<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/national/category-2" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>National - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/category/2/rss</link>
                <description>National RSS Feed</description>
                
                            <item>
                <title>ఘనంగా రాజస్థాన్ దినోత్సవ వేడుకలు </title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, హైదరాబాదు : దేశ వికాసంలో రాజస్థాన్ ప్రజల పాత్ర ఎనలేనిదని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. ఏక్ భారత్ – శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాదు సోమవారం లోక్ భవన్‌లో రాజస్థాన్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాదులో నివసిస్తున్న రాజస్థాన్ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గవర్నర్ తన సతీమణితో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,  రాజస్థాన్‌కు దేశ సంస్కృతి, సంప్రదాయాల పరంగా ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు. భగవాన్ శ్రీరాముని స్ఫూర్తితో రాజస్థాన్ ప్రజలు దేశ అభివృద్ధి, సాంస్కృతిక వికాసానికి విశేష సేవలు అందిస్తున్నారని ప్రశంసించారు. వేడుకల అనంతరం నిర్వహించిన రాజస్థాన్ సాంస్కృతిక ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పాల్గొన్నవారు : శివ ప్రతాప్ శుక్లా, శశికిరణాచారి, ఇతర లోక్ భవన్ ఉన్నతాధికారులు, రాజస్థాన్ ప్రతినిధులు, హైదరాబాద్‌లోని రాజస్థాన్ సంఘ సభ్యులు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/national/grand-rajasthan-day-celebrations/article-12542"><img src="https://www.vishvambhara.com/media/400/2026-03/whatsapp-image-2026-03-31-at-9.16.36-am.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, హైదరాబాదు : దేశ వికాసంలో రాజస్థాన్ ప్రజల పాత్ర ఎనలేనిదని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. ఏక్ భారత్ – శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాదు సోమవారం లోక్ భవన్‌లో రాజస్థాన్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాదులో నివసిస్తున్న రాజస్థాన్ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గవర్నర్ తన సతీమణితో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,  రాజస్థాన్‌కు దేశ సంస్కృతి, సంప్రదాయాల పరంగా ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు. భగవాన్ శ్రీరాముని స్ఫూర్తితో రాజస్థాన్ ప్రజలు దేశ అభివృద్ధి, సాంస్కృతిక వికాసానికి విశేష సేవలు అందిస్తున్నారని ప్రశంసించారు. వేడుకల అనంతరం నిర్వహించిన రాజస్థాన్ సాంస్కృతిక ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పాల్గొన్నవారు : శివ ప్రతాప్ శుక్లా, శశికిరణాచారి, ఇతర లోక్ భవన్ ఉన్నతాధికారులు, రాజస్థాన్ ప్రతినిధులు, హైదరాబాద్‌లోని రాజస్థాన్ సంఘ సభ్యులు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>National</category>
                                    

                <link>https://www.vishvambhara.com/national/grand-rajasthan-day-celebrations/article-12542</link>
                <guid>https://www.vishvambhara.com/national/grand-rajasthan-day-celebrations/article-12542</guid>
                <pubDate>Tue, 31 Mar 2026 11:06:16 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-03/whatsapp-image-2026-03-31-at-9.16.36-am.jpeg"                         length="178025"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి </title>
                                    <description><![CDATA[<ul>
<li><span style="color:rgb(224,62,45);">భారతీయ మజ్దూర్ సంఘ్ సభ</span></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/national/the-problems-of-contract-workers-should-be-resolved/article-10212"><img src="https://www.vishvambhara.com/media/400/2026-03/231.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, పూణే : కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించి, హర్యానా ప్యాటర్న్ ఆధారంగా కాంట్రాక్టర్ రహిత విధానాన్ని అమలు చేయాలి అని భారతీయ మజ్దూర్ సంఘ్ అఖిల భారత అధ్యక్షుడు ఎస్. మల్లేశం అన్నారు. మహారాష్ట్ర విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సంఘం 6వ త్రైవార్షిక మహాసభ పూణేలో నిర్వహించారు. సభకు రాజ్యసభ సభ్యురాలు మేధా కులకర్ణి, మహావితరణ డైరెక్టర్ (మానవ వనరులు) రాజేంద్ర పవార్ హాజరయ్యారు. సభలో మాట్లాడుతూ ఎస్. మల్లేశం, దేశవ్యాప్తంగా మినిమమ్ ఫ్లోర్ వేజ్ ప్రకటించాలని, పెన్షన్ నిధి పెంచాలని, ఈఎస్‌ఐసి అర్హత పరిమితిని రూ.21,000 నుండి రూ.42,000కు పెంచాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికుల శాశ్వతీకరణపై తక్షణ నిర్ణయం తీసుకోవాలని కోరారు. రాష్ట్ర అధ్యక్షుడు అడ్వొకేట్ అనిల్ ఢుమణే, పెండింగ్ సమస్యల పరిష్కారార్థం ఏప్రిల్ 16న ముంబై బాంద్రాలోని శ్రమాయుక్త కార్యాలయం వద్ద భారీ ఆగ్రహ ర్యాలీ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ ర్యాలీలో రాష్ట్రవ్యాప్తంగా కార్మికులు పాల్గొని డిమాండ్ల సాధన కోసం ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. మహాసభలో సుమారు 2,300 మంది కార్మికులు పాల్గొన్నారు. నూతన కాలానికి రాష్ట్ర అధ్యక్షుడిగా నీలేశ్ ఖరాత్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సచిన్ మెన్గాలే ఎన్నికయ్యారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>National</category>
                                    

