పెట్రోల్ ధరల పెంపుపై కర్ణాటక సీఎం సంచలన వ్యాఖ్యల

పెట్రోల్ ధరల పెంపుపై కర్ణాటక సీఎం సంచలన వ్యాఖ్యల

విశ్వంభర, కర్ణాటక : కర్ణాటక ప్రభుత్వం పెట్రోల్ ధరలను పెంచిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. పెట్రోల్ ధరల లీటర్‌కు రూ. 3 పెంచామని, అయినప్పటికీ దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే కర్ణాటకలో ఇంధన ధరలు ఇప్పటికీ తక్కువగానే ఉన్నాయని చెప్పారు. 'కర్ణాటక ప్రభుత్వం పెట్రోల్‌పై 29.84 శాతం, డీజిల్‌పై 18.44 శాతం వ్యాట్‌ను పెంచింది.

ఈ పెంపు నిర్ణయం తర్వాత కూడా రాష్ట్రంలో ఇంధనంపై పన్నులు ఇతర దక్షిణాది రాష్ట్రాలు, మహారాష్ట్రల కంటే తక్కువగానే ఉన్నాయని ' సిద్ధరామయ్య ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ఇదే సమయంలో బీజేపీపై ఆయన విమర్శలతో విరుచుకుపడ్డారు. గతంలో రాష్ట్ర వనరులను బీజేపీ ఇతర రాష్ట్రాలకు మళ్లించిందని ఆరోపించారు. గత రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌లపై వ్యాట్‌ను తగ్గించింది.

Read More రాయపూడి భవాని భూమికి వేసిన ఇనుప కంచె వివాదం

అయితే, కేంద్ర ప్రభుత్వం తన సొంత పన్నులను పెంచింది. ఈ అవకతవకల వల్ల కర్ణాటకకు ఆదాయం భారీగా తగ్గింది. కేంద్రం ప్రభుత్వం కన్నడిగులను మోసం చేసి తన ఖజానాను నింపుకుందని విమర్శించారు. తాజాగా పెంచిన ఇంధన ఛార్జీలను రాష్ట్ర ప్రభుత్వం ప్రజా రవాణాకు నిధులు సమకూర్చేందుకు వినియోగిస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు.