వేర్వేరు చోట్ల ఆర్టీసీ బస్కింద పడి ఇద్దరు దుర్మరణం
- ఫుట్బోర్డుపై నిలబడగా అదుపుతప్పి పడిపోయిన విద్యార్థిని..
- యూసుఫ్ గూడా బస్టాండ్ వద్ద ఘటన
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరో విద్యార్థి మృతి
ఆర్టీసీ బస్ కిందపడి వేర్వేరు చోట్ల ఇద్దరు మృతిచెందారు. ఆర్టీసీ బస్కింద పడి ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థిని దుర్మరణం చెందింది. ఈ ఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధి యూసుఫ్ గూడా బస్టాండ్ వద్ద జరిగింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. యూసుఫ్ గూడాలోని మాస్టర్స్ కాలేజీలో మెహరీన్ అనే విద్యార్థిని ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది.
శుక్రవారం ఉదయం బస్సు నిండా ప్రయాణికులతో నిండిపోగా బస్సు ముందు భాగంలో ఫుట్బోర్డుపై నిలబడింది. ఈ క్రమంలో బస్సు దిగడానికి ప్రయత్నించడంతో మూలమలుపు వద్ద విద్యార్థిని అదుపుతప్పి కిందపడిపోయింది. బస్సు వేగంగా వెళ్తుండటంతో డ్రైవర్ గమనించేలోపే ఘోరం జరిగింది. ఫుట్ బోర్డు పైనుంచి జారిపడగా బస్సు చక్రాల కిందపడి మెహరీన్ తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందింది.
సీసీటీవీ ఫుటేజ్
— Telugu Scribe (@TeluguScribe) June 14, 2024
మధుర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం
ఆర్టీసీ బస్ చక్రాల క్రింద పడి ఓ విద్యార్థిని దుర్మరణం.
యూసఫ్ గూడాలో ఉన్న మాస్టర్స్ కాలేజీలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న మెహరీన్ అనే విద్యార్థిని మృతి pic.twitter.com/wkiW7kmEla
ఈ సంఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా మరో ప్రమాదం రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది. రుద్రంగి గ్రామ శివారులో ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో బైక్పై ఉన్న ఇద్దరు యువకుల్లో ఒకరు అక్కడికక్కడే మృతిచెందారు. మృతుడు రుద్రంగికి చెందిన గండి అజయ్. మరో యువకుడు అభికి తీవ్రగాయాలయ్యాయి. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.