                <link>https://www.vishvambhara.com/national/the-problems-of-contract-workers-should-be-resolved/article-10212</link>
                <guid>https://www.vishvambhara.com/national/the-problems-of-contract-workers-should-be-resolved/article-10212</guid>
                <pubDate>Wed, 04 Mar 2026 15:08:49 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-03/231.jpeg"                         length="518048"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఆర్చరీలో సముద్రాల అఖిల్‌కు స్వర్ణం</title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాకు చెందిన వర్ధమాన ఆర్చర్ సముద్రాల అఖిల్ జాతీయ స్థాయిలో మరోసారి తన సత్తా చాటారు. ఖేలో ఇండియా సీనియర్ సౌత్ జోన్ నేషనల్ ఆర్చరీ ఛాంపియన్‌షిప్ 2026 పోటీలు పుదుచ్చేరిలో ఫిబ్రవరి 27 నుండి మార్చి 1 వరకు నిర్వహించగా, అఖిల్ అద్భుత ప్రదర్శనతో బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఈ విజయం అఖిల్ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. 2024లో ఇదే ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్న ఆయన, ఇప్పుడు 2026లో కూడా స్వర్ణం సాధించి వరుసగా రెండోసారి టైటిల్‌ను నిలబెట్టుకోవడం విశేషం. దక్షిణ భారతదేశంలోని ప్రతిభావంతులైన ఆర్చర్లను వెనక్కి నెట్టి ఆయన సాధించిన ఈ అద్భుత విజయం క్రీడా లోకంలో ప్రశంసలు అందుకుంటోంది. అఖిల్ సాధించిన ఈ ఘన విజయంపై మహబూబాబాద్ జిల్లా యువజన మరియు క్రీడల అధికారి డా. ఓలేటి జ్యోతి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. “సముద్రాల అఖిల్ సాధించిన ఈ విజయం మన</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/national/gold-for-akhil-of-the-seas-in-archery/article-10064"><img src="https://www.vishvambhara.com/media/400/2026-03/27.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాకు చెందిన వర్ధమాన ఆర్చర్ సముద్రాల అఖిల్ జాతీయ స్థాయిలో మరోసారి తన సత్తా చాటారు. ఖేలో ఇండియా సీనియర్ సౌత్ జోన్ నేషనల్ ఆర్చరీ ఛాంపియన్‌షిప్ 2026 పోటీలు పుదుచ్చేరిలో ఫిబ్రవరి 27 నుండి మార్చి 1 వరకు నిర్వహించగా, అఖిల్ అద్భుత ప్రదర్శనతో బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఈ విజయం అఖిల్ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. 2024లో ఇదే ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్న ఆయన, ఇప్పుడు 2026లో కూడా స్వర్ణం సాధించి వరుసగా రెండోసారి టైటిల్‌ను నిలబెట్టుకోవడం విశేషం. దక్షిణ భారతదేశంలోని ప్రతిభావంతులైన ఆర్చర్లను వెనక్కి నెట్టి ఆయన సాధించిన ఈ అద్భుత విజయం క్రీడా లోకంలో ప్రశంసలు అందుకుంటోంది. అఖిల్ సాధించిన ఈ ఘన విజయంపై మహబూబాబాద్ జిల్లా యువజన మరియు క్రీడల అధికారి డా. ఓలేటి జ్యోతి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. “సముద్రాల అఖిల్ సాధించిన ఈ విజయం మన జిల్లాకే గర్వకారణం. వరుసగా రెండోసారి జాతీయ స్థాయి సౌత్ జోన్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించడం సామాన్యమైన విషయం కాదు. అఖిల్ పట్టుదల, కఠోర శ్రమకు ఈ పతకమే నిదర్శనం. భవిష్యత్తులో ఆయన మరిన్ని అంతర్జాతీయ పథకాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను,” అని ఆమె పేర్కొన్నారు. అఖిల్ సాధించిన ఈ గెలుపు జిల్లాలోని తోటి క్రీడాకారులకు గొప్ప స్ఫూర్తినిస్తూ, మహబూబాబాద్ క్రీడా ప్రతిష్ఠను మరింత పెంచిందని అధికారులు తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>National</category>
                                            <category>Sports</category>
                                    

                <link>https://www.vishvambhara.com/national/gold-for-akhil-of-the-seas-in-archery/article-10064</link>
                <guid>https://www.vishvambhara.com/national/gold-for-akhil-of-the-seas-in-archery/article-10064</guid>
                <pubDate>Tue, 03 Mar 2026 10:27:02 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-03/27.jpeg"                         length="248090"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పశ్చిమ బెంగాల్ ఓటర్ల జాబితాలో 'భారీ' ప్రక్షాళన.. 66 లక్షల ఓట్లు కట్!</title>
                                    <description><![CDATA[<p>పశ్చిమ బెంగాల్ ఎన్నికల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఓటర్ల జాబితాలో భారీ మార్పులు జరిగాయి. </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/national/a-massive-purge-in-west-bengals-voter-list/article-9997"><img src="https://www.vishvambhara.com/media/400/2026-02/whatsapp-image-2026-02-28-at-8.40.36-pm.jpeg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, నేషనల్ బ్యూరో:</strong> పశ్చిమ బెంగాల్ ఎన్నికల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఓటర్ల జాబితాలో భారీ మార్పులు జరిగాయి. గత ఏడాది నవంబర్ 4న 7.66 కోట్ల మంది ఓటర్లతో ప్రారంభమైన ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ, అనేక విచారణల తర్వాత తుది అంకానికి చేరుకుంది. డిసెంబర్‌లో విడుదల చేసిన ముసాయిదా జాబితాలో అప్పట్లోనే 58 లక్షల ఓట్లను తొలగించగా, తుది జాబితా నాటికి ఆ సంఖ్య దాదాపు 66 లక్షలకు చేరుకుంది. మరణించిన వారు, శాశ్వతంగా వలస వెళ్ళిన వారు, నకిలీ ఓటర్లను గుర్తించి ఈ జాబితా నుంచి తొలగించినట్లు ఎన్నికల ప్రధాన అధికారి మనోజ్ అగర్వాల్ వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 7.04 కోట్లుగా నమోదైంది.</p>
