చేరిన పాటిల్, లోక్‌సభ ఎన్నికల సమయంలో మరాఠ్వాడాలోని హింగోలి నియోజకవర్గం నుంచిటికెట్ ఆశించారు. అయితే, ఆమెకు టిక్కెట్ దక్కలేదు. నామినేషన్‌ వేయకపోవడంతో ఆమె సోషల్‌ మీడియాలో తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. సీట్ల షేరింగ్ సమయంలో హింగోలి సీటును ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు వదిలిపెట్టారు.

Read More Delhi Assembly Elections: ఢిల్లీ ఎన్నికలు..

సార్వత్రిక ఎన్నికల సమయంలో బీజేపీ ఆమెకు హద్గావ్ హిమాయత్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గ పోల్ చీఫ్‌గా బాధ్యతలు అప్పగించింది. హింగోలి సీటును ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని వర్గం చేతిలో శివసేన కోల్పోయింది. కాగా, పాటిల్ హింగోలి-నాందేడ్ నియోజకవర్గానికి నాలుగుసార్లు ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో ఆమె గ్రామీణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు.