ఘోర రైలు ప్రమాదం.. రెండు రైళ్లు ఢీ

ఘోర రైలు ప్రమాదం.. రెండు రైళ్లు ఢీ

  • ఎక్స్‌ప్రెస్ రైలును ఢీకొట్టిన గూడ్స్
  • ఐదుగురు మృతి.. 200 మందికి తీవ్ర గాయాలు
  • సహాయక చర్యలు ముమ్మరం
  • పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో ఘటన

పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో ఇవాళ(సోమవారం) ఉదయం ఘోర రైలు ప్రమాదం సంభవించింది. రంగపాణి స్టేషన్ సమీపంలో ఆగి ఉన్న కాంచనజంగా ఎక్స్‌ప్రెస్ రైలును గూడ్స్ రైలు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కాంచనజంగా ఎక్స్‌ప్రెస్ రైలు వెనుక మూడు బోగీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు ప్రయాణికులు దుర్మరణం చెందారు. 200 మందికి తీవ్రగాయాలయ్యాయి. 

మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాద తీవ్రతను చూస్తే గూడ్స్ రైలు బోగీలు చెల్లా చెదురుగా పడిపోయాయి. ఎక్స్‌ప్రెస్ రైలు రెండు బోగీలు పట్టాలు తప్పాయి. ఓ బోగీ ఏకంగా గాల్లోకి లేచిందంటే ప్రమాదం ఏ స్థాయిలో జరిగిందో స్పష్టంగా కనిపిస్తోంది. విషయం తెలుసుకున్న రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగింది.

Read More తిరిగి మన మూలాల్లోకి వెళ్దాం:వెంకయ్య నాయుడు

వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. ఈ విషయంపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ట్విట్టర్‌లో ఓ పోస్ట్ చేస్తూ సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. న్యూ జల్పాయ్‌గుడి నుంచి ఎక్స్‌ప్రెస్ రైలు బయల్దేరిన కాసేపటికే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. సిగ్నలింగ్ లోపం కారణంగా ఒకే ట్రాక్‌పైకి రెండు రైళ్లు రావడంతో ప్రమాదం జరిగినట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు.

 

Related Posts