<p><strong>'అడ్జుడికేషన్'లో 60 లక్షల మంది</strong><br />ఈ ప్రక్రియలో సుమారు 60.06 లక్షల మంది ఓటర్లను 'పరిశీలన' కేటగిరీలో ఉంచారు. వీరి దరఖాస్తుల్లో సాంకేతిక లోపాలు లేదా చిరునామా ధృవీకరణలో సమస్యలు ఉండటంతో, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నియమించబడిన జ్యుడిషియల్ అధికారులు వీటిని క్షుణ్ణంగా తనిఖీ చేయనున్నారు. వీరు క్లీన్ చిట్ ఇస్తేనే సప్లిమెంటరీ జాబితా ద్వారా ఓటు హక్కు లభిస్తుంది. లేదంటే ఈ 60 లక్షల ఓట్లు కూడా తొలగిపోయే ప్రమాదం ఉంది. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది.</p>
<p><strong>భబానీపుర్‌లో పెను మార్పులు.. రాజకీయ రచ్చ</strong><br />ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రాతినిధ్యం వహిస్తున్న భబానీపుర్ నియోజకవర్గంలో కూడా భారీగా ఓట్లు గల్లంతయ్యాయి. ఇక్కడ దాదాపు 47 వేల ఓట్లను తొలగించగా, మరో 14 వేల మందిని పరిశీలన జాబితాలో చేర్చారు. ఓట్ల తొలగింపుపై అధికార తృణమూల్ కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తోందని మమతా బెనర్జీ ఆరోపించారు. కాగా, నకిలీ ఓటర్లను తొలగించడం ద్వారా పారదర్శకమైన ఎన్నికలకు మార్గం సుగమం అయిందని బీజేపీ పేర్కొంటోంది. అసెంబ్లీ ఎన్నికలకు కేవలం కొద్ది నెలల సమయం మాత్రమే ఉండటంతో, ఈ ఓటర్ల జాబితా అంశం బెంగాల్ రాజకీయాలను మరింత వేడెక్కించింది.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                    

                <link>https://www.vishvambhara.com/national/a-massive-purge-in-west-bengals-voter-list/article-9997</link>
                <guid>https://www.vishvambhara.com/national/a-massive-purge-in-west-bengals-voter-list/article-9997</guid>
                <pubDate>Sat, 28 Feb 2026 20:41:49 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-02/whatsapp-image-2026-02-28-at-8.40.36-pm.jpeg"                         length="17809"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో 10 విమానాలు రద్దు</title>
                                    <description><![CDATA[<p>ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతుండటంతో హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వెళ్లాల్సిన విమానాలపై తీవ్ర ప్రభావం పడింది. </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/10-flights-canceled-at-shamshabad-airport/article-9994"><img src="https://www.vishvambhara.com/media/400/2026-02/whatsapp-image-2026-02-28-at-8.34.39-pm.jpeg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, తెలంగాణ బ్యూరో: </strong>ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతుండటంతో హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వెళ్లాల్సిన విమానాలపై తీవ్ర ప్రభావం పడింది. శనివారం ఒక్కరోజే సుమారు 10 అంతర్జాతీయ సర్వీసులు రద్దయ్యాయి. ముఖ్యంగా దుబాయ్, దోహా, అబుదాబి, మస్కట్, కువైట్ వంటి ప్రాంతాలకు వెళ్లాల్సిన విమానాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఎయిర్ ఇండియా, ఇండిగో సంస్థలు తమ గల్ఫ్ ఆపరేషన్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. గంటల తరబడి ఎయిర్‌పోర్ట్‌లోనే వేచి చూసిన ప్రయాణికులు, విమానాలు రద్దు కావడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు.</p>
<p><strong>నిప్పుల కొలిమిగా పశ్చిమాసియా గగనతలం</strong><br />యుద్ధం భీకర రూపం దాల్చడంతో ఇరాన్, ఇజ్రాయెల్‌తో పాటు ఖతార్, యూఏఈ, కువైట్, బెహ్రయిన్ వంటి దేశాలు తమ ఎయిర్ స్పేస్‌ను పాక్షికంగా లేదా పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించాయి. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు ఖతార్ రాజధాని దోహాలో పడటంతో అక్కడ భారీ విస్ఫోటనాలు సంభవించాయని ఆ దేశ రక్షణ శాఖ ధృవీకరించింది. భద్రతా కారణాల దృష్ట్యా అంతర్జాతీయ విమానయాన సంస్థలు తమ మార్గాలను మారుస్తున్నాయి. లుఫ్తాన్సా, విజ్ ఎయిర్ వంటి సంస్థలు మార్చి 7వ తేదీ వరకు తమ సర్వీసులను పూర్తిగా రద్దు చేశాయి. ఢిల్లీ నుంచి టెల్ అవీవ్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం ఇజ్రాయెల్ గగనతలం మూసివేతతో గాలిలోనే వెనక్కి తిరిగి ముంబైలో ల్యాండ్ అయింది.</p>
<p><strong>ప్రయాణికులకు హెచ్చరిక</strong><br />ప్రస్తుత అత్యవసర పరిస్థితుల దృష్ట్యా విమాన సర్వీసుల్లో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రయాణికులు తమ ప్రయాణానికి కనీసం 4-5 గంటల ముందే ఎయిర్‌లైన్ వెబ్‌సైట్లు లేదా హెల్ప్‌లైన్ ద్వారా విమాన స్థితిగతులను సరిచూసుకోవాలని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ అధికారులు విజ్ఞప్తి చేశారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయులు కూడా అప్రమత్తంగా ఉండాలని, ఎంబసీ సూచనలను పాటించాలని కేంద్ర విదేశాంగ శాఖ సూచించింది. యుద్ధం మరింత ముదిరితే మరిన్ని సర్వీసులు రద్దయ్యే అవకాశం ఉందని విమానయాన నిపుణులు అంచనా వేస్తున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>National</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/10-flights-canceled-at-shamshabad-airport/article-9994</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/10-flights-canceled-at-shamshabad-airport/article-9994</guid>
                <pubDate>Sat, 28 Feb 2026 20:35:41 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-02/whatsapp-image-2026-02-28-at-8.34.39-pm.jpeg"                         length="64115"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రాహుల్‌ గాంధీ నాయకత్వం దేశానికి అవసరం ఉంది : టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి</title>
                                    <description><![CDATA[<div>
<ul>
<li><span style="color:rgb(224,62,45);"><strong>రాహుల్ గాంధీ సలహాలు  ప్రధాని మోడీ వింటున్నారు కానీ అమలు చేయడం లేదు..</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>కరోనా రాకముందే రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని అలెర్ట్ చేసారు.</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>ఢిల్లీ కాలుష్య సమస్యపై పార్లమెంట్ లో రాహుల్ గాంధీ మాట్లాడి హెచ్చరిస్తున్నా,.. మోదీ ప్రధాని నిర్లక్ష్యం చేస్తున్నారూ.</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>ఢిల్లీ లిక్కర్‌ సీబీఐ కేసులో కల్వకుంట్ల కవితకు క్లీన్‌చిట్‌ ఇవ్వడం బీజేపీ పొలిటిలక్‌ గేమ్‌.</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>ఢిల్లీలో మీడియాతో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి.</strong></span></li>
</ul>
</div>
<p> </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/national/tpcc-working-president-jaggareddy-said-that-the-country-needs-the/article-9974"><img src="https://www.vishvambhara.com/media/400/2026-02/whatsapp-image-2026-02-27-at-10.38.04-am1.jpeg" alt=""></a><br /><div><span style="color:rgb(224,62,45);"><em><strong>విశ్వంభర,ఢిల్లీ </strong></em></span>: రాహుల్‌ గాంధీ నాయకత్వం దేశానికి అవసరం ఉందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి  పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతగా ఎంతో దూరదృష్టితో దేశం కోసం సలహాలు ఇస్తున్నారని, కానీ నరేంద్ర మోదీ నిర్లక్ష్యం చేస్తున్నారని, ఇది దేశానికే నష్టమని అన్నారు. గతంలో కరోనా గురించి హెచ్చరించారని, కేవలం మోదీ నిర్లక్ష్యంతోనే దేశంలో అంత నష్టం జరిగిందన్నారు. ప్రస్తుతం.. కాలుష్య సమస్యపై హెచ్చరిస్తున్నారని, మళ్లీ మోదీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా జగ్గారెడ్డి  తెలంగాణ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు కాంగ్రెస్‌ పార్టీలో ప్రతి కార్యకర్తకు అధిష్ఠానాన్ని అడిగే స్వేచ్ఛ, స్వాతంత్య్రం ఉంటుందని, జగ్గారెడ్డి అన్నారు. మనసులో మాట నిర్భయంగా చెప్పుకునే అవకాశం ఒక్క కాంగ్రెస్‌లోనే ఉందని, బీజేపీలో ఆ స్వేచ్ఛ ఉండదని, ఆ పార్టీలో కార్యకర్తల అభిప్రాయాలను వినేవాళ్లే ఉండరని పేర్కొన్నారు. రెండు జాతీయ పార్టీలే అయినా.. కాంగ్రెస్‌, బీజేపీలకు చాలా వ్యత్యాసం ఉందని చెప్పారు.</div>
<div> </div>
<div><img src="https://www.vishvambhara.com/media/2026-02/whatsapp-image-2026-02-27-at-10.34.15-am1.jpeg" alt="WhatsApp Image 2026-02-27 at 10.34.15 AM" width="1280" height="923"></img></div>
<div>గురువారం ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గేను కలిసి కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు వి.హనుమంతరావు, జెట్టి కుసుమకుమార్‌ల పేర్లు రాజ్యసభకు పరిశీలించాలని కోరానని చెప్పారు. తెలంగాణ నుంచి ఖాళీ అవుతున్న రెండు రాజ్యసభ స్థానాల కోసం ముఖ్యమంత్రి సలహాదారుడు వేం నరేందర్‌ రెడ్డి, మైనార్టీ నేత అజ్మతుల్లా ఖాన్‌, దళిత సామాజిక వర్గం నుంచి దొమ్మాటి సాంబయ్య, ఎస్టీ నుంచి బెల్లయ్య నాయక్‌ కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు తనకు తెలిసిందన్నారు. పార్టీ కోసం పనిచేసిన వారు తమను గుర్తించాలని అధిష్ఠానాన్ని అడగడంలో తప్పు లేదని పేర్కొన్నారు. రాష్ట్రం నుంచి ఖాళీ అవుతున్న రెండు స్థానానాల్లో ఒక స్థానంపై స్పష్టత ఉందని జగ్గారెడ్డి తెలిపారు. అయితే మరో స్థానం ఎలా దక్కించుకోవాలన్నది అధిష్ఠానం, సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌ చూసుకుంటారని తెలిపారు. అయితే సీఎం, పీసీసీ చీఫ్‌లు తమ అభిప్రాయాన్ని బహిర్గతం చేయలేరన్నారు. ఢిల్లీ లిక్కర్‌ సీబీఐ కేసులో రౌజ్‌ అవెన్యూ కోర్టు కల్వకుంట్ల కవితకు క్లీన్‌చిట్‌ ఇవ్వడం బీజేపీ పొలిటిలక్‌ గేమ్‌గా జగ్గారెడ్డి అభివర్ణించారు. లిక్కర్‌ మాఫియా గురించి మాట్లాడింది మొదట బీజేపీనేనని, కానీ.. ఇపుడు క్లీన్‌చిట్‌ ఇచ్చిందని వ్యాఖ్యానించారు. </div>
<div> </div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>National</category>
                                    

                <link>https://www.vishvambhara.com/national/tpcc-working-president-jaggareddy-said-that-the-country-needs-the/article-9974</link>
                <guid>https://www.vishvambhara.com/national/tpcc-working-president-jaggareddy-said-that-the-country-needs-the/article-9974</guid>
                <pubDate>Sat, 28 Feb 2026 14:04:02 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-02/whatsapp-image-2026-02-27-at-10.38.04-am1.jpeg"                         length="57870"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఓట్ల లెక్కింపు తర్వాత ‘రీ-వెరిఫికేషన్’.. కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం</title>
                                    <description><![CDATA[<p>ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఓడిపోయిన అభ్యర్థులు లేదా అనుమానాలు ఉన్న అభ్యర్థులు ఇప్పుడు నేరుగా ఈవీఎంలను, వీవీప్యాట్ స్లిప్పులను వెరిఫై చేసుకునే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/national/re-verification-after-counting-of-votes/article-9970"><img src="https://www.vishvambhara.com/media/400/2026-02/whatsapp-image-2026-02-27-at-7.18.38-pm.jpeg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, నేషనల్ బ్యూరో: </strong>ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఓడిపోయిన అభ్యర్థులు లేదా అనుమానాలు ఉన్న అభ్యర్థులు ఇప్పుడు నేరుగా ఈవీఎంలను, వీవీప్యాట్ స్లిప్పులను వెరిఫై చేసుకునే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. కౌంటింగ్ పూర్తయిన ఏడు రోజుల వరకు ఈ గడువు ఉంటుందని సీఈసీ జ్ఞానేశ్ కుమార్ స్పష్టం చేశారు. అయితే, ఈ ప్రక్రియ ఉచితం కాదు, దీని కోసం అభ్యర్థులు నిర్దేశించిన కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ వెరిఫికేషన్‌లో పొరపాట్లు జరిగినట్లు తేలితే, ఆ మొత్తాన్ని అభ్యర్థులకు తిరిగి రీఫండ్ చేస్తారు. ఈ నిర్ణయం వల్ల ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో, అభ్యర్థుల్లో విశ్వసనీయత పెరుగుతుందని ఈసీ భావిస్తోంది.</p>
<p><strong>తమిళనాడు ఎన్నికల ప్రణాళిక సిద్ధం</strong><br />తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో చెన్నైలో పర్యటించిన ఈసీ బృందం, రాష్ట్ర ఎన్నికల యంత్రాంగంతో సుదీర్ఘ సమీక్ష జరిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 75,000 పోలింగ్ స్టేషన్లలో ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల కనీస సౌకర్యాలు కల్పిస్తామని జ్ఞానేశ్ కుమార్ హామీ ఇచ్చారు. తమిళనాడులో అమలు చేస్తున్న ఎన్నికల నిర్వహణ విధానాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని ఆయన కొనియాడారు. రాజకీయ పార్టీల విన్నపం మేరకు ఒకే విడతలో ఎన్నికల నిర్వహణపై కూడా ఈసీ సానుకూలంగా స్పందించింది.</p>
<p><strong>కౌంటింగ్ విధానంలో మార్పులు</strong><br />ఎన్నికల కౌంటింగ్ రోజున పోస్టల్ బ్యాలెట్ల విషయంలో తరచూ తలెత్తే వివాదాలకు ఈసీ చెక్ పెట్టింది. సాధారణంగా ఈవీఎంల లెక్కింపుతో పాటే పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తుంటారు. కానీ, ఇప్పుడు ఈవీఎం రౌండ్లు ప్రారంభం కాకముందే కనీసం రెండు రౌండ్ల పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తి చేయాలని నిర్ణయించారు. దీనివల్ల ఫలితాల సరళిపై మరింత స్పష్టత వస్తుందని, అధికారులపై ఒత్తిడి తగ్గుతుందని సీఈసీ వివరించారు. </p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                    

                <link>https://www.vishvambhara.com/national/re-verification-after-counting-of-votes/article-9970</link>
                <guid>https://www.vishvambhara.com/national/re-verification-after-counting-of-votes/article-9970</guid>
                <pubDate>Fri, 27 Feb 2026 19:19:53 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-02/whatsapp-image-2026-02-27-at-7.18.38-pm.jpeg"                         length="41421"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కోల్‌కతాలో భూకంపం.. రోడ్లపైకి పరుగులు</title>
                                    <description><![CDATA[<p>పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో శుక్రవారం మధ్యాహ్నం భారీ భూకంపం సంభవించింది. మధ్యాహ్న సమయంలో అకస్మాత్తుగా భూమి కంపించడంతో నగరవాసులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/national/earthquake-hits-roads-in-kolkata/article-9968"><img src="https://www.vishvambhara.com/media/400/2026-02/whatsapp-image-2026-02-27-at-7.13.25-pm-(1).jpeg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, నేషనల్ బ్యూరో: </strong>పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో శుక్రవారం మధ్యాహ్నం భారీ భూకంపం సంభవించింది. మధ్యాహ్న సమయంలో అకస్మాత్తుగా భూమి కంపించడంతో నగరవాసులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఆఫీసుల్లో పని చేసుకుంటున్న ఉద్యోగులు, ఇళ్లలో ఉన్న వారు భవనాలు ఊగడాన్ని గమనించి భయంతో బయటకు పరుగులు తీశారు. కొన్ని సెకన్ల పాటు వచ్చిన ఈ ప్రకంపనలు నగరం, దాని పరిసర ప్రాంతాలను వణికించాయి. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.0 గా నమోదైంది.</p>
<p><strong>బంగ్లాదేశ్‌లో ప్రభావం.. నగరానికి చేరువలోనే కేంద్రం</strong><br />శుక్రవారం ఉదయం పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌లో 5.4 తీవ్రతతో భూకంపం సంభవించగా, దాని ప్రభావం కోల్‌కతాపై పడినట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే, కోల్‌కతాలో వచ్చిన ఈ ప్రకంపనల కేంద్రం నగరం నుంచి కేవలం 8 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నట్లు అధికారులు గుర్తించడం గమనార్హం. భూ అంతర్భాగంలో కదలికల వల్ల ఈ మధ్యాహ్నం భారీ శబ్దాలతో కూడిన ప్రకంపనలు వచ్చాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.</p>
<p><strong>నిలిచిపోయిన జనజీవనం</strong><br />భూకంపం వచ్చిన సమయంలో బహుళ అంతస్తుల భవనాల నుంచి జనం రోడ్లపైకి చేరుకోవడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. ప్రాథమిక నివేదికల ప్రకారం, ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణాపాయం జరిగినట్లు సమాచారం అందలేదు, కానీ కొన్ని చోట్ల పాత భవనాలకు స్వల్ప పగుళ్లు వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తదుపరి ప్రకంపనలు వచ్చే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ, డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు సూచించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                    

                <link>https://www.vishvambhara.com/national/earthquake-hits-roads-in-kolkata/article-9968</link>
                <guid>https://www.vishvambhara.com/national/earthquake-hits-roads-in-kolkata/article-9968</guid>
                <pubDate>Fri, 27 Feb 2026 19:14:21 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-02/whatsapp-image-2026-02-27-at-7.13.25-pm-%281%29.jpeg"                         length="92832"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>యుద్ధ హెలికాఫ్టర్ ‘ప్రచండ్’ లో ద్రౌపది ముర్ము విహారం</title>
                                    <description><![CDATA[<p> భారత సర్వసైన్యాధ్యక్షురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సరికొత్త చరిత్ర సృష్టించారు. శుక్రవారం రాజస్థాన్‌లోని జైసల్మేర్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌ను సందర్శించిన ఆమె, స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ ‘ప్రచండ్’లో ఆకాశ విహారం చేశారు. </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/national/draupadi-murmu-viharam-in-war-helicopter-prachand/article-9962"><img src="https://www.vishvambhara.com/media/400/2026-02/whatsapp-image-2026-02-27-at-6.53.00-pm.jpeg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, నేషనల్ బ్యూరో: </strong>భారత సర్వసైన్యాధ్యక్షురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సరికొత్త చరిత్ర సృష్టించారు. శుక్రవారం రాజస్థాన్‌లోని జైసల్మేర్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌ను సందర్శించిన ఆమె, స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ ‘ప్రచండ్’లో ఆకాశ విహారం చేశారు. ప్రత్యేకమైన ఫ్లైయింగ్ సూట్ ధరించి, కో-పైలట్ సీటులో కూర్చున్న రాష్ట్రపతి.. సుమారు 25 నిమిషాల పాటు గగనతలంలో ప్రయాణించారు. ప్రయాణ సమయంలో హెలికాప్టర్ సామర్థ్యాన్ని, పనితీరును పైలట్ల నుంచి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కాక్‌పిట్ నుంచే దేశ ప్రజలను ఉద్దేశించి "ప్రచండ్ దేశ స్వావలంబనకు చిహ్నం.. జై హింద్, జై భారత్" అంటూ గర్వంగా సందేశాన్ని పంపారు.</p>
<p><strong>సరిహద్దుల్లో భారత ‘ప్రచండ్’ శక్తి</strong><br />ఎల్‌సీహెచ్ ‘ప్రచండ్’ అనేది భారత రక్షణ రంగంలో అత్యంత కీలకమైన మైలురాయి. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ద్వారా స్వదేశీ సాంకేతికతతో తయారైన తొలి యుద్ధ హెలికాప్టర్ ఇదే కావడం విశేషం. అధునాతన ఏవియానిక్స్, శత్రువుల రాడార్లకు చిక్కని స్టెల్త్ ఫీచర్లు దీని సొంతం. కేవలం పగలే కాకుండా, కటిక చీకటిలోనూ దాడులు చేయగల సామర్థ్యం దీనికి ఉంది. అత్యంత ఎత్తైన ప్రదేశాల్లో, శీతల వాతావరణంలోనూ క్షిపణులు, రాకెట్లు, 20 ఎంఎం గన్‌ల ద్వారా శత్రువులను తుదముట్టించే సత్తా ఈ ‘ప్రచండ్’కు ఉంది.</p>
<p><strong>ఆత్మనిర్భర్ భారత్‌కు నిదర్శనం</strong><br />యుద్ధ విమానాలు, హెలికాప్టర్లలో రాష్ట్రపతులు ప్రయాణించడం ద్వారా సైన్యంలో మనోధైర్యాన్ని నింపే సంప్రదాయం కొనసాగుతోంది. ద్రౌపది ముర్ము ఈ సాహసం చేయడం ద్వారా స్వదేశీ పరిజ్ఞానానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించినట్లయింది. ప్రధాని మోదీ ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యంలో భాగంగా రక్షణ రంగంలో సాధిస్తున్న విజయాలకు ఈ సంఘటన ఒక ప్రతీకగా నిలిచింది. యుద్ధ రంగంలో మహిళా సాధికారతకు మరియు దేశ భద్రతలో అత్యున్నత పదవిలో ఉన్న వారు చూపిస్తున్న చొరవకు ఈ ప్రయాణం నిదర్శనమని రక్షణ నిపుణులు కొనియాడుతున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                    

                <link>https://www.vishvambhara.com/national/draupadi-murmu-viharam-in-war-helicopter-prachand/article-9962</link>
                <guid>https://www.vishvambhara.com/national/draupadi-murmu-viharam-in-war-helicopter-prachand/article-9962</guid>
                <pubDate>Fri, 27 Feb 2026 18:54:24 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-02/whatsapp-image-2026-02-27-at-6.53.00-pm.jpeg"                         length="62197"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ డీఎంకే గూటికి పన్నీర్‌ సెల్వం</title>
                                    <description><![CDATA[<p>తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు చోటుచేసుకుంది. అన్నాడీఎంకే  బహిష్కృత నేత, మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్‌ సెల్వం అధికార పార్టీ అయిన డీఎంకేలో చేరారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/national/tamil-nadu-assembly-elections-take-an-unexpected-turn/article-9958"><img src="https://www.vishvambhara.com/media/400/2026-02/whatsapp-image-2026-02-27-at-6.39.50-pm.jpeg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, నేషనల్ బ్యూరో:</strong> తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు చోటుచేసుకుంది. అన్నాడీఎంకే  బహిష్కృత నేత, మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్‌ సెల్వం అధికార పార్టీ అయిన డీఎంకేలో చేరారు. శుక్రవారం చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి స్టాలిన్ సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. స్టాలిన్ స్వయంగా సెల్వంకు కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. సెల్వంతో పాటు ఆయన కుమారుడు, మాజీ ఎంపీ రవీంద్రనాథ్, ఎమ్మెల్యే అయ్యప్పన్ , పెద్ద సంఖ్యలో అనుచరులు డీఎంకేలో చేరారు.</p>
<p><strong>తేని అడ్డాగా కొత్త వ్యూహం.. బోడి మెట్టు నుంచి పోటీ?</strong><br />రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓపీఎస్ తన సొంత నియోజకవర్గమైన తేనిలోని ‘బోడి మెట్టు’ నుంచి డీఎంకే అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. దివంగత ముఖ్యమంత్రి జయలలితకు అత్యంత విధేయుడిగా పేరుపొంది, మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న సెల్వం చేరికతో దక్షిణ తమిళనాడులో డీఎంకే బలం మరింత పెరగనుంది. ముఖ్యంగా తేని జిల్లాలో ఆయనకున్న గట్టి పట్టు పార్టీకి కలిసి వస్తుందని స్టాలిన్ భావిస్తున్నారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామితో దీర్ఘకాలంగా సాగుతున్న రాజకీయ విరోధం నేపథ్యంలో, ఈ పరిణామం పళనిస్వామి వర్గానికి గట్టి సవాలుగా మారనుంది.</p>
<p><strong>బహిష్కరణ నుంచి డీఎంకే పయనం వరకు</strong><br />2022లో అన్నాడీఎంకే నుంచి బహిష్కరణకు గురైన తర్వాత పన్నీర్‌ సెల్వం రాజకీయ ప్రస్థానం అనేక మలుపులు తిరిగింది. కొంతకాలం ఎన్డీయే కూటమితో కలిసి పనిచేసిన ఆయన, ఆ తర్వాత అక్కడా ఇమడలేక బయటకు వచ్చారు. తాజాగా డీఎంకేతో చేతులు కలపడం ద్వారా తన రాజకీయ భవిష్యత్తుకు కొత్త పునాది వేసుకున్నారు. జయలలిత వారసుడిగా తనను తాను చెప్పుకున్న నేత, ఇప్పుడు దశాబ్దాల కాలంగా ప్రత్యర్థిగా ఉన్న డీఎంకేలో చేరడం తమిళ రాజకీయాల్లో ఒక చారిత్రాత్మక మలుపుగా అభివర్ణించవచ్చు. </p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                    

                <link>https://www.vishvambhara.com/national/tamil-nadu-assembly-elections-take-an-unexpected-turn/article-9958</link>
                <guid>https://www.vishvambhara.com/national/tamil-nadu-assembly-elections-take-an-unexpected-turn/article-9958</guid>
                <pubDate>Fri, 27 Feb 2026 18:41:10 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-02/whatsapp-image-2026-02-27-at-6.39.50-pm.jpeg"                         length="74524"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>లిక్కర్ కేసులో క్లీన్‌చిట్‌పై సీబీఐ ‘రివర్స్’ అటాక్</title>
                                    <description><![CDATA[<p>ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మంగళవారం మధ్యాహ్నం రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/national/cbi-reverse-attack-on-clean-chit-in-liquor-case/article-9948"><img src="https://www.vishvambhara.com/media/400/2026-02/whatsapp-image-2026-02-27-at-5.50.23-pm.jpeg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, నేషనల్ బ్యూరో: </strong>ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మంగళవారం మధ్యాహ్నం రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సహా మొత్తం 23 మంది నిందితులకు క్లీన్‌చిట్ ఇస్తూ, వారిపై ఉన్న కేసును కోర్టు డిస్మిస్ చేసింది. అయితే, ఈ విజయం తాలూకు సంతోషం నిందితులకు ఎంతోసేపు నిలవలేదు. తీర్పు వెలువడిన కొద్ది గంటల్లోనే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించి, ట్రయల్ కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అప్పీల్ దాఖలు చేసింది.</p>
<p><strong>ఆధారాలు ఉన్నాయి.. మళ్లీ విచారించండి!</strong><br />ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పు ఏకపక్షంగా ఉందని, తమ వద్ద ఉన్న కీలక సాక్ష్యాలను, వాంగ్మూలాలను కోర్టు తక్కువ చేసి చూపిందని సీబీఐ తన పిటిషన్‌లో పేర్కొంది. లిక్కర్ పాలసీ రూపకల్పనలో భారీ స్థాయిలోఅవినీతి జరిగిందని, దీనికి సంబంధించి పక్కా ఆధారాలు ఉన్నాయని దర్యాప్తు సంస్థ వాదిస్తోంది. ఈ నేపథ్యంలో ట్రయల్ కోర్టు ఇచ్చిన క్లీన్‌చిట్‌పై వెంటనే స్టే విధించాలని, కేసును పునఃసమీక్షించాలని హైకోర్టును కోరింది.</p>
<p><strong>రాజకీయ సంక్షోభం దిశగా లిక్కర్ కేసు</strong><br />ఈ కేసులో క్లీన్‌చిట్ లభించడంతో ఆమ్ ఆద్మీ పార్టీ, బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నాయి. ముఖ్యంగా కల్వకుంట్ల కవితకు కూడా ఊరట లభించిన తరుణంలో సీబీఐ తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది కేవలం న్యాయపరమైన ప్రక్రియేనా లేక రాజకీయ ఒత్తిడితో చేస్తున్న ప్రయత్నమా అన్న చర్చ మొదలైంది. ఒకవేళ హైకోర్టు సీబీఐ పిటిషన్‌ను విచారణకు స్వీకరించి, స్టే విధిస్తే నిందితులందరికీ మళ్లీ కోర్టు చుట్టూ తిరగక తప్పదు.</p>
<p><strong>తదుపరి అడుగు ఎటు?</strong><br />హైకోర్టులో సీబీఐ వేసిన పిటిషన్ బుధవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. హైకోర్టు న్యాయమూర్తి దీనిపై ఎలాంటి ప్రాథమిక వ్యాఖ్యలు చేస్తారన్న దానిపై అందరి దృష్టి నెలకొంది. మరోవైపు, నిందితుల తరపు లాయర్లు కూడా కావ్యాట్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. తద్వారా తమ వాదన వినకుండా ఎలాంటి స్టే ఇవ్వకూడదని కోరనున్నారు.</p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>National</category>
                                    

                <link>https://www.vishvambhara.com/national/cbi-reverse-attack-on-clean-chit-in-liquor-case/article-9948</link>
                <guid>https://www.vishvambhara.com/national/cbi-reverse-attack-on-clean-chit-in-liquor-case/article-9948</guid>
                <pubDate>Fri, 27 Feb 2026 17:52:49 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-02/whatsapp-image-2026-02-27-at-5.50.23-pm.jpeg"                         length="98527"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఎన్సీఈఆర్టీ వివాదాస్పద బుక్‌ను నిషేధించిన సుప్రీం</title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, నేషనల్ బ్యూరో: జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) ఎనిమిదో తరగతి సాంఘిక శాస్త్రం కొత్త పాఠ్యపుస్తకంలో న్యాయవ్యవస్థలో అవినీతిపై ఒక అధ్యాయాన్ని ప్రచురించడం వివాదం అవుతోంది. ఈ అంశాన్ని సుమోటోగా పరిగణించిన సుప్రీంకోర్టు.. గురువారం విచారణను ప్రారంభించింది. ఇది న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు చేసిన కుట్రేనంటూ ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ వ్యవహారంలో బాధ్యులకు శిక్ష పడాలని సీజేఐ తీవ్రంగా స్పందించారు. ఈ విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానానికి కేంద్రం బేషరతుగా క్షమాపణలు చెప్పింది. ఈ వ్యవహారాన్ని తాము సమర్థించుకోవడం లేదని ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు వెల్లడించారు.ఈ విచారణలో సుప్రీంకోర్టు  ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘వాళ్లు ప్రయోగించిన బుల్లెట్‌తో న్యాయవ్యవస్థ రక్తం చిందిస్తోంది. న్యాయవ్యవస్థ అధికారాన్ని అణచివేసేలా, గౌరవాన్ని కించపర్చేలా ఉద్దేశపూర్వకంగా చేసిన చర్యగా కనిపిస్తోంది. దీనిని పట్టించుకోకుండా ఇలాగే వదిలేస్తే.. ప్రజలు, యువత మనసుల్లో న్యాయవ్యవస్థ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/national/supreme-court-bans-ncert-controversial-book/article-9844"><img src="https://www.vishvambhara.com/media/400/2026-02/w44.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, నేషనల్ బ్యూరో: జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) ఎనిమిదో తరగతి సాంఘిక శాస్త్రం కొత్త పాఠ్యపుస్తకంలో న్యాయవ్యవస్థలో అవినీతిపై ఒక అధ్యాయాన్ని ప్రచురించడం వివాదం అవుతోంది. ఈ అంశాన్ని సుమోటోగా పరిగణించిన సుప్రీంకోర్టు.. గురువారం విచారణను ప్రారంభించింది. ఇది న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు చేసిన కుట్రేనంటూ ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ వ్యవహారంలో బాధ్యులకు శిక్ష పడాలని సీజేఐ తీవ్రంగా స్పందించారు. ఈ విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానానికి కేంద్రం బేషరతుగా క్షమాపణలు చెప్పింది. ఈ వ్యవహారాన్ని తాము సమర్థించుకోవడం లేదని ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు వెల్లడించారు.ఈ విచారణలో సుప్రీంకోర్టు  ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘వాళ్లు ప్రయోగించిన బుల్లెట్‌తో న్యాయవ్యవస్థ రక్తం చిందిస్తోంది. న్యాయవ్యవస్థ అధికారాన్ని అణచివేసేలా, గౌరవాన్ని కించపర్చేలా ఉద్దేశపూర్వకంగా చేసిన చర్యగా కనిపిస్తోంది. దీనిని పట్టించుకోకుండా ఇలాగే వదిలేస్తే.. ప్రజలు, యువత మనసుల్లో న్యాయవ్యవస్థ పవిత్రత దెబ్బతినే అవకాశం ఉంది’’ అని ఆందోళన వ్యక్తంచేశారు. ‘‘అలాగే న్యాయవ్యవస్థ పాత్ర వివరించేందుకు ఒక పూర్తి అధ్యాయాన్ని ఎన్‌సీఈఆర్‌టీ కేటాయించింది. కానీ కోర్టుల విశిష్ట చరిత్రను మాత్రం వదిలేసింది. జవాబుదారీతనం ఏర్పడేవరకు ఈ వ్యవహారాన్ని మేం వదిలివేయబోం. దీనికి వెనక ఎవరు ఉన్నారో మేం తెలుసుకోవాలనుకుంటున్నాం’’ అని వ్యాఖ్యానించారు.అలాగే ఎన్‌సీఈఆర్‌టీ వివాదాస్పద పుస్తకంపై నిషేధం విధించింది. ఆ నిషేధాన్ని ఉల్లంఘిస్తే.. కఠినచర్యలు ఉంటాయని హెచ్చరించింది. ఆ సంస్థ డైరెక్టర్, స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీకి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరించాలని ఆదేశించింది. ఈ సందర్భంగా తుషార్‌ మెహతా స్పందిస్తూ.. న్యాయవ్యవస్థకు తామెప్పుడూ అండగా ఉంటామన్నారు. పబ్లిక్ నోటీసు ద్వారా బేషరతుగా క్షమాపణలు చెప్తామని కోర్టుకు తెలియజేశారు. తదుపరి విచారణ మార్చి 11న జరగనుంది.<br />ఇదీ జరిగింది..<br />పుస్తకంలో న్యాయవ్యవస్థపై అభ్యంతరకర వ్యాఖ్యలు ఉన్నాయని సీనియర్‌ న్యాయవాదులు కపిల్‌ సిబల్, అభిషేక్‌ సింఘ్వీలు సీజేఐ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. బుధవారం దానిపై స్పందించిన సీజేఐ..‘‘న్యాయవ్యవస్థకు కళంకం ఆపాదించేలా ఎవరు ప్రవర్తించినా అనుమతించను’’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు.ఈ నేపథ్యంలో న్యాయవ్యవస్థలో అవినీతి గురించిన పాఠ్యాంశంతో కూడుకున్న పుస్తక పంపిణీని నిలిపివేయాల్సిందిగా ఎన్‌సీఈఆర్‌టీని కేంద్ర విద్యాశాఖ ఇప్పటికే ఆదేశించింది. అసంబద్ధమైన విషయాలు పాఠ్యాంశంలో వచ్చాయని, నిర్ణయం తీసుకోవడంలో పొరపాటు వల్ల ఇలా జరిగిందని ఎన్‌సీఈఆర్‌టీ తెలిపింది. పాఠ్యపుస్తకాన్ని అధికారిక వెబ్‌సైట్‌ నుంచి తొలగించింది. అసంబద్ధమైన అంశాలను ప్రచురించినందుకు క్షమాపణ చెప్పింది.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                    

                <link>https://www.vishvambhara.com/national/supreme-court-bans-ncert-controversial-book/article-9844</link>
                <guid>https://www.vishvambhara.com/national/supreme-court-bans-ncert-controversial-book/article-9844</guid>
                <pubDate>Thu, 26 Feb 2026 16:12:23 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-02/w44.jpeg"                         length="84741"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        